వ్యాసుడు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: తరువాత కాలంలో → తరువాతి కాలంలో using AWB
పంక్తి 5:
వేదవ్యాసుడు జన్మ [[వృత్తాంతం]] [[పురాణములు|అష్టాదశ పురాణాలలో]] పెక్కు మార్పు మార్లు చెప్పబడింది. ఈ దిగువ నున్న వృత్తాంతం [[మహాభారతము]] [[ఆది పర్వం]] తృతీయా [[ఆశ్వాసము]] నండి గ్రహించబడింది.
 
పూర్వకాలములో చేది రాజ్యాన్ని [[వసువు]] అనే మహారాజు పరిపాలన చేస్తుండేవాడు, ఒకరోజు వేటకు [[అడవి]]కి వెళ్ళిన రాజు ఆ అడవిలో [[మునులు]] [[తపస్సు]] చేయడము చూసి తాను తపస్సు చేయడం ఆరంభించాడు. అప్పుడు [[ఇంద్రుడు]] అది గ్రహించి ఆ మహారాజు వద్దకు వెళ్ళి దైవత్వము ప్రసాదిస్తున్నాని చెప్పి ఒక విమానాన్ని ఇచ్చి, భూలోకములో రాజ్యం చేస్తూ, అప్పుడప్పుడు స్వర్గానికి రమ్మని చెబుతాడు. ఇంద్రుడు '''వేణుదుస్టి''' అనే అతి పరాక్రమ వంతమైన ఆయుధాన్ని కుడా ప్రసాదిస్తాడు. వసువు నివసిస్తున్న నగరానికి ప్రక్కగా శుక్తిమతి అనే నది ఉంది. శుక్తిమతి అనే నది ప్రక్కన ఉన్న కోలహలుడు అనే పర్వతము శుక్తిమతి మీద మోజుపడి ఆ నదిలో పడతాడు. అప్పుడు ఆ నది మార్గములో వెళ్తున్న వసువు తన ఆయుధంతో కోలహలుడిని ప్రక్కన పాడేస్తాడు. శుక్తిమతికి మరియు కోలహలుడికి మధ్య జరిగిన సంపర్కము వలన [[గిరిక]] అనే కుమార్తె వసుపదుడు అనే కుమారుడు జన్మిస్తారు. శుక్తిమతి వారివురిని వసువుకి కానుకగా ఇస్తుంది. వసువు గిరికని వివాహం చేసుకొంటాడు. వసువు వసుపదుడుని సైన్యాధిపతిగా చేస్తాడు. ఒకరోజు వసువు వేటకు వెళ్తాడు అప్పుడు తన భార్య గిరిక గుర్తు రావడంతో [[రేతస్సు]] పడుతుంది. ఆ పడిన [[రేతస్సు]]ని ఒక దొన్నెలో చేర్చి, ఆ దొన్నెని [[డేగ]]కి ఇచ్చి తన భార్యకి ఇవ్వమంటాడు. ఆ డేగ ఆ దొన్నెను తీసుకొని పోవుతుండగా మరో డేగ చూసి అది ఏదో తినే పదార్థం అని ఆలోచించి, ఆ డేగతో పోట్లాడూతుంది అప్పుడు ఆ [[రేతస్సు]] యమునా నదిలో పడుతుంది. ఆ యమునా నదిలో ఉన్న ఒక [[చేప]] ఆ [[రేతస్సు]] అని భక్షిస్తుంది ఆ భక్షించడం వల్ల అది అండంతో కూడి పిండంగా మారుతుంది. ఒకరోజు బెస్తవారు[[బెస్త]]<nowiki/>వారు చేపలు పట్టు తుండగా ఈ [[చేప]] చిక్కుతుంది. ఆ చేపను బెస్తవారు వారి రాజైన దాశరాజు వద్దకు తీసుకొని పోతారు.
 
దాశరాజు ఆ చేపని చీల్చి చూడగా ఆ చేపలో ఒక మగ శిశువు మరియు మరో ఆడ [[శిశువు]] ఉంటారు. బ్రహ్మ శాపం వల్ల ఒక అద్రిక అనే అప్సరస చేప క్రింద మారి యమునా నదిలో ఉంది. చేపని చీల్చిన వేంటనే అ చేప అక్కడ నుండి అంతర్థానమై పోయింది. ఆ మగ బిడ్డ పెద్దవాడై ఆ రాజ్యానికి రాజయ్యాడు. ఆ బాలిక మత్స్యగంధి పేరుతో పెద్దదయ్యింది. మత్స్యగంధి తండ్రి లేనప్పుడు [[యమునా నది]] పై [[నావ]] నడుపుతుండేది. ఇలా జరుగుతుండగా ఒక రోజు [[వశిష్ట మహర్షి]] మనమడు, శక్తి మహర్షి కుమారుడాయిన [[పరాశరుడు]] ఆ నది దాటడానికి అక్కడకు వస్తాడు.
 
