అమరావతి స్తూపం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎విహారములు-విశ్వవిద్యాలయము: AWB తో, అయోమయ నివృత్తి పేజీలకున్న లింకులను సవరించాను
చి clean up, replaced: మరియు → , (5), typos fixed: బడినది. → బడింది., వున్నాయి. → ఉన్నాయి., లు వలన → ల వలన , లో → లో (2), ె → ే (3), ద
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 8:
| built = క్రీ.పూ 3వశతాబ్దం
}}
[[File:Amaravathi Sthupa 02.JPG|thumb|right|స్తూపం శిధిలాలుశిథిలాలు]]
[[File:Amaravati stupa. Model. Amaravati.JPG|thumb|right|పురాతత్వశాస్త్రవేత్తలు ఊహ ప్రకారం స్తూపం నమూనా]]
[[అమరావతి (గ్రామం)|అమరావతి]] లో [[గౌతమ బుద్ధుడు|గౌతమ బుద్ధుని]] అవశేషాలను పూజల నిమిత్తమై పొందుపరచి వాటిపై కట్టిన కట్టడమే '''అమరావతి స్తూపం'''. ఇది ఒక పర్యాటక అకర్షణ. క్రీస్తు పూర్వము 2వ శతాబ్దము, క్రీస్తు శకము 3వ శతాబ్దముల మధ్య కట్టబడి ఉన్నత స్థితిని పొంది, బౌద్ధం క్షీణతతో మరుగున పడి. 1797 లో మరలా వెలుగులోకి వచ్చింది. అమరావతి శిల్పకళ బుద్ధ విగ్రహం మలచడంలోను, నాగిని ప్రతిమల రూపురేఖలలోను తనదైన ప్రత్యేక గుర్తింపు పొందింది. ఆగ్నేయ ఆసియా, శ్రీలంక దేశాలకు ఈ శిల్పకళ విస్తరించింది. ఇక్కడ లభించిన శాసనాలుశాసనాల వలన బ్రాహ్మీలిపి నుండి తెలుగు లిపి పరిణామ క్రమంలో తొలి నాలుగు దశలను తెలుపుతుంది. శాసనాలు, శిల్పాలు స్థానిక పురావస్తు ప్రదర్శనశాల, చెన్నై లోచెన్నైలో పురావస్తు ప్రదర్శనశాల, బ్రిటీష్ మ్యూజియము లలో భద్రపరచబడ్డాయి.
 
==చరిత్ర==
[[ఫైలు:Amaravati Stupa.JPG|right|thumb|300px|అమరావతి స్తూపం అవశేషాలు]]
ఆంధ్రదేశమందు, ముఖ్యముగా కృష్ణానదీ లోయలో, [[బౌద్ధమతము]] [[మౌర్య సామ్రాజ్యం|మౌర్య]] కాలము నుండి పరిఢవిల్లింది. అమరావతి (ధరణికోట), [[భట్టిప్రోలు]], [[జగ్గయ్యపేట]] బేతవోలు,[[ఘంటసాల]], [[శాలిహుండం]] మొదలైన చోట్ల స్తూప నిర్మాణము జరిగింది. [[కార్బన్ డేటింగ్]] ద్వారా అమరావతి (ధాన్యకటకము) పట్టణం క్రీ.పూ. 5వ శతాబ్దికి చెందిందని తెలిసింది. స్తూపం క్రీస్తు పూర్వము 2వ శతాబ్దము, క్రీస్తు శకము 3వ శతాబ్దముల మధ్య కట్టబడి మార్పులు చేర్పులు చేయబడినదిచేయబడింది.<ref>{{Cite book |title=అమరావతి |author= భ. ఆంజనేయ శర్మ, |date=2008|publisher=భారతీయ పురాతత్వ సర్వేక్షణ, హైదరాబాదు మండలం.}}</ref> ప్రాచీన బౌద్ధ వాజ్మయములో విశిష్ట స్థానము పొందిన 'ఆంధ్రపురి'యే ధాన్యకటకం. నేటి అమరావతి, ధరణికోట అందులోని భాగాలే. బుద్ధుని జీవితకాలమునుండి క్రీ. శ 14వ శతాబ్దివరకు ఇక్కడ [[బౌద్ధం]] నీరాజనాలందుకొంది. మరుగునపడిన చైత్యప్రాశస్త్యం తిరిగి 18వ శతాబ్దములో వెలుగు చూసింది. '''దీపాలదిన్నె''' గా పిలువబడిన పెద్ద దిబ్బను త్రవ్వి 1797 లో మహాస్తూపాన్ని వెలుగులోకి తెచ్చిన వ్యక్తి కల్నల్ [[కోలిన్ మెకంజీ]]. <ref> {{Cite wikisource |title=ఆంధ్రుల_చరిత్రము_-_ప్రథమ_భాగము|chapter=తొమ్మిదవ_ప్రకరణము#amaravathi|author=చిలుకూరి వీరభద్రరావు|date=1910}}</ref>
 
