చేరామన్ జామా మస్జిద్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎బయటి లింకులు: {{commonscat|Cheraman Juma Masjid}}
పంక్తి 44:
చేరామన్ జమా మసీదు కొడంగలూర్ లో అత్యంత ప్రసిద్ధి చెందిన ధార్మిక గమ్యం. క్రీ.శ 629 లో [[మాలిక్ బిన్ దీనార్]] చే నిర్మించబడ్డ ఈ మసీదు భారతదేశం లోనే అత్యంత ప్రాచీనమైన మసీదుగా లెక్కించబడుతుంది. ప్రపంచంలోనే ఇది రెండవ అతి పురాతన మసీదు గా నమోదు చెందింది.
==మలిచరిత్ర==
చరిత్రానుసారం క్రీ.శ. 1341 లో వచ్చిన వరద ఈ మసీదు ని చాలా మేరకు ధ్వంసం చేసింది. నేడు మనం చూస్తున్న చేరామన్ జమా మసీదు కొత్తగా కట్టబడింది. మసీదు నిర్మాణం గుర్తించ తగ్గది. హిందూ దేవాలయాల శైలి , ఆకృతి ని అనుసరిస్తుంది. మసీదు మధ్యలో ఒక నూనె దీపం వెలుగుతూ ఉంటుంది. మంగళప్రదమైన రోజుల్లో మత విశ్వాసాలకి అతీతంగా ప్రజలందరూ ఈ దీపం కొరకు నూనె తెస్తారు. మసీదు లో పెట్టబడిన ఇత్తడి నూనె దీపాలు నిర్మాణ సౌందర్యానికి మరింత వన్నె తెస్తాయి. అద్భుతమైన చెక్కడాలు గల నూకమాను (రోజ్ వుడ్) వేదిక మిక్కిలి ఆకర్షణీయంగా ఉంటుంది. [[మక్కా]] నించి తెప్పించబడినిది గా నమ్ముతున్న పాల రాయి ముక్క మసీదు లో ఉంచబడింది. చేరామన్ జమా మసీదు భారతదేశం లోని మహమ్మదీయ చరిత్ర లో ప్రముఖ భూమిక పోషిస్తుంది. కొడంగలూర్ వెళ్ళిన యాత్రికులు దీనిని తప్పక సందర్శించాలి .
 
==సందర్శకులు==
దేశవిదేశాలకు చెందినా అనేక సందర్శకులు ఈ మస్జిద్ ను సందర్శించడానికి వస్తారు. భారత మాజీ రాష్ట్రపతి [[ఏ.పి.జె.అబ్దుల్ కలాం]] కూడా సందర్శించారు.<ref name="hindu">Staff Reporter. "Kalam to visit oldest mosque in sub-continent". ''The Hindu'' [Chennai, Tamil Nadu] 23 Jul, 2005: Kerala - Thrissur. Web [http://www.hindu.com/2005/07/23/stories/2005072306490500.htm]</ref>