ముట్నూరి కృష్ణారావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 7:
==జీవిత విశేషాలు==
[[దస్త్రం:Mutnuri Krishna Rao.jpg|thumbnail|కుడి|మట్నూరి కృష్ణారావు చిత్రపటం]]
"[[కృష్ణా పత్రిక]]" సంపాదకులుగా తెలుగు ప్రజలను చైతన్యవంతం చేసిన పాత్రికేయులు శ్రీ ముట్నూరి కృష్ణారావు గారు 1879 లో [[కృష్ణా జిల్లా]] దివి తాలూకా [[ముట్నూరు]]<nowiki/>గ్రామంలో జన్మించారు. ఈయన పుట్టగానే తల్లి గతించింది. బాల్యంలోనే తండ్రి పరిమపదించడం వల్ల పినతండ్రి ప్రాపకములో పెరిగాడు. ఈయన ప్రాథమిక విద్యాభ్యాసం [[బందరు]]లోని హిందూ ఉన్నత పాఠశాలలో జరిగింది. ఆ తరువాత బందరులోనే [[నోబుల్ కళాశాల]]లో ఎఫ్.ఏ కోర్సులో చేరాడు. ఇక్కడే ఈయనకు [[రఘుపతి వెంకటరత్నంనాయుడు]] యొక్క శిష్యుడయ్యే అవకాశం కలిగింది. నాయుడు యొక్క సంఘసంస్కరణశీలన, మూఢాచార నిర్మూలణ వంటి ఉద్యమాలు కృష్ణారావును ప్రభావితం చేశాయి. గురువుతో కలిసి [[బ్రహ్మసమాజము]]లో ధార్మిక [[ఉపన్యాసాలు]] ఇవ్వటం అలవాటయ్యింది. నాయుడు కృష్ణారావును ఆదర్శ విద్యార్థిగా తీర్చిదిద్దటమే కాక, బ్రహ్మసమాజ ప్రచారకునిగా మలచాలని ప్రయత్నించాడు. అదే సమయంలో ఆంధ్ర పత్రిక సంపాదకుడు కాశీనాథుని నాగేశ్వరరావు ఐదువందల రూపాయల వేతనం ఆశచూపి [[కృష్ణాపత్రిక]]నుండి తమపత్రికకు ఆకర్షించ ప్రయత్నించాడు. మరోవైపు [[పట్టాభి సీతారామయ్య]] కృష్ణారావును రాజకీయాల్లోకి లాగే ప్రయత్నం చేశాడు. కానీ కృష్ణారావు వీటన్నింటికీ లొంగక జీవితాంతము కృష్ణాపత్రికలోనే పనిచేస్తూ తెలుగు భాషకు సేవ చేశాడు.
 
బందులో విద్యాభ్యాసము తర్వాత కృష్ణారావు మద్రాసు క్రిష్టియన్ కళాశాలలో బి.ఎ. చేరాడు. ఇక్కడే ఈయనకు [[పట్టాభి సీతారామయ్య]] సహాధ్యాయిగా పరిచయమయ్యాడు. కృష్ణారావు సంస్కృత సాహిత్యంతో పాటు ఆధునిక ఆంగ్ల సాహిత్యాన్ని కూడా అభ్యసించాడు. అవకాశం దొరికినప్పుడల్లా ఎమర్సన్, వాల్ట్ విట్మన్, షెల్లీ, కూపర్ ల వంటి పాశ్చ్యాత్య రచయితల రచనలు చదివేవాడు. కానీ బి.ఎ ఉత్తీర్ణులు కాలేదు. కృష్ణారావుగారు మద్రాసులో ఎఫ్.ఎ చదువుతున్నరోజులలో వంగనాయకుడు [[బిపిన్ చంద్రపాల్]] గారు [[బ్రహ్మ సమాజం]] ఉపన్యాసములు ఇవ్వ్వటానికి [[చెన్నై|మద్రాసు]] విచ్చేసినప్పుడు కృష్ణారావు గారికి ఆయన మీద గురి కుదిరి, ఆయనకి శిష్యులు అయినారు. అటుపై వంగవీరునితో [[బెంగాలు]] వెళ్ళారు. దాదాపు సంవత్సరం అజ్ఞాతవాసం చేసిన తరువాత ఇంటికి తిరిగివచ్చి [[కలకత్తా]]లో బిపిన్ పాలు, [[అరవింద ఘోష్]], [[ఠాగూర్]] వార్ల పరిచయము వలన వచ్చిన అనుభవముతో 1903లో బందరు తిరిగివచ్చి కృష్ణాపత్రికలో సహాయ సంపాదకునిగా చేరి, 1907లో సంపాదకుడైనాడు. అప్పటినుండి 1945లో మరణించేవరకు ఆ పత్రికకు సంపాదకునిగా పనిచేశాడు. తెలుగులోనే కాక మరే భాషలోనూ అన్ని సంవత్సరాలు ఒకే పత్రికకు సంపాదకత్వం వహించిన ఘనత కృష్ణారావుదే. మట్నూరి కొంతకాలం [[ఆంధ్ర భారతి]] అనే సాహిత్య పత్రికను కూడా నిర్వహించాడు.
 
తరువాతి కాలంలో బందరు ([[మచిలీ పట్నం]]) లో స్థిరపడి ఆంగ్ల భాషలో గొప్ప వక్తగా పేరొందారు. కృష్ణా పత్రిక కార్యాలయంలో వీరి గోష్ఠిని సాహితీ వేత్తలు " దర్బారు"గా వ్యవహరించేవారట. కృష్ణా పత్రిక జాతీయోద్యమ కాలంలో చురుకుగా వ్యవగహరించేది. ఆ రోజుల్లో పత్రిక కార్యాలయలంలో రాజకీయ, కళా, సాంస్కృతిక, సాంఘిక విషయాలపై పలు చర్చలు జరిగేవట. ఈ పత్రిక సంపాదకత్వ బాధ్యతను సమర్ధవంతంగా నిర్వహించిన శ్రీ ముట్నూరి ఒక [[కళ]]<nowiki/>గా, [[తపస్సు]]<nowiki/>గా పరిగణిస్తూ పత్రిక నడిపేవారని పత్రికారంగ ప్రముఖులు చెబుతుంటారు. కృష్ణా పత్రికలో వచ్చే వార్తల పై ప్రజలకు విపరీతమైన నమ్మకం ఉండేదట.
 
==మూలాలు==