సీమబద్ధ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 27:
వెంటనే అవకాశవాది అయిన తన కంపెనీ కార్మిక సంక్షేమశాఖ అధికారితో రహస్యంగా సంప్రదింపులు ప్రారంభించాడు శ్యామలేందు. ఫలితంగా ఫ్యాక్టరీ కార్మికుల్లో కలవరం సృష్టించబడింది. "మేము తీవ్రవాదులం" అని కొందరు విజృంభించి దౌర్జన్యాలు ప్రారంభించారు. ఫ్యాక్టరీ ఆవరణలో బాంబు పడింది. ఒక కాపలాదారుకు తీవ్రమైన గాయాలు తగిలాయి. ఒకవేళ అతనే చనిపోయి వుంటే?
'తాను మార్కెటింగ్ డైరెక్టర్ కావడానికి ఒక సామాన్యుడు చనిపోయినా ఏం?' అన్న తన ధోరణి సరియైనదేనా? అని మధనపడసాగాడు శ్యామలేందు.
"ఛటర్జీ! మీరెందుకు అలా అలోచిస్తారు? కలకత్తలో జనం చావడం లేదా?" అన్న కార్మిక సంక్షేమశాఖ అధికారి మాటలకు నవ్వుతూ అతనికి తన కృతజ్ఞతలు తెలుపుకున్నాడు శ్యామలేందు.
అయితే అతని మస్తిష్కంలో తుతుల్ అన్న మాటలు ఒక ప్రక్క నుంచి అతన్ని వెంటాడుతూనే ఉన్నాయి.
ఆమె శ్యామలేందును నిలదీసి అడిగింది "ఆ తీవ్రవాదులెవరో మీకు తెలియదా?" అని.
"ఎవరూ... ఆ అల్లర్లలో గాయపడ్డవాళ్ళా?" అని ఎగతాళిగా అడిగింది డోలన్ మధ్యలో కలుగజేసుకుంటూ.
==పురస్కారాలు==
|