జైన మతం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 77:
# అపరిగ్రహం (ఇతరుల ఆస్థిని కబళించకుండుట)
సమ్యగ్విశ్వాసం అంటె జినుల మీద విశ్వాసం. సమ్యక్ జ్ఞానం అంటే అంతిమ ముక్తికి అన్ని వస్తువులలో ఉన్న జీవానికి సంబంధించిన జ్ఞానం. ఇదంతా, మామూలు గృహస్తు నిర్వాణం పొందాలంటే ఆచరింపవలసిన విధానం. సన్యాసి అంతకంటే తీవ్రమైన క్రమశిక్షణతో మలగాలి.
 
సన్యాసి అయినవాడు అహింసను తప్పనిసరిగా పాటించాలి. శాకాహారాన్ని భుజించాలి. అహింసా విధానం ఎంతవరకు వెళ్ళిందటే, భూమిలో ఉండే వానపాములు చనిపోతాయని, అసలు భూమినే దున్నవద్దన్నారు. ఆ కారణంగా జైనులు ఎక్కువ మంది నగరాలకు వలస పోయి, వ్యపారాలలో స్థిరపడ్డారంటారు.
 
అన్ని వస్తువులకు - జీవులు గాని - అజీవులు గాని - వివిధ స్థాయిలలొ చైతన్యం ఉంది. వాటికి ప్రాణం ఉంది. గాయాలైతే అవి బాధ పడతాయి. అందువలన అహింసకు అంత ప్రముఖంగా పరిగణించారు.
 
ఈ విశ్వాన్ని దేవుడు సృషించాడన్నా, దానినతడు నిర్దేశిస్తాడన్నా మహావీరుడు అంగీకరించడు. అతడి ప్రకారం సృష్టి లేదు. సృష్టి కర్త లేడు. అసలు ఈ ప్రపంచ కాన్ని వివరించటానికి ఏ రకమైన సృష్టి కర్త అవసరం లేదు. అతడి ఉద్దేశ్యంలో దేవుడు అంటే అంతర్గత శక్తులు పూర్తిగా అభివ్యక్తమైన మానవుడు, పరిపూర్ణ మానవుడు.
 
వేదాధికారాన్ని తిరస్కరించాడు. కర్మ కాండను కాదన్నాడు. బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని త్రోసిరాజన్నాడు
 
== ఆంధ్రప్రదేశ్ లో జైన మతం ==
"https://te.wikipedia.org/wiki/జైన_మతం" నుండి వెలికితీశారు