మదురా ద్వీపం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 31:
తరువాత డచ్చి వారు తమ సొంత ప్రతినిధితో మదురప్రాంతాన్ని నాలుగు రాష్ట్రాలుగా విభజించి పరిపాలనా కొనసాగించారు. ప్రారంభంలో ఈ ద్వీపం వలస దళాల మకాంగా ఉపయోగించబడింది. 19వ శతాబ్దం రెండవ భాగంలో ద్వీపసమూహంలోని డచ్-నియంత్రిత భూభాగాలకు ఉప్పు ప్రధాన ఆదాయవనరుగా మారింది.
==గణాంకాలు==
మదురాద్వీపం జనసంఖ్య సుమారు 3.65 మిలియన్లు. వీరిలో జాతిపరంగా మదురీలు అధికసంఖ్యలో ఉన్నారు. మదురాద్వీపంలో మదురేస్ భాష ప్రధాన భాషగా ఉంది. ఇది ఆస్ట్రోనేషియన్ భాషాకుటుంబంలో ఒకదానికి చెందినది. ఇది తూర్పు జావాలో కొంత భాగం, వెలుపలి 66 ద్వీపాలలో కూడా వాడుకలో ఉంది.
మదురీలు ఇండోనేషియాలో పెద్దజాతి సమూహంగా (7 మిలియన్ల మంది) ఉంది. వారు మదురా ద్వీపం నుండి మాత్రమేకాక పరిసరాలలోని ఉన్న గిలి రాజా, సపుడి, రాస్ మరియు కంగేయన్ దీవుల నుండి వచ్చారు. అదనంగా, చాలా మంది మదురీస్ తూర్పు జావా యొక్క తూర్పు భాగంలో నివసిస్తున్నారు. సాధారణంగా దీనిని "హార్స్షూ" అని పిలుస్తారు. పసురువాన్ నుండి బన్యువాంగికి ఉత్తరం వరకు వ్యాపించి ఉంది. సితుబొండో, బొండోవోసో, ప్రోబోలింగ్గో, జెంబర్కు తూర్పున, ఉత్తర సురబయ ప్రాంతాలలో కూడా మదురీయులు ఉన్నారు. వీరిలో కొందరు మాలాంగా, జావానీస్ భాషలను కూడా మాట్లాడే సామర్ధ్యం కలిగి ఉన్నారు.
మదురాలో అధికసంఖ్యలో సున్నీ ముస్లింలు, స్వల్పసంఖ్యలో షియా ముస్లిములు ఉన్నారు. 2012 నుండి అంతర్గత విశ్వాసాల అసమ్మతి హింసకు దారితీసింది. దాడులు జరిగిన ప్రాంతాలలో జ్సంపంగ్ నగరం చుట్టూ అనేక షియా గ్రామాలు ఉన్నాయి. దాడుల కారణంగా ప్రజలు వారి నివాసాలను వదిలి ప్రభుత్వ శరణార్థి కేంద్రాలను ఆశ్రయించారు. 2013 లో ఐక్యరాజ్యసమితి కార్యాలయం సమన్వయ మానవతా వ్యవహారాల కార్యాలయం ఈ దాడుల దాడుల వివరాలను అందించింది.
== మూలాలు ==
|