#ఈ గ్రామానికి చెందిన శ్రీ *[[తొండెపు అనిల్ ప్రసన్న]] అను సివిల్ ఇంజనీరింగ్ పట్టభద్రుడు రూర్కీ (ఉత్తరాఖండ్) లో ఉన్న సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో శిక్షణ శాస్త్రవేత్తగా ఎంపికయ్యాడు. దేశం మొత్తం మీద 18 మంది మాత్రమే (ఇతనితో గూడి) యెంపికయ్యారు. ఈ సంస్థ దేశంలో యిదొక్కటే. ఇతనికి నెలకు రు. 20,000 భృతిగా ఇస్తారు.<ref>[ఈనాడు గుంటూరు రూరల్ జూలై 27 2011, పేజీ-2.]</ref>
#తుళ్ళూరు గ్రామ పరిధిలోని పొన్నమ్మవారి వీధిలోని ఒక సాధారణ కుటుంబానికి చెందిన శ్రీ *[[గొరిజాల మహేశ్,]] [[నూజివీడు]]<nowiki/>లోని ఐ.ఐ.ఐ.టి.లో బి.టెక్.93% మార్కులతో ఉత్తీర్ణుడై, ప్రస్తుతం [[బెంగుళూరు]]<nowiki/>లోని ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. ఈయన ఇటీవల గేట్ (Graduate Aptitude Test in Engineering) ప్రవేశ పరీక్ష ఇ.సి.ఇ. విభాగంలో వ్రాయగా, వాటి ఫలితాలు, 2015,మార్చి-12వ తేదీనాడు వెల్లడించారు. ఆ ప్రవేశ పరీక్షలో, ఈయన 1000 స్కోర్, 82.9 మార్కులు సంపాదించి, జాతీయస్థాయిలో నాల్గవ రాంకు దక్కించుకున్నారు. [3]
==గ్రామ విశేషాలు==
2008వ సంవత్సరంలో ఈ గ్రామాన్ని నిర్మల్ పురస్కారం గ్రామంగా ఎంపిక చేశారు. [2]