నాగార్జునకొండ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
}}
[[బొమ్మ:NK museum.jpg|thumb|right|250px|మ్యూజియం ప్రధాన స్థావరం.]]
సుప్రసిద్ధ బౌద్ధ దార్శనికుడు ఆచార్య [[నాగార్జునుడు]] పేర వెలసినది [[నాగార్జున కొండ]] ([[ఆంగ్లం]]: Nagarjunakonda). శాతవాహన చక్రవర్తి [[యజ్ఞశ్రీ శాతకర్ణి]] నాగార్జునుని కొరకు శ్రీపర్వతంపై మహాచైత్య విహారాలను నిర్మించాడని ఇతిహాసం తెలియజేస్తుంది. [[నాగార్జున సాగర్]] నిర్మాణ సమయంలో బయల్పడిన, క్రీ.పూ.2వ శతాబ్ధపుశతాబ్దపు బౌద్ధావశేషాలను [[జలాశయం]] మధ్య కొండపై నిర్మింపబడిన [[నాగార్జునకొండ ప్రదర్శనశాల]] ([[ఆంగ్లం]]: Nagarjunakonda Museum) లో భధ్రపరిచారుభద్రపరిచారు. ఈ ద్వీపపు [[మ్యూజియం]] ప్రపంచంలోనేప్రపంచంలోని పురావస్తు ప్రదర్శనశాలలన్నిటిలోనూ అతిపెద్ద ద్వీప ప్రదర్శనశాల (Island Museum). [[బుద్ధుడు|బుద్ధునివిగా]] చెప్పబడుతున్న దంతావశేషం, కర్ణాభరణం ఇందులో చూడదగ్గవి.
== పేరువెనుక చరిత్ర ==
ఖాండవదహన సమయంలో అర్జునుడు శరపరంపరగా కురిపించిన బాణాగ్ని ధాటికి కోటానుకోట్ల నాగులు శలభాల్లా మాడిమసై పోయాయట! దీంతో మొత్తం నాగజాతే అంతమై పోతుందేమోనన్న భయం నాగరాజుకు పట్టుకుందట. వెంటనే నాగరాజు వాసుకితో కలసి అర్జునుడిని శరణు వేడిరదటవేడిందట. కరుణించిన అర్జునుడు దూరంగా ఉన్న కొండప్రాంతంలో నివశించ మని ఆదేశించాడట. అర్జునుడి రక్షణ పొందిన నాగులున్న కొండ కాబట్టి దీన్ని నాగార్జునకొండ అనిపిలుస్తున్నారు. అయితే ` సినిమా యాక్టర్‌ నాగార్జున తన తొలి సినిమా విక్రమ్‌ షూటింగ్‌కోసం ఈ కొండ ఎక్కాడనీ, దాంతో ఈ కొండ నాగార్జునకొండ అయ్యిందని నేటి పిల్లకాయలంటే మాత్రం మనం ఏం చెయ్యలేం!
 
==భౌగోళికం==
నాగార్జునకొండ [[కృష్ణా నది]] కి దక్షిణ తీరాన 16.31 ఉత్తర అక్షాంశము, 79.14 తూర్పు రేఖాంశములపై ఉన్నది. ఇది [[గుంటూరు]] నుండి సుమారు 147 కి.మీ. దూరంలోను, [[హైదరాబాదు]] నుండి సుమారు 166 కి.మీ. దూరంలోను ఉన్నది. దగ్గరలోని రైలు కేంద్రము [[మాచర్ల]] సుమారు 22 కి.మీ.దూరంలో ఉన్నది.
 
==చరిత్ర==
[[నాగులు]], [[యక్షులు]] మొదలైన ప్రాచీనాంధ్ర జాతులు ఈ ప్రాంతంలో నివసించేవారు. ప్రాచీన శాసనాలలో ఈ ప్రాంతం పేరు శ్రీపర్వతం. ఈ లోయ [[శాతవాహనులు|శాతవాహన]] రాజ్యంలో ఉండేది. దీనికి దగ్గరలో సెఠగిరి ఉండేది. నాగార్జునకొండలో లభించిన వసుసేనుని శాసనం ప్రకారం అభీరసేనుని సేనాని శివసేపుడు సెఠగిరిపై అష్టభుజ స్వామి ఆలయాన్ని నిర్మించాడు. సెఠగిరి జనాదరణ పొందిన హిందూ క్షేత్రం. ఇది శాతవాహన రాజుల ఉపరాజధాని. వీరిలో చివరివాడైన [[యజ్ఞశ్రీ శాతకర్ణి]] నారార్జునాచార్యునినాగార్జునాచార్యుని కొరకు శ్రీపర్వతం పైన మహాచైత్య విహారాలను నిర్మించాడు.
 