[[అమరావతి (గ్రామం)|అమరావతి]], [[ధరణికోట]] పరిసరములలో మరియు, చైత్యపు అట్టడుగు పొరల్లో బృహత్ శిలాయుగపు సాంస్కృతిక అవశేషాలు లభించాయి. క్రీ. పూ 4-3 శతాబ్దాలనాటి నివాస ప్రదేశాలు, కట్టడాలు, స్తంభాలు వెలుగు చూశాయి. మౌర్యులకు పూర్వమే ఇచట నాగ, యక్ష తెగల జనపదం (గణతంత్ర రాజ్యం) ఉండేదని తెలుస్తోంది. బౌద్ధ భిక్షువు, చరిత్రకారుడు తారనాథుని ప్రకారము [[గౌతమ బుద్ధుడు]] ధరణికోటలో కాలచక్ర మండలాన్ని ఆవిష్కరించాడు<ref>{{Cite book|chapter=Buddha's Preaching of the Kalachakra Tantra at the Stupa of Dhanyakataka, |author=H. Hoffman |title=German Scholars on India, |volume=I|date= 1973|pages=136-140 |place=Varanasi}}</ref><ref>{{Cite web |title=The history of the Kālacakra tradition in Sambhala and India |author=E. Henning.|date=2015-10-02|url=http://www.kalacakra.org/history/khistor2.htm|archiveurl=https://web.archive.org/web/20151126040338/http://www.kalacakra.org/history/khistor2.htm|archivedate=2015-11-26}}</ref>. బహుశా ఈ కారణము వల్ల బుద్ధుని మరణానంతరము అమరావతిలో గొప్పస్తూప నిర్మాణము జరిగివుండవచ్చును. [[మౌర్యులు]], సదవంశీయులు, [[శాతవాహనులు]], [[ఇక్ష్వాకులు]], [[పల్లవులు]], [[శాలంకాయనులు]], [[విష్ణుకుండినులు]], [[అనంద గోత్రీయులు]], [[చాళుక్యులు]], [[చోళులు]], కోట వంశీయులు, [[కాకతీయులు]], [[విజయనగర రాజులు]], కుతుబ్ షాహి నవాబులు వరుసగా ఈ ప్రాంతాన్ని పాలించారు. క్రీ.శ. 4వ శతాబ్ది నుండి 15వ శతాబ్దము వరకు ధరణికోట ఆంధ్రదేశ రాజకీయ చరిత్రలో కీలకస్థానం వహించింది.
 
==స్తూపం, చైత్యము==
[[బొమ్మ:AP Amaravathi Stupam model.JPG|right|thumb|350px|స్తూపం రేఖా చిత్రం]]
[[File:అమరావతి_స్తూపం_రేఖాచిత్రంఅమరావతి స్తూపం రేఖాచిత్రం.png|right|thumb|350px|స్తూపం రేఖా చిత్రం (వివరాలు)]]
 
