స్వకులసాలి: కూర్పుల మధ్య తేడాలు

మొలక విస్తరన జరుగుతున్నది
మొలక విస్తరణ
పంక్తి 2:
 
==చరిత్ర==
[[ఋగ్వేదం]] మరియు [[సామవేదం]] లలో వీరు బ్రాహ్మణ జాతి యొక్క మూలాలు కలిగియున్నదని తెలియుచున్నది. ఆ సమయంలో వీరు బ్రాహ్మణ ఆచారాలతో మాత్రమే జీవించెడివారు. ఆ తర్వాత వీరి కులం [[క్షత్రియులు]] గా మారినది. ఈ సమయంలో వీరు వైదిక జ్ఞానాన్ని ఒకప్రాంతం నుండి వేరొక ప్రాంతానికి విస్తరించెడివారు.
 
[[ఆదిమయ]] అనే వాడు అందరికీ వస్త్రాలను అందిచే పుణ్య పురుషుడిని సృష్టించాల్సిందిగా శివుణ్ణి ప్రార్థించాడు. ఆదిమయ యొక్క సూచనల మేరకు శివుడు అతని నాలుక నుండి (జిహ్వ) ఒక శిశువును [[శ్రావణం|శ్రావణ మాసం]] , [[త్రయోదశి]], [[సోమవారం]] ఉదయం నందు సృష్టించాడు. ఆ శిశువు యొక్క నామకరనోత్సవం కైలాస పర్వతం పై జరిగినది. ఆ శిశువుకు "సాలి" అని నామకరణం చేసి అతణ్ణి అందరకూ బట్టలు నేయుట, డిసైనింగ్ చేయుట మరియు వస్త్రాలకు రంగులు వేయుటకు నిర్దేశించాడు. పార్వతీ దేవి ఆ బాలుడి యొక్క కులాన్ని "స్వకుల" అని నామకరణం చేసింది. శివుని నాలుక(జిహ్వ) నుండి ఉద్భవించినాడు కనుక ఆ బాలుణ్ణి 'జిహ్వేశ్వరుడు" అని నామకరణం చేసింది పార్వతీ దెవి. ఆ బాలుడు సూర్యోదయం నాడు జన్మించినాడు కావున ఆ బాలుడి వంశాన్ని "సూర్యవంశం" గా నిర్ణయించింది. ప్రఖ్యాత చీర "పైథాని" మొదట పైథానీ లో నేయబడింది. ఇది ప్రస్తుతం కూడా కొనసాగుతుంది. కొంతమంది ప్రజలు పైథాన్(ప్రస్తుతం ఔరంగాబాద్ జిల్లలోని మహారాష్ట్ర) నుంది వివిధ ప్రాంతాలకు వలస పోయారు. ప్రస్తుతం కూడా పైథానీ చీర ప్రసిద్ధమైనది.
 
తమ పూర్వీకులు మహారాష్ర్ట నుంచి వలస వచ్చారనీ, స్వకులశాలి కులస్తులు అంటారు. స్వకుల శాలి కులస్తులు సైని కులకు వస్త్రాలు నేయటానికి మరాఠీ సైన్యంతోపాటు శ్రీశై లం చేరుకున్నారు. ఇలా వచ్చిన వారిలో వృద్ధులు పైన్యం తో వెళ్లలేక వారి కుటుంబాలతో అక్కడే స్థిరపడ్డారు. ఈ క్రమంలో మరికొందరు ఆదోని, గద్వాల్‌, నారాయణ్‌పేట్‌, ధర్మవరంలలో స్థిరపడగా, కొందరు కర్నాటక ప్రాంతం లోని హుబ్లి, బెల్గాం, రాయచూర్‌లను ఎంచుకున్నారు.
 
"https://te.wikipedia.org/wiki/స్వకులసాలి" నుండి వెలికితీశారు