భద్రాచలం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎దగ్గరలో ఉన్న పర్యాటక స్థలాలు: AWB తో "మరియు" ల తొలగింపు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
|skyline_caption = భద్రాచల రామాలయ దృశ్యము |mandal_map=Khammam mandals outline08.png|latd = 17.67 | longd = 80.88|state_name=|mandal_hq=భద్రాచలం|villages=62|area_total=|population_total=89048|population_male=44029|population_female=45019|population_density=|population_as_of = 2011 |area_magnitude= చ.కి.మీ=|literacy=57.7|literacy_male=63.48|literacy_female=51.81}}
 
ఇది [[గోదావరి]] నది దక్షిణ తీరాన ఉంది.భద్రాచలం మండలానికి ఈ పట్టణం కేంద్రం. దీనికి మరో పేరు శ్రీరామ దివ్యక్షేత్రం.ఇది పూర్వపు జిల్లాకేంద్రమైన ఖమ్మం పట్టణానికి 105 కి.మీ.ల దూరంలో ఉన్న ఈ పట్టణం, భక్త రామదాసు నిర్మించిన రామాలయానికి ప్రసిద్ధి చెందిందిపేరొందింది. జిల్లాలోని ప్రముఖ పారిశ్రామిక కేంద్రాలైన [[పాల్వంచ]] 27 కి.మీ., [[మణుగూరు]] 35 కి.మీ.,[[కొత్తగూడెం (ఖమ్మం జిల్లా పట్టణము)|కొత్తగూడెం]] 35 కి.మీ. దూరంలోను ఉన్నాయి. భద్రాచలము తప్ప మిగిలిన పుణ్యక్షేత్రాలన్ని పోలవరం ముంపు ప్రాంతాలుగా మారాయి. భద్రాచలం రెవెన్యూ డివిజను మొదట తూర్పుగోదావరి జిల్లాలో భాగముగా ఉండేది. అంధ్ర, హైదరాబాదు రాష్ట్రాలు విలీనమయి కొత్తగా ఖమ్మం జిల్లా ఏర్పడిన సమయములో దీనిని ఖమ్మం జిల్లాలో విలీనం చేయటం జరిగింది. [[తెలంగాణ]] ఉద్యమం తీవ్రముగా ఉన్న రోజులలో ఇది వివాదాస్పదం అయ్యింది.
 
==భద్రాచలం పట్టణం==
 
భద్రాచలం గ్రామ పంచాయితీ 1962లో [[మద్రాసు]] గ్రామ పంచాయితీ చట్టం క్రింద ఏర్పడింది. తరువాత 26.07.2001న వచ్చిన ప్రభుత్వం చట్టం GOMs.No.245 (PR & RD) ప్రకారం ఇది ఒక పట్టణంగా గుర్తించబడింది. G.O.Ms.No.118 (PR & RD) తేది. 08.04.2002న, ప్రకారం ఈ పట్టణం పేరు "శ్రీరామ దివ్య క్షేత్రం" అని మార్చబడింది.<ref>{{Cite web |url=http://www.khammam.com/html/muncipality/bhadrachalam.htm |title=భద్రాచలం అధికారిక వెబ్‌సైటు |website= |access-date=2008-07-24 |archive-url=https://web.archive.org/web/20090116193708/http://khammam.com/html/muncipality/bhadrachalam.htm |archive-date=2009-01-16 |url-status=dead }}</ref> హర్షభద్రాచలం టౌన్షిప్ గా తరువాత మునిసిపాలిటిగా ఎదిగినప్పటికీ 1/70 ఆక్ట్ అనుసరించి మరల దీనిని [[గ్రామ పంచాయతీ|గ్రామపంచాయితీ]]గా మార్చుట జరిగింది.
==గణాంక వివరాలు==
 
==గణాంక వివరాలు==
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 89,048 - పురుషులు 44,029 - స్త్రీలు 45,019
 
==రామాలయ ప్రశస్తి==
 
[[File:Bhadrachalam Temple 24.JPG|thumb|right|భద్రాచలంలో ఒక మండపం]]
{{main|శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానము, భద్రాచలం}}
Line 22 ⟶ 21:
==గ్రామ చరిత్ర ==
[[దస్త్రం:Bhadrachalamolds.jpg|thumbnail|Bhadrachalam]]
రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం [[పోలవరం]] ముంపు మండలాలతో పాటు ఆయా గ్రామాలను... తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్- లోకి విలీనం చేస్తూ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ఖమ్మం జిల్లాలోని పోలవరం ముంపు మండలాలను... ఉభయ గోదావరి జిల్లాల్లోకి కలుపుతున్నట్లు ప్రకటించింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు వల్ల ముంపునకు గురయ్యే ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్- లోకి బదలాయించేందుకు పునర్విభజన చట్టంలోని సెక్షన్- 3లో పేర్కొన్నారు. అందుకనుగుణంగా [[ఖమ్మం జిల్లా]] పరిధిలోని కుక్కనూరు, వేలేరుపాడు, భద్రాచలం, కూనవరం, చింతూరు, వరరామచంద్రాపురం మండలాలతోపాటు బూర్గుంపహాడ్ మండలంలోని ఆరు గ్రామాలను ఆంధ్రప్రదేశ్-లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ - జిల్లాల ఆవిర్భావ చట్టం ప్రకారం ఆయా గ్రామాలను రాష్ట్రంలో కలుపుకుంటున్నట్లు తగిన ప్రతిపాదనలతో కూడిన ప్రకటనను 2014 మే 29న గెజిట్-లో ప్రచురించారు.<ref>{{Cite web|url=https://www.prsindia.org/uploads/media/Ordinances/Andhra%20Pradesh%20Reorganisation%20Amendment%20Ordinance%202014.pdf|title=THE ANDHRA PRADESH REORGANISATION (AMENDMENT) ORDINANCE, 2014 (NO. 4 OF 2014)}}</ref>
 
