ప్రతిపమహారాజుకుప్రతీపమహారాజుకు ఆయన భార్య సునందకు వారి వృద్ధాప్యంలో ఒక మగ బిడ్డ జన్మించాడు. కుమారుడు జన్మించిన తరువాత తన కోరికలను తపస్సు ద్వారా శాంతింపజేసాడు కనుక అతనికి ప్రతీపుడు శంతనుడు అని పేరు పెట్టాడు. ప్రతీపుడు అప్పుడు శంతనుడిని హస్తినాపుర రాజుగా నియమించి తాను తపస్సు చేయటానికి అడవులలోకి వెళ్ళాడు. శంతనుడి కంటే పెద్దవాడు అయిన [[బాహ్లికుడు]] కూడా శంతనుడికి హస్తినాపుర రాజు కావడానికి అనుమతి ఇచ్చాడు.