బాంధవ్యాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 38:
 
==చిత్రకథ==
రామయ్య (ఎస్.వి.రంగారావు) ఆ గ్రామంలో మోతుబరి రైతు. అతనికొక కుమారుడు చంద్రం (ఏడిద నాగేశ్వరరావు) కళ్ళులేకపోయినా చాపలు అల్లటం అతని నేర్పు. రామయ్య తమ్ముడు లక్ష్మయ్య (ధూళిపాళ) మరదలు అన్నపూర్ణ (సావిత్రి), వారి కూతురు లక్ష్మి(లక్ష్మి) కుమారులు ముగ్గురు, రామేశం (మోదుకూరి సత్యం), కామేశం, సోమేశం (సారధి). మగపిల్లలు పట్నంలో చదువుతూ, విలాసాల్లో గడుపుతూ, పరీక్షల్లో ఫెయిలవుతూంటారు. వారి ఎదురింటి వ్యక్తి పానకాలస్వామి (రాజనాల), అతని తమ్ముడు సూర్యం (చంద్రమోహన్) బుద్ధిమంతుడు. అన్నగారు చేసే అక్రమ వ్యాపారాలు, వ్యవహారాలు నచ్చక, రామయ్యవద్ద పాలేరుగా పనిచేస్తుంటాడు. లక్ష్మి, సూర్యం ప్రేమించుకుంటారు. లక్ష్మయ్యకు ఇది నచ్చదు. కొడుకులు అప్రయోజకులయినా వారిపట్ల ప్రేమ ఎక్కువ. ఇది అలుసుగా తీసికొని పానకాలు, ఈ అన్నదమ్ములచేత ఒక కారు కొనిపించి, అలాగే ఆస్తి హామీ సంతకం 2 లక్షలకు పెట్టించి వారిని అందులో ఇరికించి, పోలీసులచే అరెస్ట్‌చేయిస్తాడు. పిల్లల కారణంగా, రామయ్య ఆస్తిని పంచి కొడుకుతో వేరుగా వుంటాడు. తన పిల్లలు అరెస్ట్‌కాగానే లక్ష్మయ్య అన్నగారిని తిరిగి ఇంటికి తీసుకువస్తాడు. రామయ్య సాయంతో, చదువుకున్న పాలేరు భూషయ్య కొడుకు గోపాలం (హరనాథ్) వకీలు కావటంతో ఈ రెండు కేసులను సమర్ధవంతంగా వాదించి, రామేశం వగైరాలను నిర్దోషులుగా విడుదల చేయిస్తాడు. వారికి బుద్ధిరావటం, లక్ష్మి, సూర్యంల వివాహం నిశ్చయం కావటంతో చిత్రం శుభంగా ముగుస్తుంది<ref>[http://www.andhrabhoomi.net/content/flashback50-20 బాంధవ్యాలు- -సి.వి.ఆర్.మాణిక్యేశ్వరి ఫ్లాష్ బ్యాక్ @ 50 ఆంధ్రభూమి దినపత్రిక 18-08-2018]</ref>.
 
==పురస్కారాలు==
"https://te.wikipedia.org/wiki/బాంధవ్యాలు" నుండి వెలికితీశారు