సర్దార్ వల్లభ్భాయ్ పటేల్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
→ఐక్యతా ప్రతిమ: updated the date ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit |
+భారతదేశ ఏకీకరణ లింకు ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ |
||
పంక్తి 26:
}}
భారతదేశపు ఉక్కు మనిషిగా పేరుగాంచిన '''సర్దార్ వల్లభ్ భాయి పటేల్''' జవేరిభాయ్, లాడ్ బాయి దంపతులకు [[1875]], [[అక్టోబరు 31]]న [[గుజరాత్|గుజరాత్]]<nowiki/>లోని నాడియార్లో జన్మించారు.<ref>http://www.liveindia.com/freedomfighters/9.html</ref> ఇతను ప్రముఖ స్వాతంత్ర్య యోధుడిగానే కాకుండా స్వాతంత్ర్యానంతరం సంస్థానాలు భారతదేశములో [[భారతదేశ ఏకీకరణ|విలీనం]] కావడానికి గట్టి కృషిచేసి సఫలుడై ప్రముఖుడిగా పేరుపొందారు. [[హైదరాబాదు]], [[జునాగఢ్]] లాంటి సంస్థానాలు [[భారతదేశము]]లో విలీనం చేసిన ఘనత ఇతనికే దక్కుతుంది. [[ఇంగ్లాండు]]లో బారిష్టరు పట్టా పుచ్చుకొని స్వదేశానికి తిరిగివచ్చి దేశంలో జరుగుతున్న జాతీయోద్యమానికి ఆకర్షితుడై బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా [[మహాత్మాగాంధీ]] నేతృత్వంలో కొనసాగుతున్న స్వాతంత్ర్యోద్యమంలో పాలుపంచుకున్నాడు. బార్దోలిలో జరిగిన సత్యాగ్రహానికి [[నాయకత్వం]] వహించి [[విజయవంతం]] చేయడమే కాకుండా తాను దేశప్రజల దృష్టిని ఆకర్షించాడు. బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా స్వాతంత్ర్య ఉద్యమంలోనే కాకుండా దేశప్రజల సంక్షేమం కోసం అనేక సాంఘిక ఉద్యమాలను చేపట్టాడు. 1931లో జరిగిన [[భారత జాతీయ కాంగ్రెస్]] మహాసభకు అధ్యక్షత వహించాడు. [[భారత రాజ్యాంగం]] రచనలో ప్రముఖ పాత్ర వహించాడు. రాజ్యాంగ రచనలో అతిముఖ్యమైన ప్రాథమిక హక్కుల కమిటీకి చైర్మెన్గా వ్యవహరించాడు. స్వాతంత్ర్యానంతరం [[జవహార్ లాల్ నెహ్రూ]] నేతృత్వంలోని కేంద్రమంత్రిమండలిలో హోంశాఖ మంత్రి గానూ, [[ఉప ప్రధానమంత్రి]] గానూ బాధ్యతలను నిర్వహించాడు. దేశవిభజన అనంతరం అనేక ప్రాంతాలలో జరిగిన అల్లర్లను చాకచక్యంతో అణచివేశాడు. నెహ్రూ మంత్రిమండలిలో ఉన్ననూ అనేక విషయాలలో నెహ్రూతో విభేదించాడు. నెహ్రూ శాంతికాముకతను కాదని అనేక పర్యాయాలు బలప్రయోగం చేపట్టి సఫలుడైనాడు. కేవలం 40 మాసాలు మాత్రమే పదవిలో ఉన్ననూ అనేక దేశ సమస్యలను తనదైన పద్ధతితో పరిష్కరించి 1950 డిసెంబరు 15న మరణించాడు. మరణించిన 4 దశాబ్దాల అనంతరం 1991లో భారత ప్రభుత్వం [[భారతరత్న]] బిరుదాన్ని ఇచ్చి గౌరవించింది.
== బాల్యం, విద్యాభ్యాసం, కుటుంబం ==
|