[[స్తూపం]] లేక చైత్యం అనగా బుద్ధుని, లేదా ఇతర "అర్హతుల" ధాతు విశేషాలను లేదా వారు వాడిన పాత్రలు ఒక్కోసారి కేవలం గౌరవ ప్రదంగా లేదా స్మృతి చిహ్నంగా లేదా పూజా సంకల్పంతో భద్రపరచిన నిర్మాణం. బుద్ధుని నిర్వాణం తరువాత అతని ధాతువులపై 8 చైత్యాలను నిర్మించారు. తరువాత వాటిలో ఏడింటిని తెరిపించి [[అశోకుడు]] అందులోని శకలాలను చిన్న ఖండాలుగా చేసి 84 వేల స్తూపాలను కట్టించాడని ఒక ప్రతీతి ఉంది. దీనిలో కొంత నిజమున్నదని చరిత్రకారులు భావిస్తున్నారు.<ref name="MSS">{{Cite book | |url=https://archive.org/details/in.ernet.dli.2015.388296 |author=మల్లంపల్లి సోమశేఖర శర్మ |title= అమరావతి స్తూపము, ఇతర వ్యాసములు|date=1932|publisher=మల్లంపల్లి సోమశేఖర శర్మ}}</ref> కాలక్రమంలో బుద్ధుని లేదా ఇతర గురువుల వస్తువులపై కూడా ఇలాంటి చైత్యాలను నిర్మించడం మొదలుపెట్టారు. కాలాంతరంలో చైత్యమనే పదం వృక్ష వేదికకు గాని, సంపూర్ణ దేవాలయమునకు గాని, గర్భ గృహమునకు గాని వర్తించ సాగింది. కనుక చైత్యమనేది బౌద్ధ మతవిషయికమైన సాధారణ పదంగాను, స్తూపమనేది వస్తు విశేష సంబంధమయిన నిర్మాణ పదం (Architectural term for relic mound) గాను ఇటీవలి కాలంలో వ్యవహరింపబడుతున్నాయి.<ref name="AVS">{{Cite wikisource | title=ఆంధ్ర విజ్ఞాన సర్వస్వము - ద్వితీయ సంపుటము |chapter=అమరావతి స్తూపము |author= టి.ఎన్.రామచంద్రన్ |editor=కొమర్రాజు వెంకట లక్ష్మణరావు|publisher= కాశీనాధుని నాగేశ్వరరావు |date=1934|scan=పుట:Andhravijnanasarvasvamupart2.pdf/310}}</ref>
 
==పురాతన స్తూపం వెలుగు చూసిన విధం==
క్రీ.శ. 14వ శతాబ్దం తర్వాత మరుగునపడిన చైత్యప్రాశస్త్యం తిరిగి 18వ శతాబ్దములో వెలుగు చూసింది. గృహనిర్మాణం కోసం ధ్వంసం చేయబడుతున్న స్తూప కట్టడాలు, శిల్పాల గురించి విన్న కోలిన్ మెకంజీ 1797లో ఈ మహోన్నత సంపదను వెలికితీసి రక్షణకు నాంది పలికాడు. అటు తర్వాత సర్ వాల్టర్ స్మిత్ (1845), రాబర్ట్ సెవెల్ (1877), జేమ్స్ బర్జెస్ (1881), అలెగ్జాండర్ రెరే (1888-1909), రాయప్రోలు సుబ్రహ్మణ్యం (1958-59), యం. వెంకటరామయ్య (1962-65), [[ఇంగువ కార్తికేయశర్మ|ఐ. కార్తికేయ శర్మ]] (1973-74) మున్నగు పురాతత్వవేత్తలు సాగించిన త్రవ్వకాలలో శిథిలమై విఛ్ఛినమైన మహా చైత్యము బయల్పడింది<ref>{{Cite web |title=Amaravathi Stupa (Interactive exploration) |url=http://www.ancientindia.co.uk/buddha/explore/intro.html|archiveurl=https://web.archive.org/web/20030807181627/http://www.ancientindia.co.uk/buddha/explore/intro.html|archivedate=2003-08-07}}</ref>.
 
==మహాచైత్యము నిర్మాణ దశలు==
పంక్తి 52:
[[దస్త్రం:Amaravati stupa. at Amaravati.Side view.JPG|thumb|అమరావతి స్తూపం]]
[[బొమ్మ:MaraAssault.jpg|thumb|right|ధ్యానమగ్నుడైన గౌతమబుద్ధుని దీక్ష భగ్నం చేయడానికి మారుడు దండెత్తడం - సూచనా శిల్పం [[:en:Guimet Museum|గ్విమెట్ మ్యూజియం నుండి]].]]
లభించిన ఆధారాల కనుగుణంగా చరిత్రకారులు, పురాతత్వవేత్తలు క్రీ. శ. 2వ శతాబ్దిలో చైత్యం ఎలా ఉండేదో అలాంటి నమూనాని నిర్మించారు. పెర్సీ బ్రౌను నిర్మించిన నమూనా చైత్యం చెన్నయి (మద్రాసు) సంగ్రహాలయంలో ఉంది. ప్రాకారం వలయాకారంలో ఉండేది. ప్రాకారంలో నిలువు స్తంభాలు (136), అడ్డకమ్మీలు (348), మదురు (244 మీ) ఉండేవి.
; కట్టడం నిర్మాణం ప్రధాన గణాంకాలు
* ప్రాకార వైశాల్యం: 17,000 చ. అడుగులు, చుట్టు కొలత: 600 అడుగులు
పంక్తి 71:
; మేధి లేదా స్తూపాధిష్టానము
 
