షేక్ మహబూబ్ సుభానీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
==నచ్చిన రాగాలు, కీర్తనలు==
ఈయనకు నచ్చిన రాగం తోడి, కాపి రాగాలు. నచ్చిన కీర్తన ఎందుకు దయ రాదు...అనేవి
==దంపతుల ప్రత్యేకత==
భార్యా భర్తలు ఇద్దరు కలిసి [[నాదస్వరం]] వాయించడము వీరి ప్రత్యేకత. వీరి ప్రతిభకు మెచ్చి తమిళనాడు ప్రభుత్వము వీరికి ''కలైమామిలి '' పురస్కారాన్ని ప్రసాదించి గౌరవించింది. భారత రాష్ట్రపతుల ఎదుట వీరి పాండిత్యాన్ని ప్రదర్శించే అవకాశము వీరికి కలిగింది. దంపతులుగా భారతదేశములో ఇటువంటి అరుదైన గౌరవాన్ని పొందిన వారు ఎవరు లేక పోవడము వీరి గొప్పతనము.సుబానీ, కాలేషాబీ దంపతులను 8.11.2021 నా పద్మశ్రీ అవార్డుతో సత్కరించారు.వీరి కుటుంబంలో ఎనిమిది తరాలు స్వరార్చనలోనే ఉన్నారు.నాదస్వరానికి రాగవిస్తారం (ఘనరాగాల)తో చిలకలూరిపేట బాణి తెచ్చారు.దూదేకుల ముస్లింలైన వీరి సంగీతార్చనతో ఎందరో దేవుళ్లు నిద్రలేస్తారు.ఏడో తరానికి చెందిన నాదబ్రహ్మ, నాదస్వర గానకళా ప్రపూర్ణ షేక్‌ చినపీరు సాహెబ్‌ చిలకలూరిపేటలో నివసించిన ప్రాంతానికి చినపీరుసాహెబ్‌ వీధిగానే నామకరణం చేశారు. నాదస్వర విద్వాంసుడిగా పేరొందిన షేక్‌ చినపీరు సాహెబ్‌కు ముందు 1825 నుంచి వారి వంశీకులు షేక్‌ నబీసాహెబ్, షేక్‌ చిన నసర్దీ, పెద నసర్దీ సోదరులు, షేక్‌ పెద హుస్సేన్, చిన హుస్సేన్, దాదాసాహెబ్, గాలిబ్‌సాహెబ్‌ సోదరులు నాదస్వర విద్వాంసులే. చినపీరు సాహెబ్‌ వద్ద శిష్యరికం చేసిన షేక్‌ ఆదంసాహెబ్‌ సంగీత విద్వాంసుల కోటాలో ఎమ్మెల్సీ అయ్యారు.మరో శిష్యుడు కరువది షేక్‌ చినమౌలాసాహెబ్‌ పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. షేక్‌ చినపీరుసాహెబ్‌ మనవడే (కూతురి కుమారుడు) షేక్‌ మహబూబ్‌ సుభాని. ఆయన భార్య షేక్‌ కాలేషాబీ కూడా చినపీరుసాహెబ్‌కు వరుసకు మనవరాలే. సుభాని దంపతుల కుమారుడు షేక్‌ ఫిరోజ్‌బాబు కూడా తల్లిదండ్రులతో పాటు నాదస్వర విద్వాంసుడే.సుభాని తండ్రి షేక్‌ మీరా సాహెబ్‌ వద్ద నాదస్వరంలో ఓనమాలు దిద్దారు. షేక్‌ కాలేషాబీ తన తొమ్మిదో ఏట ఆమె తండ్రి షేక్‌ జాన్‌సాహెబ్‌ వద్ద నాదవిద్య అభ్యసించారు. 1978లో వీరి వివాహం అనంతరం కర్నూలు ప్రభుత్వ శారదా సంగీత కళాశాల ప్రిన్సిపాల్‌ కె.చంద్రమౌళి వద్ద కొంతకాలం పద్మశ్రీ డాక్టర్‌ షేక్‌ చినమౌలానా సాహెబ్‌ వద్ద నాదస్వరం అభ్యసించారు.2010 అక్టోబర్‌ నుంచి ఆలిండియా రేడియోలో వీరు టాప్‌గ్రేడ్‌ నాదస్వర విద్వాంసుల ద్వయంగా కొనసాగుతున్నారు.
భార్యా భర్తలు ఇద్దరు కలిసి [[నాదస్వరం]] వాయించడము వీరి ప్రత్యేకత. వీరి ప్రతిభకు మెచ్చి తమిళనాడు ప్రభుత్వము వీరికి ''కలైమామిలి '' పురస్కారాన్ని ప్రసాదించి గౌరవించింది. భారత రాష్ట్రపతుల ఎదుట వీరి పాండిత్యాన్ని ప్రదర్శించే అవకాశము వీరికి కలిగింది. దంపతులుగా భారతదేశములో ఇటువంటి అరుదైన గౌరవాన్ని పొందిన వారు ఎవరు లేక పోవడము వీరి గొప్పతనము.
== వేలాది కచేరీలు,బిరుదులు ==
* 2005 మార్చి 5న రాష్ట్రపతి భవన్‌లో అప్పటి రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం ముందు కచేరీ
* 2001 మార్చి 24 నుంచి శృంగేరి శ్రీశారదా పీఠం ఆస్థాన విద్వాంసులుగా ఉన్నారు.
*1994లో తమిళనాడు ప్రభుత్వం కలైమామణి అవార్డు
* 2000లో చెన్నై బాలాజీ టెలివిజన్‌ సంస్థ దేశ థమారై అవార్డు,
*2002లో నాదస్వర కళానిధి అవార్డు
*2004లో అమెరికాలోని సౌత్‌ ఇండియన్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ ఆఫ్‌ కాలిఫోర్నియా అవార్డు
*2005లో డాక్టర్‌ తిరువెంగడు సుబ్రమణ్యపిళ్లై శతాబ్ది అవార్డు
*2008లో నాదస్వర చక్రవర్తి అవార్డు
*2009లో ఇంటిగ్రిటీ కల్చరల్‌ అకాడమీ (చెన్నై) అవార్డు
*2009లో కెనడియన్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ అవార్డు
*2015లో సంగీత మాసపత్రిక (చెన్నై) నాదబ్రహ్మం అవార్డు
*2016లో శ్రీలంకలో నాదస్వర గానకళా వారధి అవార్డు
*2017లో ఏపీ ప్రభుత్వం హంసకళా రత్న అవార్డు
 
==మూలాలు==
* http://www.kutcheribuzz.com/kb-special/kb-interviews/326-nadaswaram-couple
"https://te.wikipedia.org/wiki/షేక్_మహబూబ్_సుభానీ" నుండి వెలికితీశారు