గోవిందరాజు సుబ్బారావు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 16:
}}
'''గోవిందరాజు సుబ్బారావు''' ([[1895]] - [[అక్టోబరు 28]], [[1959]]) తెలుగు సినిమాలలో, నాటకాలలో తొలితరం నటుడు. నాటక రంగంపై కన్యాశుల్కంలో లుబ్ధావధాన్లుగా, సినిమా రంగంలో మాలపిల్లలో సుందర రామశాస్త్రి పాత్రలోనూ, బాలనాగమ్మలో మాయల మరాఠీగానూ ప్రఖ్యాతుడయ్యాడు.
== జీవితం ==
గోవిందరాజు సుబ్బారావు [[1895]] సంవత్సరంలో జన్మించాడు.
పాఠశాలలో చదివేటప్పుడు, వార్షికోత్సవ సందర్భంలో [[మర్చంట్ ఆఫ్ వెనిస్]] అనే ఆంగ్ల నాటకంలో ఒక పాత్రను నిర్వహించటంలో వీరి నట జీవితం ప్రారంభమైంది. వీరు 20 ప్రముఖ రాగాలు పాడాటం క్షుణ్ణంగా నేర్చుకున్నారు. పూర్వ విద్యార్థి సంఘ వార్షికోత్సవంలో [[గయోపాఖ్యానం]] నాటకంలో [[సాత్యకి]]గా, [[భీముడు]]గా రెండు భిన్నమైన పాత్రల్ను పోషించి తెలుగు నాటక రంగంలో అడుగుపెట్టారు. [[తెనాలి]]లో రామవిలాస సభవారి నాటకాలలో పాల్గొని బొబ్బిలిలో హైదర్ జంగ్, బుస్సీ పాత్రలను నిర్వహించారు. [[కన్యాశుల్కం]]లో లుబ్ధావధానులు పాత్రవలననూ, [[ప్రతాపరుద్రీయం]]లో పిచ్చివాడు పాత్రవలననూ సుబ్బారావు ఆంధ్రదేశంలో చిరపరిచితుడయ్యాడు.
|