రేమెళ్ళ అవధానులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
డాక్టర్ రేమెళ్ళ అవధానులు గారు తూర్పు గోదావరి జిల్లా కోనసీమలోని పొడాగట్ల పల్లిలో జన్మించారు. 1969 లో పరమాణు భౌతిక శాస్త్రం లొ ఎమ్మెస్సీ చేసారు. రాజోలు
డిగ్రీ కళాశాలలీ పిజిక్స్ లెక్చరర్ గా వుద్యోగం చేశారు. అలా వుద్యోగం చేస్తూ ఖాళీ సమయాన్ని వృధా చేయక తనకిష్టమైన వేదాలను నేర్చు కోవాలనే అభిలాష కొద్దీ దగ్గరలో వున్న వేద పాటశాలకు వెళ్ళి వేదాలను నేర్చుకునేవారు. కానీ 1971 లో హైదరాబాద్ లో ఇ.సి.ఐ.ఎల్ కంపెనీలో వుద్యోగం రావడంతో హైదరాబాద్ వచేశారు. ఇ.సి.ఐ.ఎల్ భారత దేశంలోనె మొట్టమొదటి కంప్యూటర్ల తయారీ కంపెనీ. ఆ కంపెనీలో శిక్షణలో భాగంగా కొన్ని పుస్తకాలు చదువుతుంటే .......... ఎ ప్లస్ బి హోల్ స్కేర్ అనే గణిత సమస్య చరిత్ర కనబడింది. దానిని మన భారతీయులు మూడు వేల ఏండ్ల క్రిందటే కనుగొన్నారని తెలిశాక మన ప్రాచీన గ్రంధాలపై మరింత ఆశక్తి పెరిగింది అవదానుల గారికి. ఇ.సి.ఐ.ఎల్ లో ఎనిమిదేండ్లు పనిచేసి తిరిగి వేదాద్యయానాన్ని కొనసాగించారు.
 
;కంప్యూటర్ లోకి తెలుగు:
అప్పటికి ఏ భారతీయ భాషనూ కంప్యూటకరించలేదు. అందు చేత తెలుగును కంప్యూటకరించాలనే ఆలోచన చ్చింది. అవదానులు గారు తన మిత్రులతో కలిసి ఆరు నెలల పాటుశ్రమించి తెలుగు అక్షరాలను కంప్యూటర్ లో పెట్టారు. ఆవిధంగా 1976 లో భారత దేశంలో.... కంప్యూటర్ లోకి ఎక్కిన మొట్టమొడటి భారతీయ భాష ''తెలుగే''. అప్పట్లో తెలుగు అధికార భాషా సంఘ అధ్యక్షుడు వావిలాల గోపాల కృష్ణయ్య అభినందనలతో ... కంప్యూటర్ లో తెలుగు అనే వార్త దేశవ్వాప్తంగా సంచలన మైంది. ఈ వార్థ పార్లమెంటు వరకూ వెళ్ళి..... కంప్యూటర్ లోకి తెలుగు వచ్చినపుడు ..... హింది ఎందుకు రాదు అని ఎం.పీ లందరు తన పై అధికారులకు లేఖలు వ్రాశారు. ఆవిధంగా హిందీని కూడ కంప్యూటలో పెట్టే పని చేశారు. దాంతో పార్లమెంటరీ కమిటీ వీరి పని తీరుపై సంతృప్తి చెంది ఇంకా అభివృద్ది చేయాలని కోరింది.
 
హైదరాబాద్ లో NIMS డైరెక్టర్ కాకర్ల సుబ్బారావు గారితో పరిచయం ఏర్పడింది. వారి కోరికమేరకు NIMS ను కంప్యూటీకరణ చేసి అక్కడే సుమారు 18 సంవత్సరాలు పని చేశారు.
"https://te.wikipedia.org/wiki/రేమెళ్ళ_అవధానులు" నుండి వెలికితీశారు