కమ్మ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి Reverted 1 edit by Lillinan1 (talk) identified as vandalism to last revision by Pavan santhosh.s. (TW) ట్యాగు: రద్దుచెయ్యి |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
'''కమ్మ''' (Kamma) లేక '''కమ్మవారు''' అనునది [[భారతదేశం]]లో ఒక సామాజిక వర్గం లేక [[కులం]]<ref>కమ్మవారి చరిత్ర, కొత్త బాపయ్య చౌదరి, 1939, పావులూరి పబ్లిషర్స్, గుంటూరు, కొత్త ఎడిషన్, 2006</ref>.
==చరిత్ర==
[[File:Kaapaneedu.jpg|thumb|కాకతీయుల పతనం అనంతరం ఢిల్లీ సుల్తానులు ఓడించి స్వతంత్ర రాజ్యం స్థాపించిన ముసునూరి కాపయ నాయకుడు]]
=== పుట్టు పూర్వోత్తరాలు ===
కమ్మ అన్న పదం సా.శ. ఒకటో శతాబ్దం నుంచి ఉంది.<ref>[http://www.archive.org/details/andhrulacharitra025965mbp ఆంధ్రుల చరిత్రము - మొదటి భాగము, చిలుకూరి వీరభద్ర రావు, 1910, పేజి 232]</ref> కమ్మవారి పుట్టుపూర్వోత్తరాలు, చరిత్ర విషయంలో పలు సిద్ధాంతాలు, వాదనలు ఉన్నాయి. గుండ్లకమ్మ వాగు పరిసర ప్రాంతాలను ప్రాచీన ప్రాంత విభాగమైన
==పరిశోధన==
ఆధునిక విజ్ఞాన పరముగా తెలుగువారిలోని కమ్మవారిలో మధ్యాసియా వాసులలో గుర్తించిన M124 జన్యువు 75% శాతము కలదు. ఈ జన్యువు ఉత్తర భారతములోని వారణాసి ప్రాంతంలో నివసించు జౌంపూర్ (Jaunpur) క్షత్రియులలో 80% శాతము కలదు. దీనిని హాప్లో గ్రూపు haplogroup R2 అందురు. ఐరోపా మరియు ఉత్తర భారత ఆర్యులలో హాప్లోగ్రూపు R2 నకు బహుసమీపములో ఉండు హాప్లోగ్రూపు R1a1(M17) కలదు. ఈ పరిశోధన ఇంకా ఎక్కువమంది నమూనాలు సేకరించి నిశితముగా చేయవలిసిన అవసరమున్నది.
=== రాజ్యపాలన, సైనిక వృత్తి ===
కమ్మ వారు శూద్ర వర్ణస్తులు. పలు శాసనలములోకమ్మనాయకులు దుర్జయ వంశ, చతుర్థాన్వయ అని పేర్కొనబడ్డారు. అయితే వీరు చారిత్రకంగా క్షత్రియులు అనీ, దుర్జయ వంశస్థులనీ కొన్ని కుల చరిత్రల్లో వాదనలు ఉన్నాయి. కాకతీయ చక్రవర్తులకు వీరికి వివాహ సంబంధాలు ఉండడం ఆధారంగా కాకతీయ వంశం కమ్మ కులస్తులన్న వాదన, తద్వారా కమ్మవారికి క్షత్రియత్వం ఉండేదన్న వాదన ఉంది. కమ్మవారిని దుర్జయ వంశస్థులుగా కొన్ని శాసనాలు పేర్కొనడంతో, దుర్జయ వంశస్థులైన కాకతీయులు కమ్మవారు కావచ్చునని కొందరు చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు.<ref>తెలంగాణ సమగ్ర చరిత్ర, 2016, తెలుఁగు అకాడమీ ముద్రణ</ref> కమ్మ కులస్తులు తాము ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో ఉన్నత స్థితికి చేరుకున్నాకా కాకతీయుల పేరును, కాకతీయ తోరణం వంటి చిహ్నాలను తమ కుల సంఘాలు, కాలనీలు, ప్రదేశాలకు ఔన్నత్య సూచకంగా ఉపయోగించారు.
[[కాకతీయ సామ్రాజ్యం]]లో కమ్మవారు సైన్యాధ్యక్ష హోదా నుంచి పలు సైనిక పదవుల్లోనూ, సైన్య భాగంలోనూ ఉండేవారు. కాకతీయ సామ్రాజ్యం పతనం చెందాకా [[బెండపూడి అన్నయ మంత్రి|అన్నయ మంత్రి]] ఆధ్వర్యంలో కాకతీయ సేనానులు [[ముసునూరి కాపయ నాయుడు|ముసునూరి కాపయ నాయుడి]] నాయకత్వంలో తిరుగుబాటు చేసి [[ఓరుగల్లు]] స్వాధీనం చేసుకున్నారు. సంక్లిష్టమైన దశాబ్దాల్లో కమ్మవారైన [[ముసునూరి నాయకులు]] ఓరుగల్లు రాజధానిగా ఆంధ్రదేశాన్ని పరిపాలించి, దక్షిణ భారతదేశంలో హైందవ రాజవంశాలు పట్టు సంపాదించేందుకు వీలిచ్చారు.<ref>ముసునూరి నాయకులు, మల్లంపల్లి సోమశేఖర శర్మ ఎమెస్కో పునర్ముద్రణ, 2015</ref> ముసునూరి నాయకుల రాజ్యం పతనం చెందాకా [[విజయనగర సామ్రాజ్యం]]లో సైనిక విభాగంలోనూ, సామంత రాజులుగానూ కమ్మవారు పనిచేశారు. ఈ క్రమంలో విజయనగర సామ్రాజ్య విస్తరణలో భాగంగా నేటి తమిళనాడు ప్రాంతాలకు సైనికుల నుంచి సైన్యాధ్యక్షుల వరకూ పలు హోదాల్లో కమ్మవారు వెళ్ళారు. ఆ ప్రాంతాన్ని ఆక్రమించాకా స్థానికంగా ఒక పక్క రాజకీయ నాయకత్వం, మరోపక్క వ్యవసాయ వృత్తి చేపట్టి స్థిరపడ్డారు. [[అమరావతీ సంస్థానం|వాసిరెడ్డి]], [[దూపాడు సంస్థానం|శాయపనేని]], [[పెమ్మసాని నాయకులు|పెమ్మసాని]], [[రావిళ్ల నాయకులు|రావెళ్ళ]]వంటి కమ్మవారి వంశాలు రాజ్యాలు, సంస్థానాలను పరిపాలించాయి..<ref>శ్రీ కృష్ణ దేవ రాయలు వంశ మూలాలు, ముత్తేవి రవీంద్రనాథ్, సావిత్రి పబ్లికేషన్స్</ref>
|