ఎలకూచి బాలసరస్వతి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి clean up, typos fixed: కలదు. → ఉంది., నందలి → లోని , ని → ని , → (5), , → ,, ) → ) (2), ( → ( |
చి clean up, replaced: క్రీ.శ → సా.శ., typos fixed: ని → ని , → |
||
పంక్తి 1:
'''ఎలకూచి బాలసరస్వతి''' జన్మతః [[మహబూబ్ నగర్ జిల్లా|పాలమూరు జిల్లా]] వాడు కాకపోయినా, కాకలుదీరిన కవిగా ఘనతికెక్కినది మాత్రం పాలమూరు జిల్లాకు చెందిన [[జటప్రోలు సంస్థానము]]లోనే. [[నెల్లూరు]] జిల్లా [[పొదిలి]] తాలుకాలోని [[ఎడవిల్లి అగ్రహారం]] వీరి జన్మస్థానం<ref>ఆరుద్ర, సమగ్ర ఆంధ్ర సాహిత్యం,10వ సంపుటం,నాయకరాజుల యుగం-1, ఎమెస్కో,మద్రాస్,1966, పేజి-29</ref>. ఇతడు
==సాహితీ ప్రస్థానం==
ఎలకూచి బాలసరస్వతి అసలు పేరు "ఎలకూచి వెంకటకృష్ణయ్య". [[బాల్యం]]లోనే అసమాన్యమైన ప్రతిభా పాండిత్యం చూపడం వలన వీరికి బాల సరస్వతి అను బిరుదు వచ్చింది. ఆ బిరుదునామమే వీరి వ్యవహార నామంగా స్థిరపడిపోయింది. వీరి తండ్రి గారు కృష్ణయ్య. తెలుగు సాహిత్యంలో మహామహోపాధ్యాయగా గణతికెక్కిన తొలి సాహితీవేత్తగా బాలసరస్వతికి పేరుంది.<ref>పాలమూరు సాహితీ వైభవం, రచన: ఆచార్య ఎస్వీ రామారావు, ముద్రణ 2010, పేజీ 20</ref> ఆరు భాషలలో పండితుడు. "షడ్భాషా వివరణము" అనే వీరి గ్రంథం ఆ విషయాన్ని ఋజువుచేసేదేనని పండితుల అభిప్రాయం. రంగకౌముది అను నాటకాన్ని, కార్తికేయాభ్యుదయం, వామన పురాణం, బాహటం అనే ప్రబంధాలు రచించాడు. భ్రమరగీతాలు రాశాడు. వీరు [[విజయనగరం]]లో ఉండిన కాలంలోనే [[నన్నయ్య]] రాసిన ఆంధ్రశబ్ధచింతామణికి వ్యాఖ్యానం రాశాడు. అయితే ఈ గ్రంథం నన్నయ రాయలేదని, బాలసరస్వతే రాసి, దానికి గౌరవం కలిగించడం కొరకు [[నన్నయ]] పేరు పెట్టి ఉండవచ్చునని కొందరి వాదన. తరువాత త్ర్యర్థి కావ్యంగా ' రాఘవ యాదవ పాండవీయం ' అను కావ్యాన్ని రాశాడు. ఇది నాలుగు ఆశ్వాసాల కావ్యం. [[శ్రీ వేంకటేశ్వరుడు|తిరుపతి వెంకటేశ్వరుని]]కి అంకితం ఇచ్చాడు. పర్తియాల సంస్థానాధిపతి జూపల్లి వెంకటాద్రి కోరిక మేరకు [[భీముడు]], [[కాశీరాజు]] కూతురు నాయకా, నాయికలుగా "చంద్రికా పరిణయం" అను ప్రబంధ కావ్యాన్ని రాశాడు. ఈ గ్రంథంలో పర్తియాల సంస్థానానికి చెందిన జూపల్లి వారి వంశ చరిత్ర వివరించబడింది. అటుపిమ్మట జటప్రోలు సంస్థానానికి వచ్చి [[సురభి మాధవ రాయలు|సురభి మాధవరాయ]]ల కోరిక మేరకు భరృహరి సుభాషిత త్రిశతిని [[తెలుగు]] చేయడానికి పూనుకున్నాడు. భరృహరి సుభాషితాలను అనువాదం చేసిన తొలి తెలుగువాడు కూడా ఎలకూచి బాలసరస్వతే. మాధవరాయల తండ్రి మల్లానాయుడి పేరు మీదగా 'మల్ల భూపాలీయం' గా అనువాదం చేసి ముమ్మడి మల్లానాయుడుకు అంకితమిచ్చాడు.<ref>తెలంగాణ సాహిత్య వైశిష్ట్యం, రచన: ఆచార్య ఎస్వీ రామారావు, ముద్రణ 2012, పేజీ 76</ref> ఇందులో [[నీతి]], [[శృంగారం|శృంగార]], వైరాగ్య శతకాలన్నిటిలోనూ మల్లనాయిని మకుటంతోనే చెప్పటం విశేషం. ' సురభి మల్లా! నీతి వాచస్పతీ!' మకుటంతో నీతి శతకాన్ని, ' సురభి మల్లా! మానినీమన్మథా!' మకుటంతో శృంగార శతకాన్ని, 'సురభి మల్లా! వైదుషీ భూషణా!" మకుటంతో వైరాగ్య శతకాన్ని రాశాడు. ఎలకూచి బాలసరస్వతి రాసిన చివరి గ్రంథం కూడా ఇదేనని పండితుల అభిప్రాయం. ఈ అనువాదానికి ఆనందించిన సురభి మాధవరాయలు ఎలకూచి బాలసరస్వతికి రెండువేల దీనారాలు ఇచ్చి సత్కరించాడు ఈ విధంగా [[జటప్రోలు సంస్థానము|జటప్రోలు]] సంస్థానానికి బాలసరస్వతి గౌరవాన్ని చేకూర్చితే, బాలసరస్వతికీ జటప్రోలు సంస్థానం గౌరవాన్ని చేకూర్చింది.
పంక్తి 25:
ఈయన కృష్ణా మండల నివాసి. జటప్రోలు సంస్థానాశ్రయుడు. తన త్రిశతిని ఆ సంస్థానా ధీశ్వరుడు సురభిమల్ల భూపాలుని పేర రచించి యాయనచే రెండు వేల దీనారముల బహుకరణ మందెనని ప్రసిద్ధి. కృతి పతి వంశజులగు శ్రీ సురభి రాజా వేంకట లక్ష్మారావు బహదురు వారు యిదివరలో నీ మల్ల భూపాలీయమును ప్రకటించుయున్నారు.
==ఆయన రచనల విశిష్టత==
బాల సరస్వతి రచనలలో యాదవ రాఘవ పాండవీయము తెనుగు లోని త్ర్యర్థి కావ్యములలో కెల్ల మొదటిది. అతని రంగ కౌముది యప్పుడప్పుడే వెలువడుచున్న [[యక్షగానము]]లతో నొకటియై నాటక ముల కుప లక్షణగ నున్నది. ఆయన ఆంధ్ర శబ్ద
ఇతని కవిత్వమున జీవముట్టిపడు చుండును. ఇతడు శతక త్రయమునకు మకుటముగ, సురభిమల్లా నీతి వాచస్పతి, సురభిమల్లా మానినీ మన్మధా, సురభిమల్లా వైదుషీ భూషణా అని అనుకరించుయున్నాడు. మకుట నిర్బంధంచే నితడు శతక త్రయమున శార్దూల మత్తేభములతోనే రచించవలసి వచ్చెను.
|