లక్షద్వీప్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 38:
లక్షద్వీపాలు 12 పగడపు దీవులు, మూడు సముద్రాంతర్గత దిబ్బలు, ఐదు సముద్రంలో మునిగిన తీరాలు కలిగి ముప్పై తొమ్మిది ద్వీపాలు అతిస్వల్ప ద్వీపసముదాయాలు కలిగిన ద్వీపాలతో నిండిన సముద్రము. దిబ్బలు కూడా పగడపు దీవులే అయినప్పటికీ తీరాలు పూర్తిగా సముద్రంలో మునిగి వృక్షజాలం ఏమీలేని ఇసుక దిబ్బలే. మునిగిన తీరాలు పగడపు రాళ్ళతో నిండి ఉన్నాయి. అన్ని పగడపు రాళ్ళు అగ్నేయ, ఈశాన్య తీరాలలో చాలా వరకు తూర్పుతీరంలో ఆవృతమై ఉన్నాయి. అధికముగా మునిగి ఉన్న దిబ్బలు పడమటి దిశగా మడుగులతో నిండి ఉన్నాయి. ఈ ద్వీపాలలో 10 మానవ నివాసిత ద్వీపాలు. 17 మానవరహిత ద్వీపాలు, అతి చిన్న ద్వీప సముదాయాలు వీటి సమీపంలో ఉన్నాయి, 4 కొత్తగా ఏర్పడిన ద్వీపాలు మరియు ఐదు మునుగిన దిబ్బలు. వీటిలో ప్రధాన దీవి అయిన కరావట్టిలో లక్షద్వీప రాజధని నగరం అయిన కరావట్టి నగరం ఉంది ఈ ద్వీపంతో ఆగట్టి, మినికాయ్ మరియు ఆమ్ని దీవుల మొత్తం జనాభా 2011 జనభా గణాంకాలను అనుసరించి 60, 595. ఆగట్టిలో ఉన్న విమానాశ్రయం నుండి కేరళా లోని కొచ్చిన్ లేక ఎర్నాకుళం వరకు నేరుగా వెళ్ళే విమానాలు ఉన్నాయి.
విదేశీ ప్రయాణీకులు ఈ ద్వీపాలను సందర్శించడానికి అనుమతి లేదు. ప్రస్తుత భారతదేశ మధ్యపాన చట్టములను అనుసరించి లక్షద్వీప ద్వీపసముద్రములో మధ్యపానము ఒక్క బెంగారామ్ ద్వీపంలో తప్ప మిగిలిన అన్ని ద్వీపాలలో నిషేధించబడింది.
 
అరేబియా సముద్రంలో ఆఫ్రికా - ఆసియా ఖండాల వ్యాపార మార్గంలో ఉన్నాయి లక్షద్వీప్ దీవులు. పోర్చుగీసు నావికుడు వాస్కోడిగామా భారత తీరాన్ని చేరింది కూడా ఈ దీవుల మీదుగానే. వీటి పేరు లక్షదీవులు... అనే కానీ మనదేశంలోని యూనియన్ టెరిటరీల్లో చిన్నది ఇదే. భూభాగం అంతా కలిపితే విస్తీర్ణం 32 చదరపు కిలోమీటర్లకు మించదు. ఒక మోస్తరు పెద్ద దీవులు 36 ఉన్నప్పటికీ పది దీవులే జనావాసాలు. పది సబ్ డివిజన్లతో ఒకే ఒక జిల్లా ఇది. జనాభా పది దీవుల్లో కలిసి 65 వేలకు మించదు. స్థానికుల్లో ఎక్కువ శాతం మలయాళీలే. అధికార భాష కూడా మలయాళమే, మినికోయ్ దీవిలో నివసించే వాళ్లు మాత్రం మహిల్ భాష మాట్లాడుతారు. ఇది మాల్దీవుల్లో మాట్లాడే భాష. ఈ దీవి మిగిలిన దీవుల సమూహానికి దూరంగా విసిరేసినట్లు ఉంటుంది. ఇక్కడి ప్రజల జీవనశైలి మిగిలిన దీవులకు భిన్నంగా ఉండదు, కానీ భాష వేరు.
 
== భారతీయ పగడపు దీవులు ==
"https://te.wikipedia.org/wiki/లక్షద్వీప్" నుండి వెలికితీశారు