మల్లమ్మ కథ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 59:
}}
==కథా సంగ్రహం==
నాగలాపురంలో అతి సామాన్యమైన కుటుంబంలో మల్లమ్మ జన్మించింది. చిన్న తనంలోనే తల్లి చనిపోవడంతో అల్లారుముద్దుగా పెంచాడు తండ్రి లింగారెడ్డి. తండ్రి వలె ఆమె శివభక్తురాలు. శివరాత్రి ఉత్సవాలను చూస్తున్న మల్లమ్మను అక్కడున్న అమ్మలక్కలు ఆమె జాతకం మంచిది కాదని పుట్టగానే తల్లిని పోగొట్టుకుందని తిట్టారు. అంత వరకు అమ్మ దేవుని వద్దకు వెళ్ళిందని లింగారెడ్డి చెప్పినమాటలు అబద్ధం అనిపించాయి. అమ్మను చూపించమని శివుని విగ్రహం ముందు మోకరిలి ప్రార్థించాడు. భక్తవశంకరుడైన శివుడు ఆమె తల్లి రూపంలో వచ్చి మల్లమ్మను లాలించాడు. రాత్రంతా తమవద్దమే ఉండమని చిన్నారి మల్లమ్మ చేసిన ప్రార్థనను త్రోసిపుచ్చలేక పోతాడు శివుడు. ఆనంద తాండవం చేస్తూ ఉండగా మధ్యలో అదృశ్యుడైన పరమశివుడు లేకుండా కైలాసం వెలవెల బోతున్నది. అక్కడికి కలహప్రియుడైన నారదుడు వచ్చి భోళాశంకరుడు ఐన వారికి, కాని వారికి వరాలిచ్చి నవ్వులపాలవుతున్నాడనీ, అతడిని అదుపులో ఉంచుకోమని పార్వతిని పురిగొల్పి వెళ్ళిపోయాడు.
 
==పాటలు==
"https://te.wikipedia.org/wiki/మల్లమ్మ_కథ" నుండి వెలికితీశారు