పి.హేమలత: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
ఆమె స్వస్థలం [[కృష్ణా జిల్లా]]<nowiki/>లోని [[గుడివాడ]]. ఆమె 1926లో జన్మించింది. చిన్నప్పటి నుంచి నాటకాలంటే పెద్ద అభిలాష ఉండేది కాదు. అయితే ఆమె భర్త శేషగిరి రావు ప్రోత్సాహంతో నటిగా కెరీర్ ప్రారంభించింది. శేషగిరిరావు నాటక కళాభిమాని, రంగస్థల నటుడు కావడంతో ఆమెను నాటకాలలోకి ప్రవేశ పెట్టాలని అభిలషిస్తూ ఉండేవారు. ఏలూరు నాటక కళా పరిషత్తులో రావూరి గారు రచించిన "పరితాపం" అనే నాటకంలో ఆమె భర్త సహకారంతో నటించింది. తొలిసారిగా నటించినందుకు ఆమెకు బహుమతి కూడా వచ్చింది. మొదటి ప్రయత్నంలోనే ప్రత్యేక బహుమతి పొందిన ఆమెను పాలకొల్లు అదర్శ మండలి పినిశెట్టి శ్రీరామమూర్తి తమ నాటకం "పల్లె పడుచు" లో ఆమె చేత జమీందారిణి రమాదేవి పాత్రలో నటించే అవకాశం ఇచ్చాడు. ఈ నాటకం ఆంద్ర ప్రదేశ్ అంతా ప్రదర్శించబడి జమీందారిణి పాత్రలో అందరికీ సుపరితురాలింది.
 
వారికి మొదటి నుంచి [[గరికపాటి రాజారావు]] తోనూ, ప్రజా నాట్య మండలి తోనూ పరిచయాలుండేవి. ఈ పరిచయాల వల్ల సినిమాలలో అవకాశాలు లభించాయి. పీపుల్స్ ఆర్టు ప్రొడక్షన్స్ వారు "[[పల్లెటూరు (సినిమా)|పల్లెటూరు]]" చిత్రాన్ని తిస్తున్నప్పుడు అందులో ప్లీడరు భార్త పాత్ర ధరించడానికి తగిన వ్యక్తి కావాల్సి వచ్చింది. ఆ సమయంలో [[చదలవాడ కుటుంబరావు]], డైరక్టరు [[తాతినేని ప్రకాశరావు]] లు ఆమెను సిఫార్సు చేసారు. తాతినేని ప్రకాశరావు ఆమెను చుడనైనా చూడకుండా "అనసూయ" పాత్రను ఇచ్చారు. ఈ సమయంలో 10 నెలల వయసున్న ఆమె కుమారునికి జ్వరం వచ్చి మంచం పడినప్పటికీ హడావుడిగా మద్రాసు చేరుకుంది. అక్కడ కొందరు ఆమె "అనసూయ" పాత్రకు పనికిరాదన్నారు. కానీ ఆమె అధైర్యపడక సినిమాలో నటించింది.<ref>ఆదివారం ఆధ్రజ్యోతి 20 ఫిబ్రవరి, 2005</ref>
 
ఆ తర్వాత గుమస్తా (1953) లో నటించింది. ఆత్రేయ గారి "ఎన్.జి.ఓ" నాటకం ఆధారంగా నిర్మించిన చిత్రం అది. దాని తర్వాత నవయుగ వారు శ్రీధర్ దర్శకత్వంలో నిర్మించిన "జ్యోతి"(1954)లో నటించే అవకాశం లభించింది. ఆ సినిమాలో కథానాయకుని తల్లిగా నటించింది. తరువాత "అనుపమ" పతాకంపై నిర్మించిన చిత్రాల్లో చాలా పాత్రలను [[కె.బి. తిలక్|కె.బి.తిలక్]] గారు ఇచ్చారు. [[అత్తా ఒకింటి కోడలే]] (1958) చిత్రంలో అత్త భూమిక మొత్తం పోషించింది.
 
[[వద్దంటే డబ్బు]] సినిమాలో నటిస్తుండగా [[నందమూరి తారక రామారావు|ఎన్.టి.రామారావు]] ఆమెలో నటనా పటిమను గుర్తించి తాను స్వంతంగా నిర్మిస్తున్న [[పిచ్చి పుల్లయ్య (1953 సినిమా)|పిచ్చిపుల్లయ్య]] లో హీరో తల్లి పాత్ర ధరించడానికి అవకాశం ఇచ్చాడు. ఆ తర్వాత రామారావు గారు [[తోడుదొంగలు (1954 సినిమా)|తోడు దొంగలు]] సినిమాలో అతని భార్య పాత్ర ఇచ్చాడు. ఆ చిత్రానికి కేంద్ర ప్రభుత్వ బహుమతి వచ్చింది.
 
ఆమె నట జీవితంలో గొప్ప మలుపు [[వాహినీ ప్రొడక్షన్స్|వాహినీ]] వారి [[బంగారుపాప|బంగారు పాప]] (1954). వాహినీ సంస్థలో అవకాశం రావడమే గొప్పగా ఉండే రోజుల్లో ఆ సంస్థలో నటించడం ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది.
 
[[బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి|బి.ఎన్.రెడ్డి]] నిర్మించిన [[బంగారుపాప|బంగారు పాప]] సినిమాలో రౌడీ కోటయ్య ([[ఎస్.వి.రంగారావు]]) ను మాటలతో కట్టడి చేసే మంగమ్మ పాత్ర కోసం ఆమెను ఎంపిక చేసాడు. ఆ సినిమాలో "మంగమ్మ" పాత్ర ఆమెను చక్కటి ఆర్టిస్టుగా చలన చిత్ర రంగంలోనిలబెట్టింది. ఈ సినిమా అవార్డు సభలో బి.ఎన్.రెడ్డి మాట్లాడుతూ "బంగారు పాప లో మంగమ్మ పాత్ర ధరించిన హేమలత గారిలో నటనా కౌశలం మరుగున పడి ఉంది. మన నిర్మాతలందరూ అవకాశాలిస్తే బెట్టీ డెవిస్ లాగ నటించి ప్రజానీకాన్ని మెప్పించగల సామర్థం గల వారని" ఆమెను మెచ్చుకున్నాడు.
 
ఆ తర్వాత [[దుక్కిపాటి మధుసూదనరావు|దుక్కిపాటి మధుసూధనరావు]], [[అక్కినేని నాగేశ్వరరావు]] లు [[అన్నపూర్ణ పిక్చర్స్|అన్నపూర్ణా]] వారి [[దొంగ రాముడు (1955 సినిమా)|దొంగరాముడు]] లో దొంగరాముడి తల్లి పాత్ర ధరించడానికి అవకాశమిచ్చారు.
 
== సినీరంగ జీవితం ==
"https://te.wikipedia.org/wiki/పి.హేమలత" నుండి వెలికితీశారు