జై ఆంధ్ర ఉద్యమం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ప్రముఖుల పలుకులను తొలగించాను |
కొంత వివరణ ఛేర్చాను |
||
పంక్తి 1:
{{విస్తరణ}}
[[హైదరాబాదు]] సంస్థానంలో [[1915]] లో [[నిజాము]] జారీ చేసిన ఒక ఫర్మానా ప్రకారం [[ముల్కీ నియమాలు]] అమలు లోకి వచ్చాయి. వీటి ప్రకారం హైదరాబాదు సంస్థానంలో పుట్టిన వారు కాని, హైదరాబాదులో కనీసం 15 ఏళ్ళుగా నివసిస్తూ, తమ ప్రాంతానికి తిరిగి వెళ్ళమని అఫిడవిట్టు ఇచ్చిన వారు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హులు. [[1969]]లో ముల్కీ నియమాలు భారతదేశ ప్రజల మౌలిక హక్కులను కాలరాచేటట్లు ఉండటం వలన రాజ్యాంగ విరుద్దమని<ref name="supreme1">http://openarchive.in/judis/1772.htm</ref> భారత అత్యున్నత న్యాయస్థానం తన తీర్పులో ప్రకటించడంతో [[మొదటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమము|మొదటి తెలంగాణా ఉధ్యమం]] ఉదృతరూపం దాల్చింది. అయితే [[1972]]లో వేరొక కేసులో అంతకు ముందు తాను చేసిన తీర్పును చెల్లుబాటు కాకుండా ముల్కీ నియమాలను హైదరాబాదులో ఎప్పటినుండో ఉన్న నియమ నిభందనలను కావున వాటిని గౌరవించాలనే ఉద్దేశంతో ముల్కీ నిభందనలను అమలు చేయాలని అత్యున్నత న్యాసస్థానం తీర్పునిచ్చింది<ref name="supreme2">http://openarchive.in/judis/6695.htm</ref>. ముల్కీ నిబంధనలపై [[సుప్రీం కోర్టు]] ఇచ్చిన తీర్పునకు పర్యవసానంగా '''జై ఆంద్రా''' పేరుతో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమానికి దారితీసింది.
==నేపథ్యం==
==ఉద్యమ ప్రస్థానం==
కేంద్రప్రభుత్వం రాజీ ప్రతిపాదనగా ఈ నిబంధనల కాలపరిమితి రాజధానిలో 1977 వరకు, మిగతా తెలంగాణ్లో 1980 వరకు మాత్రమే అమల్లో ఉంటాయని శాసనం చేసింది. అయితే ఈ ప్రతిపాదన ఆంధ్ర ప్రాంతం వారికి రుచించలేదు. విద్యార్థులు ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఉద్యోగులు నిరవధిక సమ్మెకు పూనుకున్నారు. శాసనసభ స్పీకరు [[బి.వి.సుబ్బారెడ్డి]] పదవికి రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొన్నాడు. ఆ ప్రాంత శాసనసభ్యులంతా [[తిరుపతి]] లో సమావేశమై చర్చించారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన అత్యధిక మంత్రులు రాజీనామా చేసారు.
ఉద్యమం హింసాత్మకంగా జరిగింది. సమైక్యవాదులపై దాడులు జరిగాయి. కమ్యూనిస్టు పార్టీ బహిరంగంగా ఉద్యమాన్ని వ్యతిరేకించింది. రాష్ట్ర విభజన రాష్ట్రహితం కాదని వాదించింది. ఆ పార్టీ పత్రిక [[విశాలాంధ్ర దినపత్రిక]] లో ఉద్యమానికి వ్యతిరేకంగా వ్యాసాలు రాసింది. ఉద్యమకారులు పత్రిక ఆఫీసుపై దాడులు చేస్తామని బెదిరించారు.
Line 23 ⟶ 21:
ఉద్యమ కార్యాచరణ సంఘం ఈ పథకాన్ని ఆమోదించింది. [[1973]] [[డిసెంబర్]] లో పార్లమెంటు ఈ ప్రణాళికను 33 వ రాజ్యాంగ సవరణ ద్వారా [[భారత రాజ్యాంగం|రాజ్యాంగం]]లో చేర్చింది. కేంద్రం రాష్ట్రపతి పాలన తొలగించి [[జలగం వెంగళరావు]] నాయకత్వంలో తిరిగి ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసింది.
== మూలాలు ==
<references />
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర|ఉద్యమం]]
[[వర్గం:ప్రజా ఉద్యమాలు]]
|