భారతీయ జనసంఘ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 13:
జనతా ప్రభుత్వం విచ్ఛిన్నం కావడంతో [[1980]] లోకసభ ఎన్నికల ముందు పూర్వపు భారతీయ జనసంఘ నేతలు జనతా పార్టీ నుండి బయటకు వచ్చి భారతీయ జనతా పార్టీ పేరుతో కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. అటల్ బిహారీ వాజపేయి భాజపాకు తొలి అద్యక్షుడిగా పనిచేశాడు. [[1989]] తరువాత ఈ పార్టీ బలపడింది. అటల్ బిహారీ వాజపేయి 3 సార్లు [[ప్రధానమంత్రి]] పదవిని కూడా చేపట్టినాడు.
==ప్రముఖ జనసంఘ్ నాయకులు==
;శ్యాంప్రసాద్ ముఖర్జీ
:[[1901]], [[జూన్ 6]]న జన్మించిన శ్యాంప్రసాద్ ముఖర్జీ ప్రముఖ జాతీయవాద నేతలలో ప్రముఖుడు. 1951లో భారతీయ జనసంఘ్ పార్టీ స్థాపించిన ముఖర్జీ ఆధునిక హిందుత్వ మరియు హిందూ జాతీయవాదాన్ని ప్రగాఢంగా విశ్వశించాడు. హిందూ మహాసభ మరియు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సభ్యుడైన శ్యాం ప్రసాద్ ముఖర్జీ జనసంఘ్‌ను స్థాపించి దేశంలో తొలి హిందూవాద రాజకీయ పార్టీని స్థాపించిన తొలి నేతగా స్థానం పొందినాడు. కలకత్తా విశ్వవిద్యాలయం కులపతిగా పనిచేసిన [[అశుతోష్ ముఖర్జీ]] కుమారుడైన శ్యాంప్రసాద్ ముఖర్జీ కోల్‌కత లోనే ఉన్నత విద్యాభ్యాసం అభ్యసించి ప్రారంభంలో కాంగ్రెస్ వాదిగానే రాజకీయ జీవితం ఆరంభించినాడు. స్వాతంత్ర్యానికి పూర్వం [[జవహర్ లాల్ నెహ్రూ]] నేతృత్వంలోని మద్యంతర ప్రభుత్వంలో పరిశ్రమల మంత్రిగా పనిచేశాడు. [[1949]]లో ఢిల్లీ ఒప్పందానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పుకొని [[అక్టోబర్ 21]], [[1951]]న జనసంఘ్ పార్టీని స్థాపించి, ఆ పార్టీ వ్యవస్థాపక అద్యక్షుడిగా [[మే 23]], [[1953]]న మరణించేవరకు కొనసాగినాడు.
;అటల్ బిహారీ వాజపేయి {{main|అటల్ బిహారీ వాజపేయి}}
:[[1924]]లో [[గ్వాలియర్]] లో జన్మించిన వాజపేయి [[1968]] నుండి [[1973]] వరకు జనసంఘ్ అద్యక్ష పదవిని చేపట్టినాడు. 1977లో మురార్జీ దేశాయ్ నేతృత్వంలో ఏర్పడిన జనతా ప్రభుత్వంలో కీలకమైన విదేశాంగ మత్రివ్త శాఖను నిర్వహించాడు. 1980లో జనతాపార్టీ నుంచి బయటకు వచ్చి పూర్వపు జనసంఘ్ నేతలుేర్పాటు చేసిన భారతీయ జనతా పార్టీకి అటల్ బిహారీ వాజపేయి వ్యవస్థాపక అద్యక్షుడిగా వ్యవహరించాడు. కేంద్రంలో 3 సార్లు ఏర్పడిన భాజపా ప్రభుత్వానికి కూడా వాజపేయే ప్రధానమంత్రిగా పనిచేశాడు.
"https://te.wikipedia.org/wiki/భారతీయ_జనసంఘ్" నుండి వెలికితీశారు