మట్టిని పొరలు పొరలుగా పోసి, ఒక్కో పొరను బాగా దిమ్మిస కొట్టిన తరువాత దానిపై ఇటుకలను పేరిచి అతికి, ఆ పైన రాతిఫలకములను అతికించి స్తూపాన్ని నిర్మించేవారు. శతాబ్దాల తరబడి క్రుంగిపోకుండా స్తూపం ఉన్నదంటే మట్టిని ఎంత బాగా కూర్చారో అర్ధం చేసుకోవచ్చును. అలాగే ఒక్క చుక్కయినా నీరు లోపలికి పోకుండా శిలాఫలకాలను అతికించారు.
 
 
; వెలుపలి ప్రాకారము
Line 78 ⟶ 77:
 
; ద్వారములు
నాలుగు ప్రక్కలా నాలుగు ద్వారాలున్నాయి. ఒకో [[ద్వారం]] వెడల్పు 26 అడుగులు. పొడవు 16 అడుగులు. అరుగు నుండి ద్వారానికి రెండు ప్రక్కలా మూడేసి నిలువురాతి స్తంభాలున్నాయి. ఈ ప్రాకార ద్వారద్వారా స్తంభాలపై వెనుకటి కాళ్ళమీద కూర్చున్నట్లు సింహాల ప్రతిమలున్నాయి.
 
; వేదిక
అండమునకు దిగువ భాగము వేదిక (ఆరుగు లాంటిది). వేదిక ఎత్తు ఆరడుగులు. ఈ వేదిక ఉపరితలంపై కప్పిన శిలాఫలకాలపై చక్కని అనేక చిత్రాలను చెక్కారు. అలా చెక్కబడినవాటిలో [[అమరావతి]] చైత్యం ఆకృతినే వారు చెక్కడం మన అదృష్టం. ఆ శిలా ఫలకాల మూలానే మనకు నేడు అమరావతి చైత్యం ఆకారం తెలియవస్తున్నది.<ref name="AVS"/> ఇలాంటి ఫలకాలలో ఉత్తమమైనదొకటి [[మద్రాసు]] [[మ్యూజియం]]లో ఉంది. ఈ వేదిక నాలుగు దిక్కులలో అరుగు ముందరకు వచ్చినట్లు, ఆయా నాలుగు ద్వారాలకు ఎదురుగా, నిర్మింపబడింది. ప్రాకారాలకంటెప్రాకారాలకంటే వేదిక రాయి మెత్తనయినది గనుక వేదిక రాతి ఫలకాలమీద చెక్కిన శిల్పాలు మరింత ప్రశస్తమయినవి. వీటిలో దాగొబాలు (చైత్యం నమూనాలు), నాగములు వంటి శిల్పాలున్నాయి. దాగొబాలు చెక్కిన ఫలకాల కుడియెడమల విడి రాళ్ళమీద చెక్కిన స్తంభాలున్నాయి. వాటిలో [[బోధివృక్షము]], ధర్మచక్ర పరివర్తనము, మార ప్రలోభనము వంటి శిల్పాలు వున్నాయిఉన్నాయి.
 
; ఆయక కంభములు
వేదికకు పొడుచుకు వచ్చినట్లున్న నాలుగు అరుగులపైన, అంటే ద్వారాలకు ఎదురుగా, ఐదేసి ఆయక కంబములు (ఆర్యక స్తంభములు - పూజనీయ స్తంభాలు) ఉన్నాయి. అంటే మొత్తం 20 స్తంభాలున్నాయి. ఇలా ఒక్కో దిక్కున అయిదేసి స్తంభాలుండడం ఆంధ్రదేశం లోని స్తూపాలలో కనిపించే విశేష లక్షణం. ఈ ఐదు స్తంభాలు బుద్ధుని జీవితంలో పంచ కళ్యాణములు (బుద్ధావతరణము, మహాభినిష్క్రమణము, మార ప్రధ్వంసము మరియు, సంబోధి, ధర్మ చక్ర పరివర్తనము, మహాభినిష్క్రమణము ) అనబడే ఐదు ఘట్టాలకు ప్రతీక. ఈ స్తంభములుమతసంబంధములైన పూజ్యభావములకు చిహ్నములు గనుక సందర్శకులు ముందుగా వాటకి మ్రొక్కి ఆ తరువాత చైత్యమునకు ప్రదక్షిణ చేయువారు - ఇలా వాటిపేరు "ఆయకకంబములు" అయినది.
 
