అల వైకుంఠపురములో: కూర్పుల మధ్య తేడాలు

→‎కథ: విస్తరణ
పంక్తి 1:
'''అల వైకుంఠపురములో ''' 2020 సంక్రాంతికి విడుదల అయిన తెలుగు చలన చిత్రం. [[త్రివిక్రమ్ శ్రీనివాస్]] దర్శకత్వంలో [[గీతా ఆర్ట్స్]]/హారిక & హాసిని క్రియేషన్స్ సంయుక్త నిర్మాణంలో ఈ చిత్రం రూపుదిద్దుకొంది. [[అల్లు అర్జున్]], [[పూజా హెగ్డే]] ప్రధాన తారాగణం. ఇతర పాత్రలలో [[టబు]], [[జయరాం]], [[సుశాంత్]], [[నవదీప్]], [[నివేతా పేతురాజ్]], [[సముద్రఖని]], [[మురళి శర్మ]] నటించారు.
 
== కథ == ==
 
వర్షం పడుతోన్న రాత్రి స్కూటర్ పై వాల్మీకి (మురళి శర్మ) వచ్చే సన్నివేశంతో చిత్రం మొదలౌతుంది. అప్పుడే ప్రసవించిన తన భార్యను, బిడ్డను చూడటానికి వచ్చిన వాల్మీకి, అక్కడ రామచంద్ర (జయరాం) కు చెందిన కారును చూసి ఈర్ష్య పడతాడు. వాల్మీకి, రామచంద్ర ఒకే సంస్థలో సహోద్యోగులుగా చేరినా, ఆ సంస్థ యజమాని అయిన ఆదిత్య రాధాకృష్ణన్ అలియాస్ ఏ ఆర్ కే (సచిన్ ఖేడేఖర్) కుమార్తె యసు (టబు)ను రామచంద్రకు ఇచ్చి పెళ్ళి చేయటంతో అతని దశ తిరుగుతుంది. యసు కూడా అదే ఆస్పత్రిలో ప్రసవించటం, అయితే యసు కన్న బిడ్డలో కదలిక లేకపోవటం గమనించిన ఆస్పత్రి నర్సు, ఆ విషయాన్ని వాల్మీకి కి చెబుతుంది. నర్సు ముందు మంచిగా నటిస్తూ వాల్మీకి తన బిడ్డను యసు బిడ్డ స్థానం లో ఉంచి,యసు బిడ్డను తన భార్య ప్రక్కన పెట్టమని చెబుతాడు. ఇంతలో యసు బిడ్డలో కదలిక వచ్చినా, ఈ మార్పు జరగవలసిందేనని వాల్మీకి పట్టుబడతాడు. అక్కడ జరిగే పెనుగులాటలో నర్సు క్రిందపడి స్పృహ కోల్పోతుంది. వాల్మీకి కి శాశ్వతంగా కాలు పట్టేస్తుంది.
 
బిడ్డల మార్పు జరిగిందా? ఎవరి వద్ద ఎవరు ఎలా పెరిగారు? వాల్మీకి గుట్టు రట్టయిందా? దాని ఫలితాలు ఏమిటి? అన్నదే చిత్రం తదుపరి కథ.
 
== తారాగణం ==
"https://te.wikipedia.org/wiki/అల_వైకుంఠపురములో" నుండి వెలికితీశారు