పెంటపాడు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 107:
== చరిత్ర ==
=== క్విట్ ఇండియా ఉద్యమం ===
1942 ఆగస్టు నెలలో [[క్విట్ ఇండియా ఉద్యమం]]లో భాగంగా పెంటపాడు గ్రామంలోని పోస్టాఫీసు మీద, టెలిగ్రాఫ్ స్తంభాల మీద ఆంగ్ల వలస పాలనకు నిరసనగా దాడిచేసి స్థానిక స్వాతంత్ర సమర యోధులు జాతీయ స్థాయి పోరాటానికి సంఘీభావం ప్రకటించారు. గాంధీజీ అరెస్టు వార్త తెలిసినాకా ఆగస్టు 15 నుంచి ఎస్టివిఎన్ హిందూ పాఠశాల విద్యార్థులు క్లాసులు బహిష్కరించారు, కొద్దిరోజుల్లోనే సమీపంలోని భీమవరంలో ఉద్యమకారులపై కాల్పుల దుర్ఘటన జరిగిందని తెలిసిన విద్యార్థులు ఆగ్రహోదగ్రులయ్యారు. స్థానిక [[భారత జాతీయ కాంగ్రెస్|కాంగ్రెస్]] నాయకుడు సత్యనారాయణరెడ్డి విద్యార్థులను సమావేశపరిచి ప్రసంగిస్తూ [[ముంబై|బొంబాయి]]లో జాతీయ నాయకులను అరెస్టుచేయడం, [[భీమవరం]]లో ప్రజలపై కాల్పులు జరపడం వంటివి చెప్పి ప్రభుత్వాస్తులు ధ్వంసం చేసి వారికి గుణపాఠం నేర్పాలని సూచించాడు. సత్యనారాయణరెడ్డి నాయకత్వంలో 300 మంది విద్యార్థులు ఊరేగింపుగా వెళ్ళి ముందు పీడబ్ల్యుడి ఆఫీసు మీద, పోస్టాఫీసు మీద దాడిచేశారు. తాళం వేసివున్న పోస్టాఫీసును బద్దలుకొట్టి లోపలి వస్తువులు నాశనం చేసి, రికార్డులు తగలబెట్టారు. పిడబ్ల్యుడి అధికారి, పోస్టు మాస్టరుల ఫిర్యాదుమేరకు బి.సత్యనారాయణరెడ్డి, ఎం.దుర్గాప్రసాద్, సారంగపాణి, పాషా సాహెబ్, వరదా బ్రహ్మానందం, [[ప్రత్తి శేషయ్య]], తాడేపల్లి ముసలయ్య వంటి 12 మంది యువకులను అరెస్టు చేశారు.<ref name="QUIT INDIA MOVEMENT IN COASTAL ANDHRA">{{cite book|last1=సిహెచ్. ఎం.|first1=నాయుడు|title=MAHATMA GANDHI'S LEADERSHIP AND QUIT INDIA MOVEMENT IN COASTAL ANDHRA|date=1996|publisher=ఆంధ్ర విశ్వవిద్యాలయం|location=విశాఖపట్టణం|url=https://archive.org/stream/in.ernet.dli.2015.220104/2015.220104.Mahatma-Gandhis_djvu.txt|accessdate=17 April 2018}}</ref> కొవ్వూరు మేజిస్ట్రేటు ముందు కోర్టులో సత్యనారాయణరెడ్డి
==గణాంకాలు==
|