స్తంభము అడుగు చతురస్రాకారంగాను, మధ్యభాగం అష్టకోణాకారంగాను ఉండగా పై భాగం చూళిక (Capital) అండంరూపంలో ప్రతి దిక్కున తోరణంగా మలచబడింది. దీనికే చైత్యతోరణం అని పేరు. చూళికల పైభాగంలో జెండాలు పెట్టడానికి గుంటలుగా తొలిచారు. ఈ తోరణాల దిగువ భాగం గూళ్ళగా మలచబడి, ఆ గూండ్లలో యక్ష ప్రతిమలు చెక్కారు. ఈ గూండ్లకు చైత్య వాతాయనములని పేరు. అమరావతి చైత్యవాతాయనములలో చెక్కబడిన యక్ష ప్రతిమలు అత్యంత సుందరమైనవని, ఇట్టి కళా కౌశలానికి సరివచ్చేవి మరెక్కడా కానరావని కళావిమర్శకుల అభిప్రాయం.<ref name="AVS"/>
Line 125 ⟶ 124:
[[బొమ్మ:AmaravatiScroll.JPG|thumb|right|250px|తోరణాలంకరణ శిల్పం. మధ్యలో యక్షుడు. అమరావతి స్తూపం నుండి. [[:en:Tokyo National Museum|టోక్యో నేషనల్ మ్యూజియం నుండి]].]]
స్తూప సమూహములో భిక్షువులకు ఆవాసములు, విద్యాసంబంధిత కట్టడాలుకూడ ఉన్నాయి. వీటిలో చాలవరకు స్థానికుల, భక్తుల విరాళాలతో కట్టబడ్డాయి. అద్భుతమైన [[శిల్పకళ]]<nowiki/>తో అలరారే ఈ స్తూపంపై బుద్ధుని జీవిత చరిత్రకు సంబంధించిన చిత్రాలు, బౌద్ధచిహ్నాలు చెక్కబడి ఉన్నాయి. స్తూపంపై బ్రాహ్మీ లిపిలో [[శాసనాలు]] చెక్కబడి ఉన్నాయి. ఈ స్తూపం గురించి అప్పటి బ్రిటిషు పురాతత్వ పరిశోధకుడు ఫెర్గుసన్ ఇలా అన్నాడు: "కళావైదుష్యానికి సంబంధించి ఇది భారతదేశంలోనే అత్యంత విశిష్టమైన కట్టడము". అమరావతి శిల్ప, శాసనాలవల్ల ఆ కాలము నాటి [[వృత్తులు]], [[కులాలు]], కుటుంబ వ్యవస్థ, ఐహిక జీవితం, స్త్రీల స్థానం, వస్త్ర సంస్కృతి, మతం, ఇతర సామాజిక స్థితులు విశదంగా వెల్లడవుతాయి. అమూల్యమైన ఈ శిల్పకళాఖండాలు కొన్ని బ్రిటిష్ మ్యూజియములో చూడవచ్చును.<ref>{{Cite web |title=
India: Amaravati (Room 33a) |url=http://www.britishmuseum.org/explore/galleries/asia/room_33a_amaravati.aspx|accessdate=2019-08-26|publisher=British Museum}} </ref> <ref>{{Cite wikisource |title=
లండన్‍లో తెలుగు వైభవ స్మృతులు|chapter=బ్రిటీష్ మ్యూజియంలో మన అమరావతి శిల్పాలు|author=మండలి బుద్ధ ప్రసాద్|date=2010}}</ref>
 
