శారదా పీఠం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి చిన్న చేర్పు ట్యాగు: 2017 source edit |
చి చేర్పు ట్యాగు: 2017 source edit |
||
పంక్తి 40:
}}
'''శారదా పీఠం''', పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీరులో నీలం నది ఒడ్డున గల సరస్వతీ దేవి శక్తిపీఠం వద్ద ఉండేది. శారదా పీఠ్ 5000 సంవత్సరాల పురాతన హిందువుల మందిరం దీనిని క్రీస్తుపూర్వం 237 లో మౌర్య మహారాజు అశోకుడు నిర్మించారు. కానీ కొంత మంది కుషాన్ సామ్రజ్యంలో నిర్మించారు అని ,మార్తాండ్ సూర్య దేవాలయంతో పాటు కాశ్మీరీ రాజు లలితాదిత్య (724 CE - 760 CE) చేత నిర్మించబడిందని అని చెపుతారు శ్రీనగర్ నుండి 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న శారద పీఠంలోని 18 మహాశక్తి పీఠాలలో ఒకటి నీలం నదిని భారతదేశంలో కిషన్గంగ అని పిలుస్తారు. అయితే, ప్రస్తుతం ఆలయ శిథిలాలు తప్ప మరేమీ లేవు. ఈ ప్రాంతం వాస్తవాధీన రేఖకి చేరువలో పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీరులోని నీలం జిల్లాలో ఉంది. ఇక్కడ షీనా, కాశ్మీరీ భాషలు ఎక్కువగా మాట్లాడతారు. ఈ ఆలయం వల్లనే కాశ్మీరుని శారదాదేశంగా కూడా పిలుస్తారు.కాశ్మీరీ పండితులు చేయవలసిన తీర్థయాత్ర లలో మూడు పవిత్ర ప్రదేశాలలో మార్తాండ్ సూర్య దేవాలయం మరియు అమర్నాథ్ ఆలయంతో పాటు శారదా పీఠం ఒకటి .
ఇది ఒకప్పుడు కాశ్మీరీ పండితుల విద్యాకేంద్రంగా విరాజిల్లినది. ఇక్కడే ఆది శంకరుడు సర్వజ్ఞానపీఠాన్ని అధిష్టించాడు. రామానుజచార్య బ్రాహ్మణ సూత్రాలపై తన సమీక్షను ఇక్కడ రాశారు.ఒకప్పుడు సంస్కృత పండితులకు, కాశ్మీరీ పండితులకు; హిందూ, బౌద్ధ ధర్మాలకూ నిలయంగా ఉండేది.
|