తిరుగుబాటు (1950 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 29:
* నృత్యం: [[పసుమర్తి కృష్ణమూర్తి]]
==సంక్షిప్త చిత్రకథ==
మధ్యతరగతికి చెందిన ప్రసాద్, ఆనందమయి తమ ఇద్దరు పిల్లలతో హాయిగా జీవితం సాగిస్తుంటారు. మైకా వ్యాపారం చేయాలన్న ప్రయత్నంలో పడి ఆస్తి సర్వస్వం కోల్పోయి నిరుపేదలౌతారు. కానీ భగవంతుని కృపవల్ల పరిస్థితులు మెరుగుపడి సంపన్నులవుతారు. కానీ అనూరాధ అనే వేశ్య మోజులో పడి ప్రసాద్, తన భార్యాబిడ్డలని నిరాదరిస్తాడు. వారు విధిలేక మద్రాసు వెళ్ళి అనాథాశ్రమం నడిపే రామదాసు పంతులు పంచన చేరుతారు. కోర్టులో కేసు వేసి పిల్లలను తన వద్దకు రప్పించుకుంటాడు ప్రసాద్. తల్లి మీద బెంగతో పిల్లలు చిక్కిపోతారు. ప్రసాద్ కూడా క్షయవ్యాధికి గురి అవుతాడు. ఇంటి పెత్తనం చెలాయించే అనూరాధ ఆస్తినంతా కాజేయడానికి కుట్ర పన్నుతుంది. దీనిని గ్రహించిన మైకా గని కార్మికులంతా ఆనందమయి తరఫున నిలబడి ప్రసాద్‌పై తిరుగుబాటు చేస్తారు. అనూరాధను తన్ని తరిమేస్తారు. ప్రసాద్ తన తప్పును తెలుసుకుని పశ్చాత్తాపపడి తిరిగి ఆనందమయిని స్వీకరిస్తాడు. అందరూ కలుసుకోవడంతో కథ సుఖాంతమౌతుంది<ref name="జీవితమే సఫలము">{{cite book |last1=వి.వి.రామారావు |title=జీవితమే సఫలము 2వ సంపుటి |date=2009 |publisher=క్రియేటివ్ లింక్స్ పబ్లికేషన్స్ |location=హైదరాబాదు |page=49 |edition=1}}</ref>.
 
==మూలాలు==