శివసాగర్ (కవి): కూర్పుల మధ్య తేడాలు

సోర్సుల్లేని సమాచారం
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 1:
'''శివ సాగర్''' ('''కె.జి. సత్యమూర్తి''') మాజీ [[నక్సలైటు]] నాయకుడు, ప్రముఖ విప్లవ రచయిత.
'''శివ సాగర్''' ('''కె.జి. సత్యమూర్తి''') మాజీ [[నక్సలైటు]] నాయకుడు, ప్రముఖ విప్లవ రచయిత. ఇతను 1968 నుంచి విప్లవ కవితలు వ్రాస్తున్నాడు. ఇతను అమెరికా సామ్రాజ్యవాదాన్ని దూషిస్తూ కూడా కవితలు వ్రాసారు కానీ కమ్యూనిజాన్ని వ్యతిరేకించే [[ఒసామా బిన్ లాదెన్]] మరియు [[సద్దాం హుస్సేన్]] లాంటి వారిని పొగుడుతూ ఇతను కవితలు వ్రాయడం తోటి విప్లవవాదుల్ని ఆశ్చర్య పరిచింది. శివసాగర్‌ స్వగ్రామం [[కృష్ణా జిల్లా]] [[నందివాడ]] మండలం [[పోలుకొండ]] పంచాయతీ శివారు శంకరపాడు . అతనికి భార్య మణెమ్మ, ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులున్నారు. చిన్న కుమారుడు రోడ్డు ప్రమాదంలో మరణించాడు.
==విప్లవ జీవితం==
ఇతను 1968లో [[నక్సలైటు|నక్సలైట్]] ఉద్యమంలో చేరాడు. ఆ సమయం నుంచే ఇతను శివ సాగర్ అనే కలం పేరుతో కవితలు వ్రాయడం మొదలు పెట్టాడు. ఉద్యమంలో పనిచేస్తున్న సమయంలో అతను ఒక కుట్ర కేసులో అరెస్ట్ అయ్యి జైలు శిక్ష కూడా అనుభవించాడు. బెంగాల్ కేంద్రంగా నక్సల్బరీ లో పెల్లుభికిన ప్రజా ఉద్యమానికి నాయకత్వం వహించిన చారు మజుందార్ ను కలిసి ఆంధ్రా లో నక్షలైట్ ఉద్యమ నిర్మాణానికి ముందున్న అగ్రనాయకుల లో శివసాగర్ ఒకరు. శివసాగర్ కొండపల్లి సీతారామయ్య ఇద్దరూ మొదట సిపిఐ ఎం ఎల్. సెంట్రల్ ఆర్గనైజింగ్ కమిటీ ఆ తర్వాత పీపుల్స్ వార్ పార్టీ స్థాపించారు. ఒక రకంగా ఆ పార్టీ మూల సిద్దాంత కర్తలు శివసాగర్ కొండపల్లి. శివసాగర్ పీపుల్స్ వార్ లో పనిచేస్తున్న సమయంలో పార్టీ నాయకులకి, ఇతనికి మధ్య విభేదాలు వచ్చి ఇతన్ని పార్టీ నుంచి బహిష్కరించారు. పార్టీలోని అగ్రకులాల నాయకులు దళితుడైన సత్యమూర్తి పార్టీలో ఎదగనివ్వలేదన్న అభిప్రాయం దళితవర్గాలలో ఉంది.<ref>http://www.dalitvoice.org/Templates/may_a2006/editorial.htm</ref><ref>http://www.hindu.com/2008/10/20/stories/2008102054790600.htm</ref> ఉద్యమం నుంచి బయటకి వచ్చిన తరువాత కూడా ఇతను కవితలు వ్రాయడం కొనసాగించారు. ఇతను మార్క్సిస్ట్ గతితార్కిక భౌతికవాదాన్ని బలంగా నమ్ముతూ కృశ్చేవ్, బ్రెజ్ఞేవ్, డెంగ్ సియావోపింగ్ లాంటి రివిజనిస్ట్ నాయకుల్ని తీవ్రంగా విమర్శించే కవితలు కూడా వ్రాశాడు. పీపుల్స్ వార్ గ్రూప్ నుండి వెలివేయబడిన సత్యమూర్తి సి.పి.ఐ. (ఎం. ఎల్) ప్రజా ప్రతిఘటన (పి.పి.జి) లో చేరి ఆ బృందం యొక్క లక్ష్యాన్ని వర్గ పోరాటం నుండి కుల పోరాటం వైపు మరలించాడు. దీనితో ప్రజాప్రతిఘటన బృందంలో చాలామంది ఉద్యమకారులు విప్లవ కార్యక్రమాలకు స్వస్తి చెప్పి ప్రధానస్రవంతిలో కలిసిపోయారు.<ref>http://www.hindu.com/thehindu/2000/11/21/stories/0421403e.htm</ref>
"https://te.wikipedia.org/wiki/శివసాగర్_(కవి)" నుండి వెలికితీశారు