[[గోల్కొండ]] నవాబు [[అబుల్ హసన్ కుతుబ్ షా|అబుల్ హసన్ తానీషా]] పాలనా కాలంలో భద్రాచల ప్రాంతానికి తహశీల్దారుగా [[రామదాసు|కంచెర్ల గోపన్న]] ఉండేవాడు. ఇక్కడికి సమీపంలోని నేలకొండపల్లి గ్రామానికి చెందిన గోపన్న శ్రీరామ భక్తుడు. తాను ప్రజల నుండి వసూలు చేసిన పన్ను (6 లక్షల రూపాయలు) సొమ్మును ప్రభుత్వానికి జమ చెయ్యకుండా, భద్రగిరిపై శ్రీ రాముడు వెలసిన ప్రదేశమందు ఈ రామాలయాన్ని నిర్మించాడు. దేవునికి రకరకాల నగలు - చింతాకుపతకం, పచ్చలపతకం మొదలైనవి - చేయించాడు.
 
ఆ సొమ్ము విషయమై [[తానీషా]] గోపన్నను [[గోల్కొండ కోట]]లో బంధించగా, ఆ [[కారాగారము|చెరసాల]] నుండి తనను [[విముక్తి కోసం|విముక్తి]] చెయ్యమని రాముణ్ణి ప్రార్థించాడు, గోపన్న. ఆ సందర్భంలో రామునిపై [[పాటలు]] రచించి తానే పాడాడు. ఇవే [[రామదాసు కీర్తనలు]]గా ప్రసిద్ధి చెందాయి. గోపన్న కీర్తనలకు కరిగిపోయిన రాముడు, దేవాలయ నిర్మాణానికి ఉపయోగించిన ప్రభుత్వ సొమ్మును తానీషాకు చెల్లించి, గోపన్నకు చెరసాల నుండి విముక్తి ప్రసాదించాడని ఐతిహ్యం. ఆ విధంగా కంచెర్ల గోపన్నకు [[రామదాసు]] అనే పేరు వచ్చింది.
 
[[బొమ్మ:Srirama-Bhadra.jpg|right|thumb|భద్రాచల దేవస్థానంలో శ్రీ సీతారామ లక్ష్మణుల మూల విగ్రహాలు]]
[[బొమ్మ:Bhakta Ramadasu statue in Bhadrachalam.JPG|right|thumb|భద్రాచల దేవస్థానము వద్ద రామదాసు విగ్రహం]]
పంక్తి 40:
 
==రవాణా సౌకర్యాలు==
మండలకేంద్రమైన భద్రాచలం ప్రముఖ యాత్రాస్థలం కావడంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో రోడ్డు రవాణా సౌకర్యం బాగా ఉంది. [[హైదరాబాదు]] నుండి ఖమ్మం, కొత్తగూడెం మీదుగా, [[విజయవాడ]] నుండి [[కొత్తగూడెం (ఖమ్మం జిల్లా పట్టణము)|కొత్తగూడెం]] మీదుగా, [[రాజమండ్రి]] నుండి [[మోతుగూడెం]] మీదుగా, [[విశాఖపట్నం]] నుండి [[సీలేరు]], [[చింతపల్లి]] మీదుగా, [[వరంగల్|వరంగల్లు]] నుండి [[ఏటూరునాగారం|ఏటూరు నాగారం]] మీదుగా రోడ్డు మార్గాలు, బస్సు సౌకర్యాలు ఉన్నాయి.
 
భద్రాచలం [[రెవెన్యూ డివిజన్]] కేంద్ర స్థానమైనా రైలుసౌకర్యం లేదు. ఇక్కడికి 35కి.మీ.ల దూరంలోని [[కొత్తగూడెం (ఖమ్మం జిల్లా పట్టణము)|కొత్తగూడెం]]లో ఉన్న ''భద్రాచలం రోడ్'' స్టేషను అతి దగ్గరలోని రైల్వే స్టేషను. ప్రతిరోజూ హైదరాబాదు నుండి రెండు, విజయవాడ నుండి ఒకటి, [[రామగుండం]] నుండి ఒక రైలు ఈ స్టేషనుకు వచ్చిపోతాయి.
పంక్తి 49:
 
==కొన్ని వివరాలు==
 
భద్రాచలం పట్టణం పేరును ప్రభుత్వం [[2002]]లో <u>'''శ్రీరామ దివ్యక్షేత్రం'''</u> పట్టణంగా మార్చింది. భద్రాచలం రెవిన్యూ మండల జనాభాలో దాదాపు మూడోవంతు [[గిరిజనులు]]. వ్యవసాయాధారిత ఆర్థికవ్యవస్థ. పర్యాటకం మరో ప్రధాన ఆర్థిక వనరు. ప్రతీ వర్షాకాలంలోను గోదావరికి వరదలు వచ్చి భద్రాచలం పట్టణపు పల్లపు ప్రాంతాలు జలమయం కావడం సర్వసాధారణంగా ఉండేది. పట్టణ అభివృద్ధిలో భాగంగా నదికి వరదకట్టను నిర్మించిన తరువాత ఈ బెడద బాగా తగ్గింది. ప్రభుత్వ సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం (ఐ.టి.డి.ఏ) భద్రాచలంలోనే ఉంది.
* [[లోక్‌సభ]] నియోజకవర్గం: [[మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గం]] (పునర్విభజన అనంతరం)
"https://te.wikipedia.org/wiki/భద్రాచలం" నుండి వెలికితీశారు