శారద కాండ్రు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
== ;శారద కాండ్రు:==
 
శారద కాండ్రు అనే వారు ఒక్క తెలంగాణాలో తప్ప కోస్తా ఆంధ్ర దేశంలోనూ, రాయల సీమలోనూ ఎక్కడా కనిపించరు. అయితే తెలంగాణాలో కూడా ఒక్క వరంగల్ తాలూకా లోనే వీరు ఎక్కువ మంది వున్నారు.
పంక్తి 5:
నిజానికి బుర్రకథ వాయిద్యాలకూ, సారద కథకుల వాయిద్యానికీ పెద్ద వ్వత్యాసం ఎమీ కనిపించదు. బుర్ర కథలో మాదిరే వీరూ డక్కీలు ఉపయోగిస్తారు. వీరు ఉపయోగించే తంబురానే శారద అంటారు. అందు వల్ల వీరికి శార కాండ్రు అనే పేరు వచ్చింది.
 
==;అసలు వీరెవరు?==
 
మున్నూరు, ముతరాసి మొదలైన తెలుగు కులాల నుంచి పుట్టిన ఒక జాతి ఈ శార కాండ్రనీ భిక్షక ల్జాతుల్లో వీరే ఎక్కువ మంది వున్నారనీ పూర్వం ఈ జాతికి వారికి ఎటువంటి పేరుండేదో తెలియ జెప్ప చారిత్ర కాధారాలు ఏమీ లేవనీ, వీరికి పేరు ఇటీవలే వచ్చి వుండ వచ్చుననీ, ముఖ్యంగా జానపద కేయాల్లో శారద పాటలు పాడేవారు. ఈ జాతి వారే పాడుతున్నారనీ, ఇతర జానపద గేయాలలో కంటే, ఈ శారద పాటల్లోనే సాహిత్య ప్రతిభ అధికంగా వుండుందనీ,
పంక్తి 14:
అనే వంత పాటలు పాడటం వల్ల, వీరికీ పేరు వచ్చిందేమో తెలియదనీ, డా: రామ రాజు గారు, తమ కేయ సాహిత్యంలో ఉదహరించారు.;
 
==;శారదంటే:==
 
శారదను భుజంమీద ధరించిన కథకుడు............... ఎడమ చేతి బొటన వ్రేలుకు ఆందెలు ధరించి, భుజంపైన తంబురాను కుడిచేతితో మీటుతాడు. దీనినే వారుశారద అని పిలుస్తారు. శారద అంటే సరస్వతి అనే పేరు సర్వ సాధారణంగా అందరికీ తెలిసిన విషయమే. అదే పేరును ఈ భిక్షకులు తంబురాకు శారద అనే పేరు పెట్టుకున్నారు. అందు వల్లనే వారు కథా ప్రారంభంలో శారదా దేవినే స్తోత్రం చేస్తారు.
పంక్తి 22:
వివిధ వరుసల్లో జంగం కథలు, బుర్ర కథలు సాగి నట్లు, శారద కథలు వుండవు. ఒకే వరుసలో ఆయా ఘట్టాల ననుసరించి, సన్ని వేశాలను పండిస్తూ ఒకే వరుసలో కథను సాగిస్తారు. వీరు శారద వరుసల్లో వున్న పాటల్నే కాక ఎన్నో రకాల కథలు చెపుతారు.
 
==;వారు చెప్పే కథలు:==
 
బాలనాగమ్మ ........ రాములమ్మ ..... ఎరుకల నాంచారి ..... చిన్నమ్మ మొదలైన కరుణ రస ప్రపూరితమైన కథలతో పాటు 18 వ శతాబ్దంలో తెలంగాణా ప్రాంతాల్ని దద్దరిల్ల చేసిన సర్వాయి పాపడు కథనూ, అలాగే రెడ్డి వీరులకూ, వెలమ వీరులకూచెరువు నీళ్ళ తగాదాలో వైరుధ్యాలుపెరిగి .... కొండల్రాయుని తండ్రిని చంపిన వారి మీద పగ తీర్చు కోవడానికి యుద్ధానికి సిద్ధమైన పౌరుషవంతు డైన కొండల్రాయుని సాహసోపేతుడైన వీరుని కథనూ, ఈ కోవకే చెందిన సదాసివ రెడ్డి, రాజా రామేస్వర రావు..... గద్వాల సోమానాద్రి కథనూ, చారిత్రక కథలైన, బొబ్బిలి, పల్నాటి యుద్ధానికి సంబంధించిన, వీర రస గాథల్నీ చెపుతారు.
పంక్తి 28:
వీరు వరంగల్లు తాలూకాలో వున్న వెంకట రావుల పల్లి చుట్టు ప్రక్కల గ్రామాలలో ఎక్కువ మంది వున్నారు. శారద కాండ్రందరూ శైవ మతానికి సంబంధించిన వారే, వీరు మాంసాహారులైన జంగమ జాతికి చెందిన వారనె ప్రతీతి కూడా వుంది. . .... ఎల్లమ్మ ........ పోచమ్మ.............. మొదలైన ప్రసిద్ధ దేవతల్ని దైవాలుగా పూజిస్తారు. వీరికి గురువులు జంగాలే. వీరు శైవ మతానికి సంబంధిన వారైనా లింగాలను ధరించరు.
 
;సారద==శారద రామాయణం:==
 
ఇన్నీ చారిత్రిక గాధల్ని వీర రస గాథల్నీ, కరుణ రస గాధల్నీ, అద్భుతంగా వాల్మీకి రామాయణాన్నణుసరించ్ది ఒక కవి, పుత్రకామేష్టి నుండి, పాదుకా పట్టాభి షేకం వరకూ, శారద వరుసలకు అనుగుణంగా వ్రాసిన శారద రామాయాణాన్నీ ఎంతోభక్తి శ్రద్ధలతో చెపుతారు.......... ఇదే కత్ఘను, ఆంధ్ర దేశంలో పగటి వేషాలు ధరించే వారు. రోజు కొక వేషం చొప్పున రోజుల తరబడి వేషాలు ధరించే పగటి వేషధారులు, శుభ సూచకంగా భక్తి భావంతో, శారద రామాయణాన్ని అలాపించి గ్రామస్తుల వద్ద డబ్బునూ, వస్గ్త్రాలనూ, ధాన్యాన్నీ దానాలుగా సంపాదిస్తారు. అయితే వీరు శారద కాండ్ర వరుసలో ఈ రామాయాణాన్ని చెప్పరు. మూల కథను తీసుకుని క్లుప్తంగా వివరిస్తారు. శారద కాండ్రు ఈ కళా రూపాన్ని, జోవ నోపాధి కోసమే ఉపయోగించు కున్నారు. అయినా ఇదొక చక్కని జానపద బాణీ. రోజు రోజుకీ ఈ కథలకు ఆదరణ తగ్గి పోతూ వుంది.
"https://te.wikipedia.org/wiki/శారద_కాండ్రు" నుండి వెలికితీశారు