[[ఇక్ష్వాకులు]] ఇక్కడ శాతవాహనుల సామంతులుగా ఉండేవారు. వీరిలో వాసిష్ఠీపుత్ర శ్రీఛాంతమూలుడు నాలుగో పులోమావిపై విజయాన్ని సాధించి స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించాడు. ఈ ప్రాంతంలో "[[విజయపురి]]" అనే పేరుతో నగరాన్ని నిర్మించి, తమ రాజధానిగా చేసుకున్నారు. నలుగురు ప్రముఖ ఇక్ష్వాకులలో శ్రీఛాంతమూలుడు [[అశ్వమేధ యాగం]] చేశాడు. ఇక్ష్వాకుల కాలంలో శ్రీపర్వతం - విజయపురి క్రీ.శ. 200 నుండి 300 వరకు మహోజ్వలంగా విలసిల్లింది.
 
ఇక్ష్వాకుల తర్వాత ఈ ప్రాంతాన్ని పల్లవులు ఏలినారు. ప్రాచీన పల్లవులలో ఆద్యుడైన సింహవర్మ, తమతన ప్రత్యర్ధులైనప్రత్యర్థులైన కదంబులకు సాయం చేశారనే నెపంతో ఇక్ష్వాకు వంశాన్ని తుదముట్టించి, బౌద్ధక్షేత్రాలను విజయపురిని ధ్వంసంచేశాడు. కర్ణాటకలోని కదంబ వంశ స్థాపకుడైన మయూరశర్మ శ్రీపర్వతాన్ని ఆక్రమించి, స్థావరం చేసికొని, బృహద్బాణులను జయించి, పల్లవులతో యుద్ధం చేశాడు. తర్వాత పల్లవులతో సంధిచేసికొని శ్రీపర్వతం వదలివెళ్ళాడు.
 
ఈ ప్రాంతంలో తర్వాత [[విష్ణు కుండినులు]] స్వతంత్ర రాజ్యం స్థాపించి క్రీ.శ. 370 నుండి 570 వరకు పాలించారు. వీరి కులదైవం శ్రీపర్వతస్వామి అనే బుద్ధదేవుడు. వీరు [[విష్ణుమూర్తి]] యొక్క తొమ్మిదవ అవతారంగా బుద్ధదేవున్నిబుద్ధదేవుని ఆరాధించారు.
 
కొంతకాలం తర్వాత ఈ ప్రాంతము [[కాకతీయులు|కాకతీయుల]] పాలనలోకి వచ్చినది. కాకతీయులలో ప్రోలరాజు కుమారుడు బేతరాజు అనుమకొండలో శివాలయాన్ని నిర్మించాడు. కాకతీయుల అనంతరం ఈ ప్రాంతం కొద్దికాలం [[ఢిల్లీ]] సుల్తానుల పాలనలో ఉన్నది.
 
[[కొండవీడు]] రాజధానిగా పాలించిన రెడ్డి రాజుల కాలంలో ఈ ప్రాంతం లో నాగార్జునగిరి దుర్గాన్ని నిర్మించి, వారి రాజ్యానికి చెందిన సైనిక స్థావరాలలో దక్షిణ దుర్గంగా ఉంచారు. తర్వాత [[గజపతులు]] నాగార్జునకొండను వశపరచుకొని వారి ప్రతినిధిని ఉంచారు. పురుషోత్తమ గజపతి కాలంలో ఈ ప్రాంతం అతని ప్రతినిధి శ్రీనాథ రాజసింగరాయ మహాపాత్రుని ఆధీనంలో ఉన్నది. వీరు 1413లో1413 లో ఇక్కడ నాగేశ్వరలింగ ప్రతిష్ఠ చేశారు.
 
క్రీ.శ. 1513 నుండి 1519 వరకు శ్రీకృష్ణదేవరాయల కళింగ దండయాత్ర జరిగింది. ఉదయగిరితో మొదలైన ఈ దండయాత్ర కందుకూరు, వినుకొండ, అద్దంకి, కవుతారం, తంగెడ, నాగార్జునకొండ, బెల్లంకొండ వరకు సాగింది. రాయలు గజపతుల సైనిక స్థావరాన్ని నిర్మూలించి, వశం చేసుకున్నారుచేసుకున్నాడు. నాగార్జునకొండలో అయ్యలయ్య, వీరభద్రయ్య అనే సానాధిపతులనుసేనాధిపతులను ఉంచాడు. వీరు నాగార్జునకొండను రాజకీయ పాలనాకేంద్రంగా చేశారు. నాగార్జునకొండ పేరు మొదటిసారిగా వీరి శాసనాలలో కన్పిస్తుంది. 1565 [[తళ్ళికోట యుద్ధం]] లో విజయనగర పతనం తర్వాత, ఈ దుర్గం గోల్కొండ నవాబుల ఆదీనమైనదిఆధీనమైనది. చివరి [[కుతుబ్ షాహీ]] ప్రభువుల శాసనాల ప్రకారం నాగార్జునకొండ దుర్గాన్ని నేటి కడప జిల్లాలోని [[పుష్పగిరి]] పీఠానికి అగ్రహారంగా ఇచ్చారు.
 
==శాసనాలు==
"https://te.wikipedia.org/wiki/నాగార్జునకొండ" నుండి వెలికితీశారు