కాసు బ్రహ్మానందరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 25:
}}
 
అనన్య మేధావి, రాజనీతి చతురుడు, అపర చాణక్యుడు, వాసికెక్కిన రాజకీయవేత్తలలో ప్రముఖుడు '''[[కాసు బ్రహ్మానందరెడ్డి]]''' ([[జూలై 28]], [[1909]] - [[మే 20]], [[1994]]). ఆయన తలపై టోపీని అటూ ఇటూ మార్చితే అమోఘ మైన రాజకీయ ఎత్తు వేసినట్టే. [[ఆంధ్ర ప్రదేశ్‌]] రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి. కేంద్ర, రాష్ట్రాల్లో మంత్రి పదవులతో పాటు అనేక పదవులను ఆయన విజయవంతంగా[[విజయవంతం]]<nowiki/>గా నిర్వహించాడు.
== జననం, విద్యాభ్యాసం ==
బ్రహ్మానందరెడ్డి [[1909]] [[జూలై 28]] న [[గుంటూరు]] జిల్లా [[నరసరావుపేట]] సమీపాన [[తూబాడు]] గ్రామంలో జన్మించాడు. [[మదరాసు]] పచ్చయప్ప కళాశాలలో పట్టా, పిమ్మట [[న్యాయం|న్యాయ]] పట్టా పుచ్చుకున్నాడు.
 
== స్వాతంత్ర్య సమర పోరాటం ==
పన్నెండటవ ఏట [[విజయవాడ]] [[కాంగ్రెసు]] సదస్సుకు విచ్చేసిన [[మహాత్మా గాంధీ]]ని సందర్శించాడు. వారి బోధనలో ప్రభావితుడై శాకాహారిగా ఉంటానని ప్రమాణం చేసాడు. జీవితాంతం [[ఖద్దరు]] ధరించాడు. [[టంగుటూరి ప్రకాశం]] పంతులు సాహచార్యం, బోధనలు అతనిని స్వాతంత్ర్య ఉద్యమం వైపు నడిపాయి. లా ప్రాక్టీసును పక్కనబెట్టి [[బ్రిటిషు]] వారిపై పోరాటానికి ఉత్సాహంగా కదిలాడు. పోలీసు లాఠీ దెబ్బలు తిన్నాడు. [[సత్యాగ్రహ ఉద్యమం]] లో పాల్గొని జైలుశిక్ష అనుభవించాడు. 1942లో [[బ్రిటిషు]] వారికి వ్యతిరేకంగా [[కాంగ్రెసు]] పిలుపు మేరకు [[క్విట్ ఇండియా ఉద్యమం]]లో పాల్గొని జైలుకెళ్లాడు.
 
== రాజకీయ ప్రస్థానం ==
జిల్లాబోర్డు సభ్యునిగా ప్రారంభమైంది ఆయన రాజకీయ జీవితం. ఉమ్మడి [[మదరాసు]] రాష్ట్రంలో మొదటి సారిగా 1946 లో శాసన సభ్యునిగా ఎన్నికైనాడు. 1946 నుండి 1952 వరకు, 1952 నుండి 1972 వరకు శాసన సభకు ఎన్నికైనాడు. 1952నుండి 1956 వరకు రాష్ట్ర కాంగ్రెసు కమీటికి ప్రధాన కార్యదర్శిగా పనిచేసాడు. [[ఆంధ్ర ప్రదేశ్]] ఏర్పడిన తరువాత 1956 లో పురపాలక శాఖ మంత్రిగా [[నీలం సంజీవరెడ్డి]] మంత్రి వర్గంలో చేరాడు. పిమ్మట [[దామోదరం సంజీవయ్య]] మంత్రి వర్గంలో కొనసాగి [[వాణిజ్యశాస్త్రం|వాణిజ్య]] శాఖ, [[ఆర్థిక శాస్త్రము|ఆర్థిక]] శాఖలు నిర్వహించాడు. ఆర్థిక శాఖను అతడు అత్యంత సమర్థవంతంగా నిర్వహించాడు. 1964 వ సంవత్ఫరం ఫిబ్రవరి 29 న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా[[ముఖ్యమంత్రి]]<nowiki/>గా ప్రమాణ స్వీకారం చేసాడు. అప్పటి తెలంగాణా ఉద్యమం సెగతో అతడు 1971 సెప్టెంబరు 15న [[ముఖ్యమంత్రి]] పదవికి రాజీనామా చేశాడు. కేంద్రమంత్రి వర్గంలో 1974 వ సంవత్సరంలో బాధ్యతలు చేపట్టి, కమ్యూనికేషన్, హోం, పరిశ్రమల శాఖలను నిర్వహించాడు.
 
