ఆతుకూరి మొల్ల: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి clean up, replaced: మండలము → మండలం, typos fixed: ఉన్నది. → ఉంది. (2), గా → గా (2), ె → ే , సాధారణముగా → సాధారణంగా , → (5) ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం |
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి AWB తో "మరియు" ల తొలగింపు ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం |
||
పంక్తి 1:
[[బొమ్మ:Molla.jpg|thumb|right|200px|<center>[[బొమ్మ:Molla text.jpg|200px|మొల్ల]]<center> ]]
'''ఆతుకూరి మొల్ల''' (1440-1530) 16వ శతాబ్దపు [[తెలుగు]] కవయిత్రి. తెలుగులో [[మొల్ల రామాయణము]]గా ప్రసిద్ధి చెందిన ద్విపద [[రామాయణము]]ను రాసినది. ఈమె [[కుమ్మరి]] కుటుంబములో జన్మించింది. మొల్ల [[శ్రీ కృష్ణదేవరాయలు]] సమయము ([[16వ శతాబ్దము]]) లోనిదని ప్రశస్తి. మొల్ల శైలి చాలా సరళమైనది
==జీవిత కాలము==
మొల్ల జీవించినకాలం గురించి పరిశోధకులలో భిన్నాభిప్రాయాలున్నాయి. 'సన్నుత సుజ్ఞాన సవివేకి వాల్మీకి' దగ్గరనుండి 'తిక్కకవిరాజు భోజు' వరకూ మొల్ల నుతించింది. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానకవులలో ఒకరిని కూడా తనపద్యంలో ఆమె పేర్కొనిన కారణంగా ఆమె రాయలవారి సమయానికే కవయిత్రి అయి ఉండాలని భావిస్తున్నారు. జనసామాన్యంలో ప్రచారంలో ఉన్న కథలు మొల్ల, తెనాలిరామలింగడు సమకాలీకులని వెల్లడిస్తున్నాయి. 16వ శతాబ్దికి చెందిన ఏకామ్రనాధుడనే చరిత్రకారుడు తన ప్రతాపచరిత్రలో మొల్లను పేర్కొన్నాడు.
స్వస్థలం : కడప జిల్లా గోపవరం మండలం గోపవరం గ్రామం .ఈ గ్రామం కడప పట్టణమునకు 56 కి.మీ దూరములో ఉంది. బద్వేలుకు 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రాంతమునకు చెందినదని మొల్ల రామాయణములోని ఈ క్రింది పద్యము ద్వారా తెలియుచున్నది.
|