ఒగ్గు కథ: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 22:
శైవ సంప్రదాయంలో ఒక వర్గం వారు శివుని [[డమరుకం|డమరు]]కాన్ని జగ్గు అంటారు. దీనికి ఒగ్గు అని పేరు కూడ ఉంది. దీనిని వాడుతూ కథ జెప్తరు కాబట్టి కాబట్టి ఈ కథలకు ఒగ్గు కథ అనే పేరు వచ్చిందని.. ఈ కథలు శైవ మతానికి సంబంధించినవనీ మల్లన్న, బీరయ్య ప్రారంభంలో చెపుతూ వుండేవారనీ, అదీ కాక కురుమ కులం వారే ఈ కథలు చెప్పే వారనీ... బీరయ్య, మల్లన్నలు వీరి కుల దైవాలని ... డా.బిట్టు వెంకటేశ్వర్లు గారు [[కరీంనగర్]] రాష్ట్రీయ జానపదకళోత్సవాల సంచికలో వివరించారు.
 
[[వరంగల్ జిల్లా]], [[జనగాం]] తాలూకా [[నెల్లుట్ల]] గ్రామ వాసి బండి ఈనయ్య, [[నల్గొండ జిల్లా]], [[రామన్నపేట]] తాలూకా, [[ఆత్మకూరు (ఎమ్) (యాదాద్రి భువనగిరి)|ఆత్మకూరు]] గ్రామ వాసి, చర్ల కొండయ్య, [[వరంగల్ జిల్లా]], [[జనగాం]] తాలూకా [[మాణిక్యపురం]] గ్రామస్థుడు, చౌదరి పల్లి [[చుక్కా సత్తయ్య]]. మల్లికార్జున స్వామి ఒగ్గు డోలు బృందం [[జనగాం]] ఇది ముఖ్యమైన డోలు బృందాల్లో వాటిలో ఒకటిగా నిలిచింది. సభ్యులు బెల్లపురి వీరయ్య, జాయ సత్తయ్య, చంద్రయ్య తదితరులు ఉన్నారు...
 
వీరిలో చుక్కా సత్తయ్య దళం ఇటీవల కాలంలో చాల ప్రఖ్యాతి లోకి వచ్చింది. సత్తెయ్య కళా నైపుణ్యం అంతటిది. కథను గానం చేయడంలోనూ, అందుకు అనుగుణంగా అభినయించడం లోనూ సత్తయ్య, తన బాణీని నిలుపుకున్నాడు. గంభీరమైన కంఠంతో గానం చేస్తూ కథా సందర్భానికి అనుగుణంగా ఆయా పాత్రలలో ప్రవేశించి, అభినయించి ప్రేక్షకుల మన్ననలను అందుకుంటున్నాడు. ఒక్క తెలంగాణాలో నూరుకు పైగా బృందాలున్నాయని, ఈ బృందాలలో దాదాపు అయిదు వందల మంది బృంద సభ్యు లున్నారనీ సత్తయ్య గారు తెలియచేస్తున్నారు.
"https://te.wikipedia.org/wiki/ఒగ్గు_కథ" నుండి వెలికితీశారు