 
'''శిల్ప దశలు''': అమరావతి స్తూపం నిర్మాణంలో వివధ దశలున్నట్లే శిల్పరీతులలోను వివిధ సంప్రదాయాలు గోచరిస్తాయి. మొదటి దశలోని శిల్పంలో బుద్ధుని కథావిన్యాసము సంగ్రహంగా చూపబడింది. అనగా సామాన్య జనులకు బుద్ధుని గురించి, అతని బోధలగురించి అవగాహన కలిగించడానికి బుద్ధుని కథలు సంకేత రూపంగా చెప్పబడ్డాయి. ఉదాహరణకు బుద్ధుని జననాన్ని పద్మంతోను, మహాభినిష్క్రమనాన్ని గుఱ్ఱంతోను, సంమ్యక్సంబోధిని బోధివృక్షంతోను, బోధనను ధర్మచక్రంతోను - ఇలా చూపారు. అప్పటికి ఇంకా బౌద్ధమతంలో సాహిత్యం, శిల్పం పూర్తిగా ప్రభవించలేదు గనుక శిల్పులు తమ సంకేతాలను తామే రూపొందించుకోవలసివచ్చి ఉండవచ్చును. తరువాతి కాలంలో చెక్కబడిన శిల్పాలు మరింత మనోహరమైనవి.
Line 136 ⟶ 134:
 
=== జీవనం ===
ప్రజల జీవనానికి, ప్రధానంగా క్షాత్ర జీవనానికి చెందిన అనేకానేక శిల్పాలు అమరావతిలో కనిపిస్తాయి. సైన్యము, రథములు, గుఱ్ఱములు, ఆయుధాలు, మరియు, ఆయుధ ధారుల వేషభూషాలు - ఇటువంటి చాలా సమాచారం అమరావతి శిల్పాలద్వారా తెలుస్తున్నది. [[ధనుస్సు]], [[బాణము]], [[ఈటె]], [[ఖడ్గము]], డాలు, [[చక్రము]], [[బల్లెము]] వంటి ఆయుధాలనుపయోగించేవారని తెలుసుకోవచ్చును. [[ఒంటె]]లను కూడా యుద్ధాలలో వాడినట్లు చూపడం మరొక విశేషం. అలాగే వివిధములైన వేష భూషాదులను, శిరోజాలంకరణ పద్ధతులను అమరావతి శిల్పాలలో గమనించవచ్చును. సామాన్యులు, ప్రభువులు, భిక్షుకులు, ఆడువారు, మగవారు - ఇలా ఒకో రకం ప్రజలు వేసుకొనే దుస్తులు, ధరించే ఆభరణాలు, చేసికొనే అలంకారాలు ఈ శిల్పాల కారణంగా మనకు తెలుస్తున్నాయి. అమరావతి శిల్పాలలోని స్త్రీమూర్తులను గమనించినట్లయితే ఆ కాలపు స్త్రీలు సౌందర్య, శృంగారములమీద ఎంతటి శ్రద్ధ వహించేవారో అని ఆశ్చర్యం కలుగక మానదు.
 
=== కట్టడాలు ===
అప్పటి కట్టడాలు, ద్వారద్వారా తోరణాలు, గడ్డితో కప్పిన గుడిసెలు, రాజ భవనాలు, ఇటుకలతో కట్టిన గోడలు, మేడలు, మిద్దెలు - ఇవన్నీ అమరావతి శిల్పాలలో చూడవచ్చును. [[ఉద్యానవనాలు|ఉద్యానవనాల]]లో చలువరాతి వేదికలుండేనవి, నాటిలో కూర్చొని ప్రకృతిని ఆస్వాదించేవారని తెలుస్తున్నది. పెద్ద భవనాలకు చిత్రవిచిత్రమైన అలంకారాలతో కూడిన పెద్దపెద్ద ద్వారాలుండేవి. బౌద్ధభిక్షువులుండే కట్టడాల నిర్మాణాలలో వారి జీవనానికి అనుకూలమైన అమరికలను, విభాగాలను గమనించవచ్చును.
 
