గంగారాం ఆర్య: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''గంగారాం ఆర్య''' (Gangaram Arya) [[మహబూబ్ నగర్ జిల్లా]] పాలుమాకులలో 1922లో ఒక సాధారణ కుటుంబంలో జన్మించాడు. మొదటి నుంచి ఇతనికి [[ఆర్యసమాజం]]తో అనుబంధం ఉంది. అక్కడే తెలుగు, హిందీ భాషలలో ప్రావీణ్యం సాధించాడు. [[హైదరాబాదు]]లో హిందువులపై ముస్లింపాలకులు, రజాకార్లు చేస్తున్న దుండగాలు, దుర్మాగాలు, అత్యాచారాలు చూసి చలించిపోయాడు.<ref>భారత స్వాతంత్ర్య సంగ్రామంలో తెలుగు యోధులు, ఆంధ్రప్రదేశ్ ఫ్రీడం ఫైటర్స్ కల్చరల్ కమిటీ ప్రచురణ, ప్రథమ ముద్రణ, 2006, పేజీ 243</ref> [[నారాయణరావు పవార్]], [[జగదీశ్ ఆర్య]] లతో కలిసి పోరాటం కొనసాగించారు. వీరు ముగ్గురు హైదరాబాదు స్వాతంత్ర్య పోరాట త్రిమూర్తులుగా కీర్తిగడించారు. పవార్, జగదీస్, గంగారాం ముగ్గురు కలిసి నిజాం మీద బాంబులు విసరాలని పథకం రూపొందించారు. 1947 డిసెంబరు 4న సాయంత్రం కింగ్‌కోఠి ప్రాంతంలో ఆల్‌సెయింట్స్ స్కూలు మలుపులో కారులో ప్రయాణిస్తున్న నిజాంపై నారాయణరావు పవార్ బాంబు విసిరి చంపే ప్రయత్నం చేశాడు. బాంబు విసరడం సఫలమైనా గురి తప్పడంతో నిజాం ప్రాణాలు కోల్పోలేడు.
 
 
"https://te.wikipedia.org/wiki/గంగారాం_ఆర్య" నుండి వెలికితీశారు