భమిడిపాటి రాధాకృష్ణ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 34:
| weight =
}}
'''భమిడిపాటి రాధాకృష్ణ''' (1929 - 2007) ప్రముఖ నాటక, సినీ కథా రచయిత, జ్యోతిష శాస్త్ర పండితుడు, సంఖ్యాశాస్త్ర నిపుణుడు. ప్రముఖ హస్య రచయిత, "హాస్య బ్రహ్మ" శ్రీ [[భమిడిపాటి కామేశ్వరరావు]] వీరి తండ్రి. '''భమిడిపాటి రాధాకృష్ణ''' బహుముఖ ప్రజ్ఞశాలి. భమిడిపాటి రాధాకృష్ణ 3 నాటకాలు, 6 నాటికలు రచించగా అవి [[కన్నడ]], [[తమిళం|తమిళ]], [[హిందీ]] భాషల్లోకి అనువాదమయ్యాయి. ఇదేమిటి, కీర్తిశేషులు, మనస్తత్వాలు, భజంత్రీలు, దంత వేదాంతం వంటి నాటికలు, నాటకాలు వ్రాశారు. [[రావుగోపాలరావు]] 'కీర్తిశేషులు' లోని ఒక పాత్రద్వారా మంచి పేరు తెచ్చుకుని సినీ పరిశ్రమలోనూ అడుగుపెట్టి ప్రముఖులైయ్యారు.
 
* నిర్మాత [[దుక్కిపాటి మధుసూదనరావు]] ప్రోద్బలంతో సినీ రంగంలోకి ప్రవేశించి 150 సినిమాలకు కథలందించారు. ఇందులో [[కె.విశ్వనాథ్‌]] తొలి చిత్రమైన [[ఆత్మగౌరవం]] కూడా ఉంది. [[బ్రహ్మచారి]], [[కథానాయకుడు]], [[కీర్తిశేషులు]], [[మరపురాని కథ]], [[విచిత్ర కుటుంబం]], [[పల్లెటూరి బావ]], [[ఎదురులేని మనిషి]], [[గోవుల గోపన్న]], [[సీతారామ కళ్యాణం]], [[నారీనారీ నడుమ మురారి]], [[కాలేజీ బుల్లోడు]] వంటివితో సహా తెలుగు చిత్రాలకు కథలు వ్రాశారు ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ లకు ఆయన సన్నిహితుడు. 1994 తర్వాత క్రమంగా ఆయన సినిమా రంగానికి దూరమయ్యారు.