== ఎఐసీసీ సారథ్యం ==
[[1977]]లో జరిగిన [[లోక్ సభ]] ఎన్నికలలో [[కాంగ్రెసు]] ఓటమి పాలైంది. కాంగ్రెసు పార్టీ ఓడిపోవడం అదే ప్రథమం. ఆ సమయంలో [[కాంగ్రెసు]] అధ్యక్ష పదవికి [[పశ్చిమబెంగాల్]] కు చెందిన సీనియర్ కాంగ్రెసు నేత [[సిద్ధార్థ శంకర్ రే]] పై పోటీచేసి విజయం సాధించాడు. అధ్యక్ష పదవికి ఎన్నిక జరిగి, అలా ఎన్నికైన అతి కొద్ది మంది అధ్యక్షులలో ఆయన ఒకడు. ఓటమి పిమ్మట, పతనావస్థధలో ఉన్న పార్టీని పునరుజ్జీవంపజేసేందుకు శాయశక్తులా పనిచేసాడు. తదనంతరం [[ఇందిరాగాంధీ]]తో విభేదాలు తలెత్తాయి. ఆమెను ఏకంగా పార్టీ నుంచి బహిష్కరించారు. దీంతో [[కాంగ్రెస్]] నిట్టనిలువునా చీలింది. ఒక వర్గానికి [[ఇందిరాగాంధీ]] నాయకత్వం వహించగా, మరో వర్గానికి కాసు సారథ్యం వహించాడు. ఆయన నేతృత్వంలోని పార్టీ రెడ్డి కాంగ్రెస్ గా రూపాంతరం చెందింది. [[1978]] లో రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో డాక్టర్ [[మర్రి చెన్నారెడ్డి]] నేతృత్వంలో ఇందిరా కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఆయనలో ఆత్మ పరిశీలన మొదలైంది. ఫలితంగా రెడ్డి కాంగ్రెసును [[1980]] లో ఇందిరాకాంగ్రెసులో విలీనం చేశాడు.
 
== రాష్ట్రప్రగతి కి సోపానాలు ==
రాష్ట్ర ప్రగతికి బ్రహ్మానంద రెడ్డి ఆహార్నిశలు శ్రమించాడు. అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమర్ధవంతంగా అమలు పరిచాడు. రాష్ట్రాభివృద్ధికి దోహదపడే దీర్ఘకాలిక ప్రాజెక్టుల పనులను పూర్తి చేయించాడు. బహుళార్థ సాధక ప్రాజెక్టు [[నాగార్జున సాగర్ ప్రాజెక్టు|నాగార్జున సాగర్]] పనులు కాసు హయాంలోనే పూర్తయ్యాయి. సాగర్ నిర్మాణానికి అవసరమైన నిధుల సేకరణకు ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడు. దేశంలో అతిపెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్టును పూర్తి చేసేందుకు తపన పడ్డాడు. [[నాగార్జునసాగర్]] మొదటిదశ పూర్తి కాగానే, 1966 ఫిబ్రవరి ఆగస్టు 3న నాటి ప్రధాని [[ఇందిరాగాంధీ]] ప్రారంభించారు. రాయలసీమ ప్రాంతానికి వరదాయిని అయిన [[తుంగభద్ర ప్రాజెక్టు]] హైలెవల్ కెనాల్ ప్రాజెక్టుకు అవసరమైన క్లియరెన్సుల మంజూరు, నిధులు సమకూర్చడానికి కాసు బ్రహ్మానంద రెడ్డి కృషి చేసాడు. [[పోచంపాడు]] ప్రాజెక్టుకు రూపకల్పన చేసాడు. అప్పట్లో ఎల్.ఐ.సి.నుంచి పది కోట్ల రూపాయల రుణాన్ని తీసుకుని బలహీనవర్గాల వారికి ఇళ్లు నిర్మించాడు. ఆయన హయాంలో పంచాయతీ చట్టం అమలులోకి వచ్చింది. [[సికింద్రాబాదు]] కేంద్రంగా దక్షిణ మధ్య రైల్వే మండలం ఏర్పాటు కావడం వెనుక ఆయన కృషి ఎంతో ఉంది.
 
== మరణం ==