దీపావళి: కూర్పుల మధ్య తేడాలు

వర్గం - పండుగలు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
==దీపావళి==
 
[[భారతీయ సంస్కృతి]] కి ప్రతిబింబంగా వెలుగొందేవి మన పండుగలు. వానిలో ఆనంద ఉత్సాహాలతో జాతి, కుల,మత, వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగే దివ్య దీప్తుల '''దీపావళి'''. జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభావళి.
 
==దీపం జ్యోతి పరబ్రహ్మమ్==
పంక్తి 9:
http://www.bapuart.com// వారి సౌజన్యంతో]]
 
భిన్నత్వంలో ఏకత్వాన్ని సృజించే ఈ దీపావళి కోటి కాంతుల రవళి- విరిసే చైతన్య దీప్తుల జావళి. కొత్త ఆశలతో , ఆశయాలతో ఈ దీపావళి మానవ జీవితంలో పారమార్థిక వెలుగు రేఖలను[[రేఖ]] లను పూయిస్తుందని హైందవజాతి ప్రగాఢ విశ్వాసం.
 
'''" దీపం జ్యోతి పరబ్రహ్మమ్<br>
పంక్తి 26:
 
 
అంధ తమ్స్రమనేది ఒక [[నరకం]], దక్షిణాయన పాపకాలం నుండి తప్పించుకొని తరించడానికి ఉత్తరాయణ పుణ్యకాలంలో జ్యోతిని[[జ్యోతి]] ని దానం చేయుట ఉత్తమోత్తమమైన కార్యంగా భావిస్తారు [[హైందవులు]].
 
[[ఆశ్వయుజ మాసం]]లో వచ్చే బహుళ చతుర్ధశి , అమావాస్యలు[[అమావాస్య]] లు పరమ పవిత్ర పర్వదినాలు. భక్తి విశ్వాసాలతో , ఆనందోత్సాహాలతో దేశమంతటా పిల్లలూ, పెద్దలూ అందరూ కలసి జరుపుకునే పండుగ రోజులివి.
 
==నరక చతుర్ధశి==
పంక్తి 34:
http://www.bapuart.com// వారి సౌజన్యంతో]]
 
ఆశ్వయుజ బహుళ చతుర్ధశి [[నరక చతుర్ధశిగాచతుర్ధశి]] గా ప్రసిద్ధి పొందింది. [[నరకాసురుడు|నరకాసురుడ]]నే రాక్షసుడు చెలరేగి సాధు జనాలను పీడిస్తూ దేవ, మర్త్య లోకాలలో సంక్షోభాన్ని కలిగిస్తుంటాడు. [[కృతయుగం]]లో హిరణ్యాక్షుని వధించిన [[వరాహస్వామి]]కి, భూదేవికి అసుర సంధ్యా సమయంలో జన్మిస్తాడు నరకుడు. అతడు లోక కంటకుడైనా [[మహావిష్ణువు]] వధించరాదని, తల్లియైన తన చేతిలోనే మరణించేలా వరం పొందుతుంది భూదేవి. మహావిష్ణువు ద్వాపరయుగంలో శ్రీకృష్ణ భగవానునిగా అవతరించినప్పుడు భూదేవి [[సత్యభామ]]గా జన్మింస్తుంది.
 
అప్పటికి నరకాసురుడు లోక కంటకుడై చేస్తున్న అధర్మకృత్యాలను అరికట్టడానికి సత్యభామా సమేతంగా తరలి వెళ్తాడు [[శ్రీకృష్ణుడు]]. వారి మధ్యజరిగిన భీకర సంగ్రామంలో భూదేవి అంశ అయిన సత్యభామ శరాఘాతాలకు మరణిస్తాడు నరకుడు.
పంక్తి 40:
తన పుత్రుని పేరైనా కలకాలం నిలిచి ఉండేలా చేయమని సత్యభామ ప్రార్థించడంతో ఆ రోజు నరక చతుర్థశిగా పిలువబడుతుందని వరం ప్రసాదిస్తాడు శ్రీకృష్ణుడు. నరకుని చెరనుండి సాధుజనులు, పదహారువేలమంది రాజకన్యలు విడిపించబడ్డారు, ధ్రర్మం సుప్రతిష్టమైంది.
 
నరకుని మరణానికి సంతోషంతో మర్నాడు [[అమావాస్య]] చీకటిని పారద్రోలుతూ దీపాలతో తోరణాలు వెలిగించి బాణాసంచా కాల్చి పండుగ జరుపుకోవడం, అదే దీపావళి పండుగగా ప్రసిద్ది చెందడం జరిగాయి.
 
==దీపావళి==
పంక్తి 49:
'''అలక్ష్మీ పరిహారార్థం తైలాభ్యంగో విధీయతే!.<br>
 
దీపావళినాడు నూనెలో ( ముఖ్యంగా [[నువ్వులనూనె]]) లక్ష్మీదేవి, నదులు, బావులు, చెరువులు మొదలైన నీటి వనరులలో గంగాదేవి సూక్ష్మ రూపంలో నిండి వుంటారు. కనుక ఆ రోజు నువ్వుల నూనెతో తలంటుకుని సూర్యోదయానికి ముందు నాలుగు ఘడియలు అరుణోదయ కాలంలో అభ్యంగన [[స్నానం]] తప్పకుండా చేయాలి. ఇలా చేయుడం వల్ల దారిద్ర్యం తొలగుతుంది, గంగానదీ స్నాన ఫలం లభిస్తుంది, నరక భయం ఉండదనేది పురాణాలు చెపుతున్నాయి.
 
