శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
#WPWPTE, #WPWP 'చిత్రం చేర్చాను'
పంక్తి 1:
[[File:Lord-venkateshwara.jpg|thumb|వేంకటేశ్వర స్వామి]]
'''శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం''' కలియుగ వైకుంఠపతి [[వెంకటేశ్వర స్వామి|వేంకటేశ్వరుని]] [[సుప్రభాత సేవ]]లో కీర్తించే [[స్తోత్రము]]. "సు-ప్రభాతము" అనగా "మంచి ఉదయం" అని అర్ధం. హిందూ పూజా విధానాలలోను, ప్రత్యేకించి [[శ్రీవైష్ణవం]] ఆచార పరంపరలోను, భగవంతుని పూజామూర్తికి అనేకమైన సేవలు ([[షోడశోపచారములు]]) నిర్వహించే సంప్రదాయం ఉంది. ఇలాంటి సేవలలోనిదే సుప్రభాత సేవ. ఆ సుప్రభాత సేవా సమయంలో చేసే కీర్తననే "సుప్రభాతం" అని అంటారు. తిరుమల శయన మంటపంలోని భోగశ్రీనివాసుని ఈ సుప్రభాతం ద్వారా మేల్కొలుపుతారు. బంగారు వాకిలిలో పదహారు స్తంభాల తిరుమామణి మంటపంలో ఈ సుప్రభాతాన్ని పఠిస్తారు. సుప్రభాత పఠనానంతరం భోగశ్రీనివాసుని గర్భగుడిలోనికి తీసికొని వెళతారు. 1430 సంవత్సరంలో శ్రీవీరప్రతాపరాయల హయాంలో వేదపఠవంతోపాటు సుప్రభాత పఠనం కూడా ఆరంభమైంది. అప్పటినుండి అవిచ్ఛిన్నంగా ఈ సంప్రదాయం కొనసాగుతున్నది.