"ఆమరావతి శిల్పము ఆంధ్రభూమిని కళామయము చేసి ఆంధ్రులకు కీర్తి ప్రతిష్టలు ఆపాదించినది. ఆధునిక సభ్యతా సంస్కృతులు, సౌందర్యాలంకార విషయమున కలిగించిన ప్రతి పరిణామము ఇప్పటికి షుమారు రెండువేల యేండ్ల క్రిందనే విలసిల్లిన అమరావతి కళలోనే గోచరించుట ఆశ్చర్యకరము."<ref name="AVS"/>
Line 156 ⟶ 154:
కళాక్షేత్రంగా అమరావతి ఆర్జించిన కీర్తి అద్భుతమైనది. వీటి ద్వారా ఆంధ్ర శిల్పి నైపుణ్యం దేశ దేశాలలో వ్యాపించింది. అమరావతీ శిల్పరీతియే ఆంధ్రరీతియై పల్లవ చాళుక్యాది దాక్షిణాత్య శిల్పులకు వరవడియై మలయా, జావా, సుమత్రా, సింహళాది దేశాలలో తన వైజయంతికలను ప్రసరింపజేసిందట.<ref name="BSL">[http://www.archive.org/details/bouddamuandhramu018708mbp బౌద్ధము, ఆంధ్రము - డా.బి.ఎస్.ఎల్. హనుమంతరావు] (తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణ)</ref>. అమరావతి శిల్ప కళారీతి (Amaravati school of art) శ్రీలంక, ఆగ్నేయాసియాలలోని నిర్మాణాలపై గణనీయమైన ప్రభావం కలిగి ఉంది. ఇక్కడినుండి శిల్పాలు ఆయా దేశాలకు తీసికొని వెళ్ళడం ఇందుకు ఒక కారణం.<ref>{{Cite web |url=http://www.nagarjunainstitute.com/buddhisthim/backissues/vol11/v11newevid.htm |title=Nagarjuna Institute : Buddhist Himalaya Vol12 1999-2005 (Combined Issue)<!-- Bot generated title --> |website= |access-date=2008-07-20 |archive-url=https://web.archive.org/web/20071222001809/http://www.nagarjunainstitute.com/buddhisthim/backissues/vol11/v11newevid.htm |archive-date=2007-12-22 |url-status=dead }}</ref>.
 
డా. ఉల్రిక్ వాన్ ష్రోడర్ (Dr. Ulrich Von Schroeder) అనే అధ్యయనకారుడు శ్రీలంకలోని బౌద్ధ శిల్పంపై కూలంకషమైన మౌలిక పరిశోధన చేసి తన అధ్యయనాన్ని విస్తారమైన ఆధారాలతో ప్రచురించాడు. శ్రీలంక లంకలోని వవిధ నిర్మాణాలలోని సున్నపురాయి శిల్పాలను వాటి కొలతలతో సహా జాబితా తయారు చేశాడు. అతని ప్రచురణలోని అధ్యాయాల పేర్లు "ప్రారంభ అమరావతి రీతి కాలంలో దిగుమతి అయిన శిల్పాలు" (Imported Sculptures from Early Amaravati School) మరియు, "అనంతర అమరావతి రీతి (నాగార్జున కొండ) కాలంలో దిగుమతి అయిన శిల్పాలు" (Imported Sculptures from late Amaravati (Nagarjunakonda)). దీన్నిబట్టి అమరావతి, నాగార్జునకొండలలోని శిల్పులు శ్రీలంకకు, ఇతర దక్షిణాసియా దేశాలకు బౌద్ధ, ఇతర శిల్పాలను ఎగుమతి చేస్తుండేవారని స్పష్టంగా తెలుస్తున్నది.
 
