''''ఆముదంను ఎక్కువగా సాగుచేయుచున్న దేశాలు''':
ఇండియా,బ్రెజిల్,చీనా,పరాగ్వే,యుథోఫియా,పిలిఫ్ఫిన్స్,రష్యా,మరియు థాయ్లాండ్.ఆముదపుపంట వుత్పత్తిలో ఇండియా అగ్రస్దానంలో వున్నది.ఇండియాలో ఆముదపు వుత్పత్తి ఏడాదికి 8.0 లక్షల0లక్షల టన్నులు (3లక్షలన్నుల నూనె3లక్షలన్నులనూనె).ఆ తరువాతస్దానం చీనా మరియు బ్రెజిల్లది.ఇండియాలో ఆముదపుపంటను ఎక్కువగా సాగుచెయ్యు రాష్టాలు:గుజరాత్,ఆంద్రప్రదేశ్,రాజస్దాన్, కర్నాటక, ఒడిస్సా, తమిళనాడు మరియు మహరాష్ట్రాలు. ఆంధ్రరాష్ట్రంలో ఇంచుమించు అన్నిజిల్లాలలో ఆముదంపైరుసాగులో వున్నప్పటికి కరీంనగర్,వరంగల్, మెదక్, నల్గొండ, మహబూబ్నగర్, గుంటూరు,ప్రకాశం, మరియు రంగారెడ్ది జిల్లాలలో ఎక్కువగా సాగులోవున్నది.హెక్టరుకు సగటుదిగుబడి విదేశాలపంట దిగుబడికన్న చాలాతక్కువ వున్నది.విదేశాలలో హెక్టరుకు 1200-1300 కేజిలుండగా,ఇండియాలో 350-400కీజిలు/హెక్టరుకు.దిగుబడిశాతం తక్కువగా వున్నప్పటికి ఎక్కువశాతంలో ఆముదంను వుత్పత్తిచేస్తున్నదేశంగా ఇండియా అగ్రస్దానంలోవున్నది.
'''కాయ(pod)''':
కాయగోళాకారంగా వుండి,పైనక్రిందనిక్కబడివుండును.నిలువుగా మూడు గదులుగామూడుగదులుగా విభజింపబడివుండి,ప్రతిగదిలోఒకవిత్తనం ఎర్పడును.కాయమీదమృదువైన ముళ్ళవంటివి వుండును.కాయలోని విత్తనాలు (seeds) సాగినఅండాకారంగా వుండును.పైన పెలుసుగావుండె గొధుమవర్ణపుపెంకు(hull)వుండును.పెంకుచారలను కల్గివుండును.పెంకులోపల మెత్తటి గింజ/పిక్క(kernel) వుండును, పిక్కరెండు బద్దలను కల్గివుండును.ఈపిక్కలోనే నూనెవుండును.విత్తనం10-10.5మి .మి.పొడవు,6-7మి.మీవెడల్పు,4.5-5.0మి.మీ.మందం వుండును.
'''ఆముదపువిత్తనంలోని సమ్మేళన పదార్థాల పట్టిక'''
|