అమావాస్యనాడు స్వర్గస్థులైన పితరులకు తర్పణం విడవడం విధి కనుక దీపావళినాడు తైలాభ్యంగన స్నానం తరువాత పురుషులు జలతర్పణం చేస్తారు. '''యమాయ తర్పయామి, తర్పయామి తర్పయామి'''' అంటూ మూడుసార్లు దోసెట్లో [[నీరు ]] విడిచిపెట్టడం వల్ల పితృదేవతలు సంతుష్టిచెంది ఆశీర్వదిస్తారు.
 
స్త్రీలు అభ్యంగన స్నానానంతరం కొత్త బట్టలు కట్టుకుని ఇండ్ల ముందు రంగురంగుల [[ముగ్గులు]] తీర్చి గుమ్మాలకు పసుపు , కుంకుమలు రాసి మామిడాకు [[తోరణాలు]] కట్టి సాయంత్రం లక్ష్మీపూజకు సన్నాహాలు చేసుకొంటారు. రకరకాలైన రుచికరమైన భక్ష్యభోగ్యాలతో నైవేద్యానికి [[పిండివంటలు]] సిద్దం చేయడం, మట్టి ప్రమిదలలో నువ్వుల నూనె పోసి పూజాగృహంలో, ఇంటి బయట దీప తోరణాలు అమర్చడం, ఆ రోజంతా ఎక్కడలేని హడావుడి, ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తాంటాయి.
==దిబ్బు దిబ్బు దీపావళి==
పంక్తి 60:
'''మళ్ళీ వచ్చే నాగులచవితి...<br>
అంటూ చిన్న పిల్లలంతా [[గోగునార]] కట్టలకి చిన్న చిన్న గుడ్డ ముక్కల్ని కట్టి వెలిగించి దిష్టి తీయడాన్ని మనం సంప్రదాయంగా[[సంప్రదాయం]] గా కొన్ని ప్రాంతాలల్లో చూస్తూంటాం.
సాయంత్రం ప్రదోష సమయంలో దీపాలు వెలిగించి, ముందుగా పిల్లలు దక్షిణ దిశగా నిలబడి దీపం వెలిగించడాన్ని ఉల్కాదానం అంటారు. ఈ దీపం పితృదేవతలకు దారి చూపుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ [[దీపం]] వెలిగించిన తరువాత కాళ్ళు కడుక్కుని ఇంటిలోపలకు వచ్చి తీపి పదార్థం తింటారు. అటు తరువాత పూజాగృహంలో నువ్వులనూనెతో ప్రమిదలు వెలిగించి దీపలక్ష్మికి నమస్కరించి కలశంపై లక్ష్మీదేవిని అవాహన చేసి విధివిధానంగా పూజిస్తారు.
పూజానంతరం అందరూ ఉత్సాహంగా [[బాణాసంచా]] కాల్చడానికి సంసిద్దులౌతారు. చిచ్చుబుడ్లు, విష్ణుచక్రాలు, భూచక్రాలు, మతాబులు, కాకరపువ్వొత్తులు, కళ్ళు మిరుమిట్లుగొలుపుతుంటే మరో ప్రక్క సీమటపాకాయల ఢమఢమ ధ్వనులతో మ్రోగుతుంటాయి పరిసరాలన్నీ. ఈ విధంగా బాణాసంచా కాల్చడానికి ఒక ప్రయోజనం చెప్పబడింది పురాణాలలో, ఆ వెలుగులో, శబ్దతరంగాలలో దారిద్ర్య దు:ఖాలు దూరంగా తరిమి వేయుబడి లక్ష్మీకటాక్షం సిద్దిస్తుందని, అంతేకాక వర్షఋతువులో ఏర్పడిన తేమవల్ల పుట్టుకువచ్చే క్రిమి కీటకాలు బాణాసంచా పొగలకి నశిస్తాయి.
అసుర నాశనానికి, ధర్మ ప్రతిష్టాపనకు గుర్తుగా అమావాస్యనాడు జరుపుకునే దీపావళి పండుగనాడు లక్ష్మీదేవికి ప్రతీకగా వెలుగులు విరజిమ్మే దీపలక్ష్మిని పూజించడం సర్వశుభాలు ప్రసాదిస్తుంది.
 
దీపావళి చుట్టూ అనేకానేక కథలు ఉన్నాయి. శ్రీకృష్ణుడు సత్యభామ సహకారంతో నరకాసురుణ్ణీ వధించాడు గనుక ప్రజలు ఆనందంతో మరునాడు దీపావళి సంబరం చేసుకుంటారని ఒక కథ. ఇంకో కథకూడా ఉంది. లంకలో రావణుని సంహరించి , రాముడు సీతాసమేతంగా అయోధ్యకు[[అయోధ్య]] కు తిరిగి వచ్చినప్పుడు ప్రజలు ఆనందంతో ఈ పండుగ జరుపుకున్నారని చెబుతారు. ఉత్తరాదివారు ముఖ్యంగా వ్యాపారులు దీపావళి రోజును కొత్త సంవత్సరంగా పాటిస్తారు. ఆ రోజు లక్ష్మీదేవి పూజచేసి కొత్త [[ఖాతా పుస్తకాలు]] తెరుస్తారు. దీపావళి పండుగల్లాంటివే ప్రపంచంలోని అన్ని సమాజాల్లోనూ ఉన్నాయి.
 
[[వర్గం:పండుగలు]]
"https://te.wikipedia.org/wiki/దీపావళి" నుండి వెలికితీశారు