వ్యాపార వర్గాల మధ్య సంబంధాలు, అనుబంధాలు నెలకొనడానికి మతైక్యత ఒక ముఖ్యమైన సాధనంగా పనిచేస్తుంది. ఈ విధంగానే బౌద్ధ, హిందూ శిల్పాలు ఆగ్నేయాసియా, శ్రీలంక వంటి ప్రాంతాలకు ఎగుమతి అవడం సుగమం అయి ఉండవచ్చును.<ref>Buddhist Sculptures of Sri Lanka, U. Von Schroeder, 1990, Hongkong</ref> సెలెబస్‌లోని సెంపాంగా (Sempaga in Celebes)లో అమరావతి రీతిలోని కంచు బుద్ధవిగ్రహం లభించింది. సియాంలోని డోగ్-డువోంగ్.డోంగ్‌టక్ (Dong-Duong. Dong Tuk (Siam))లోని ప్రారంభకాలపు శిల్పాలు అమరావతి రీతిలో చెక్కబడ్డాయి. సెలెబస్ పశ్చిమ తీరంలోని దక్షిణ జెంబర్ (South Djember) మరియు, సికెందంగ్ (Sikendeng) లోని కంచు బుద్ధవిగ్రహం, బుకిట్ (Bukit) లోని పెద్ద బుద్ధ విగ్రహం పూర్తిగా అమరావతి శిల్ప రీతులలో ఉన్నాయి. ఇవి ఆంధ్ర ప్రాంతంనుండి వలస వచ్చినవారు తెచ్చి ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే పాలెంబాంగ్ (Palembang) అనబడే చోట ఉన్న చాలా పెద్ద రాతి బుద్ధ విగ్రహం రవాణా చాలా కష్టమై ఉండాలి. ఈ ద్వీపకల్పంలో ఇది అన్నింటికంటెఅన్నింటికంటే పాతదనిపించే అమరావతి శిల్పం. మచిలీపట్నం, ఘంటసాల వంటి రేవు పట్టణాల ద్వారా ఇండినేషియాకు అమరావతి శిల్పులతో సంబంధాలు వర్ధిల్లి ఉండాలి
 
అమరావతి శిల్పచిత్రాలు వాటి యోగ్యత వల్లనే దిగంత విశ్రాంతములయినవి. భారతీయ శిల్ప కళావిన్యాసంలో "అమరావతి రీతి" అనే పేరు మీద ఒక విశిష్ట కళా విభూతికి సూత్రములు పన్నిన ప్రాచీనాంధ్ర శిల్పాచార్యులు రచించిన కృతుల గొప్పదనానికి అమరావతి, జగ్గయ్యపేట, నాగార్జునకొండ వంటి చోట్ల బయటపడిన భగ్న శిల్ప శిథిలాలే నిదర్శనాలు.<ref name="MSS"/>
Line 181 ⟶ 179:
 
==క్షీణత==
చైనా యాత్రీకుడు హ్యూయెన్ త్సాంగ్ ఆరవ శతాబ్దములో [[అమరావతి స్తూపం|అమరావతి స్తూపం]] సందర్శించునాటికి క్షీణదశ ప్రారంభమైనది. ఐతే క్రీ.శ. 1344 వరకు పూజాపునస్కారాలు జరిగినట్లు ఆధారాలున్నాయి. హిందూమత ప్రాభవమువల్ల క్రీ.శ. 1700 నాటికి స్తూపం శిథిలావస్థకు చేరుకొంది. పెర్సీ బ్రౌను మహాచైత్యం ఉచ్చస్థితిలో ఎలా ఉండేదో ప్రణాళికను చేశారు. ఈ స్తూపం కోల్పోయిన వైభవం గురించి సుప్రసిద్ధ చరిత్ర కారుడు [[మల్లంపల్లి సోమశేఖరశర్మ]] ఇలా వ్రాశాడు<ref name="MSS"/>.
:అచిర కాలముననే ధాన్యకటకమునకా మహా దశ తొలగిపోయినది. మహాచైత్యము ప్రభ క్రీ.శ. నాలుగైదు శతాబ్దులవరకు వెలిగినది. బ్రాహ్మణ మతాభిమానులయిన పల్లవులు, చాళుక్యులు, వాకాటకులు వంటి రాజుల కాలంలో ఆశ్రయమొసగి పోషించేవారు లేక దక్షిణాపధంలో బౌద్ధము క్రమముగా క్షీణ దశకు వచ్చెను. క్రీ.శ. 7వ శతాబ్దిలో చీనా యాత్రికుడయిన యువాన్ చువాంగ్ ధాన్యకటకమును సందర్శించునాటికే బౌద్ధము దుర్దశలోనున్నది. బౌద్ధవిహారములనేకములు భిక్షుసంఘ పరిత్యక్తములయి, జన శూన్యములయి పాడువారి యుండినవి. ఇరువది విహారములందు మాత్రము బౌద్ధ సాంఘికులు నివశించుచుండిరి. వారయినను వేయిమందికెక్కువ లేరు. అప్పటికి హిందూ దేవాలయములనేకములు ప్రతిష్ఠితములయినవి. అయినను ఆ మహానగరమునకు విద్యాపీఠమను యశస్సు కుంచితము కాలేదు.
 
"https://te.wikipedia.org/wiki/అమరావతి_స్తూపం" నుండి వెలికితీశారు