#ఈ దేవాలయం [[మంగినపూడి (మచిలీపట్నం)|మంగినపూడి]] బీచ్ కి చాలా దగ్గరలో ఉంది. ఇక్కడి దేవాలయంలో ప్రధాన దైవం విష్ణువు. పండరీపురములో ఉన్న దేవాలయము వలే ఇక్కడ దేవాలయము ఉంటుంది.[[కంసాలి]] [[(విశ్వబ్రాహ్మణ]]) కులస్తులే పౌరోహిత్యం చేస్తారు.భక్తులను గర్భ గుడిలోకి అనుమతిస్తారు.స్వామివారి పాదాలను పట్టుకోనిస్తారు.
#ఈ ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు, ప్రతి సంవత్సరం, కార్తీకఏకాదశి నుండి పౌర్ణమి వరకు వైభవంగా నిర్వహించెదరు. ఏకాదశి రోజున విఘ్నేశ్వర పూజతో మొదలగును. ద్వాదశిరోజున స్వామివారి కళ్యాణం, త్రయోదశి రోజున రథోత్సవం, చతుర్దశి రోజున ఘంటశాల గానామృతం, కార్తీకపౌర్ణమి రోజున నిర్వహించెదరు. అన్నసమారాధన, కార్తీకస్నానాలు నిర్వహించెదరు. ఈ ఉత్సవాలలో భాగంగా పండరీభజనలు, కోలాటాలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించెదరు. [2]