నిర్మాణ కాలంనాటి తెలంగాణ లోని [[నల్గొండ జిల్లా]], ఆంధ్ర లోని hhcggjffyuj[[గుంటూరు cfhజిల్లా]] సరిహద్దుల పై [[కృష్ణా నది]]పై నిర్మింపబడిన [[ఆనకట్ట]] వల్ల ఏర్పడిన జలాశయాన్ని '''[[నాగార్జున సాగర్]]''' అంటారు. ఇది దేశంలోనే జలాశయాలలో రెండవ స్థానంలో ఉంది, పొడవులో మొదటిది.దీని నిర్మాణ కాలము [[1955]] - [[1967]]. ఈ జలాశయమునకి 11,472 మిలియన్ ఘనపు అడుగుల నీటిని నిలువ చేయు సామర్థము గలదు. దీని ప్రధాన కట్టడము 590 అడుగుల ఎత్తుకలిగి 1.6 కిలోమీటర్ల పొడవుతో 26 గేట్లతో ఉంది. ప్రతి గేటు 42 అడుగుల వెడల్పు కలిగి 45 అడుగులు ఎత్తు కలిగి యున్నది. దీని ద్వారా [[నల్గొండ జిల్లా|నల్గొండ]], [[సూర్యాపేట జిల్లా|సూర్యాపేట]], [[ఖమ్మం జిల్లా|ఖమ్మం]], [[కృష్ణా జిల్లా|కృష్ణా]], [[గుంటూరు జిల్లా|గుంటూరు]] జిల్లాలకు [[సాగునీరు]] అందించ బడుతున్నది. ఇక్కడ పెద్ద జల విద్యుత్ కేంద్రము కూడా ఉంది.