అక్కడ కనిపించిన [[మత్స్యగంధి]]ని చూసి మోహించే [[రతి]] సుఖాన్ని ఇవ్వమంటాడు, అప్పుడు మత్స్యగంధి తన శరీరం అంతా చేపల [[వాసన]]తో ఉంటుందని, కన్యత్వం చెడిన తాను తన తండ్రికి ఏవిధంగా మొగము చూపగలని ప్రశ్నిస్తుంది. అప్పుడు [[పరాశరుడు]] మత్స్యగంధి వసువు వీర్యానికి అద్రిక నే [[అప్సరస]]కి జన్మించినది అనిజన్మ వృత్తాంతం చెబుతాడు. చేపల వాసన పోయేటట్లుగా ఒక యోజన దూరము వరకు [[సుగంధం]] వెదజల్లేటట్లు వరాన్ని ఇస్తాడు. అప్పటి నుండి యోజన గంధిగా పేరు పొందింది. అప్పటి రతి జరపడానికి సంకోచిస్తున్న మత్స్యగంధితో పరాశరుడు ఆమె [[కన్యత్వం]] చెడకుండా ఉండే వరాన్ని ఇస్తాడు. పగటి పూట రతి సలపడం అనే విషయం వ్యక్తపరిస్తే, అక్కడా ఉన్న ప్రదేశాన్ని మేఘాలతో కప్పేస్తాడు. ఆ విధంగా రతి జరపగా ఒక తేజోవంతుడైన [[శిశువు]] జన్మిస్తాడు. ఆ శిశువు పుట్టిన వెంటనే తల్లికి తండ్రికి నమస్కరించి తపస్సుకి వెళ్ళి పోతాడు. తల్లికి ఎప్పుడైన మననం చేసుకొంటే ప్రత్యక్షమయ్యే వరాన్ని ఇస్తాడు.
==భారతంలో వ్యాసుని పాత్ర==
మహాభారతాన్ని రచించిన వ్యాసుడు భారతకథలో ఒకభాగమై ఉన్నాడు. అయినప్పటికీ వ్యాసుడు కర్తవ్యనిర్వహణ మాత్రమే చేస్తూ మిగిలిన వారికి కర్తవ్యబోధ చేస్తూ తిరిగి తనదారిన తాను వెళ్ళిపోతాడు.
* వ్యాసుడు జన్మించిన వెంటనే [[తల్లి]] అనుమతితో తపోవనానికి వెళతాడు. ఆ తరువాత సత్యవతీ శంతనుల వివాహం జరిగింది.
* సత్యవతీ [[శంతనుల]] వివాహకాలంలో దాశరాజు విధించిన షరతుల కారణంగా [[భీష్ముడు]] ఆమరణాంతం బ్రహ్మచర్య వ్రతం అవలంబిస్తానని భీషణ ప్రతిజ్ఞ చేశాడు. శంతనుని మరణం తరువాత వారి కుమారులైన [[చిత్రాంగధుడు]] బలగర్వంతో గంధర్వుని చేతిలో [[మరణం]] చెందాడు. విచిత్రవీరుడు సుఖలాలసతో అకాలమరణం చెందాడు. భరతవంశం వారసులను కోల్పోయిన తరుణంలో సత్యవతి భరతవంశ పునరుద్ధరణ కొరకు తన పుత్రుడైన వ్యాసుని మనన మాత్రంచే తన వద్దకు రప్పించింది. భరతవంశాన్ని నిలపమని వ్యాసునికి ఆదేశించింది. తల్లి ఆదేశాన్ననుసరించి వ్యాసుడు అంబికకు[[అంబిక]]<nowiki/>కు దృతరాష్ట్రుని, అంబాలికకు[[అంబాలిక]]<nowiki/>కు పాండురాజుని[[పాండురాజు]]<nowiki/>ని మరియు దాశీకు విదురుని ప్రసాదించి తిరిగి తపోవనానికి వెళతాడు.
* ఆతరువాత వ్యాసుడు [[గాంధారి]] గర్భస్రావం సమయంలో ప్రవేశించి గాంధారి మృత పిండం నూట ఒక్క నేతికుండలలో పెట్టి వాటిని పరిరక్షించే విధానాన్ని చెప్పి తిరిగి తనదారిన తాను వెళతాడు. * దుర్యోధనుడు భీమునిపై మూడుమార్లు హత్యాప్రయత్నం జరిపిన పిమ్మట తన తల్లికి కురువంశంలో రానున్న పెను దుష్పరిణామాలు సూచించి వాటిని ఆమె తట్టుకోవడం కష్టమని తపోవనానికి వెళ్ళి ప్రశాంత జీవితం గడపమని సూచించి తిరిగి తనదారిన తాను వెళతాడు. ఆ
* తరువాత [[లక్క]] ఇంటి దహనం తరువాత హిడింబాసురుని మరనానంతరం హిడింబి భవిష్య సూచనపై శాలిహోత్రుడు నివసించిన ఆశ్రమప్రాంతంలో పాడవులు నివసించే సమయంలో వ్యాసుడు పాండవుల చెంతకు వచ్చి వారికి ఊరట కలిగించాడు. ఆ ఆశ్రమ మహత్యం చెప్పి అక్కడ సరస్సులో జలము త్రాగిన వారికి ఆకలి దప్పులు ఉండవని, అక్కడి వృక్షముకింద నివసించే వారికి శైత్య, వాత, వర్ష, ఆతప [[భయము]]లుండవని సలహా అందించాడు. భీముని వివాహమాడ కోరిన హిడింబను కోడలిగా చేసుకోవడానికి సంశయిస్తున్న [[కుంతీదేవికి]] హిడింబ [[పతివ్రత]] అని ఆమెను కోడలిగా చేసుకోవడం శుభప్రథమని ఆమె [[సంతానం]] ద్వారా పాండవులకు సహాయమందగలరచి సూచించి తనదారిని తాను వెళతాడు.
"https://te.wikipedia.org/wiki/వ్యాసుడు" నుండి వెలికితీశారు