ఎలకూచి బాలసరస్వతి: కూర్పుల మధ్య తేడాలు

చి C.Chandra Kanth Rao ఏలకూచి బాలసరస్వతి పేజీని ఎలకూచి బాలసరస్వతికి దారిమార్పు లేకుండా తరలించారు
విలీనం చేసిన వ్యాసంలోని సమాచారం చేర్చుట
పంక్తి 1:
ఎలకూచి బాల సరస్వతి జన్మతః పాలమూరు జిల్లా వాడు కాకపోయినా, కాకలుదీరిన కవిగా ఘనతికెక్కినది మాత్రం పాలమూరు జిల్లాకు చెందిన [[జటప్రోలు సంస్థానము]]లోనే. [[నెల్లూరు]] జిల్లా [[పొదిలి]] తాలుకాలోని [[ఎడవిల్లి అగ్రహారం]] వీరి జన్మస్థానం<ref>ఆరుద్ర, సమగ్ర ఆంధ్ర సాహిత్యం,10వ సంపుటం,నాయకరాజుల యుగం-1, ఎమెస్కో,మద్రాస్,1966, పేజి-29 </ref>. ఇతడు క్రీ.శ పదునారవ శతాబ్దము చివరను పదునేడు పుర్వార్థమున ఉండినట్లు చారిత్రక ఆధారములున్నవి. వీరు కొంత కాలం [[విజయనగరం]]లో గడిపారు. తరువాత [[తెలంగాణ]]లోని పర్తియాల సంస్థానానికి చేరుకొని రాజా జూపల్లి వెంకటాద్రి దగ్గర కొంత కాలం పనిచేసి, సురభి ముమ్మడి మల్లానాయుడి కాలంలో జటప్రోలు సంస్థానానికి చేరుకోని వారి కుమారుడైన సురభి మాధవరాయల ఆస్థాన కవిగా పనిచేస్తూ అక్కడే స్థిరపడిపోయాడు.
{{విలీనం|ఎలకూచి బాలసరస్వతి}}
==సాహితీ ప్రస్థానం==
ఏలకూచి బాల సరస్వతి కృష్ణా మండల నివాసి. జటప్రోలు సంస్థానాశ్రయుడు. ఇతడు క్రీ.శ పదునారవ శతాబ్దము చివరను పదునేడు పుర్వార్థమున ఉండినట్లు చారిత్రక ఆధారములున్నవి. ఇతనికి మహోపాధ్యాయ బిరుదము గూడ కలదు. అందువల్ల యితడు కవిగా కాక యెక్కువ పండుతుడని ప్రసిద్ధికెక్కినాదు. యితడు శతాగ్ర ప్రబంధ కర్త యగుటచే నితడు సంస్కృతాంధ్ర ములందు రెండిట ఉద్దండుడని తెలియుచున్నది. ఈయన తాను రచించిన యాదవ రాఘవ పాండవీయ మను త్ర్యర్థికావ్యమున స్వ విషయము నిట్లు వర్ణించి కొని యున్నాడు.
ఎలకూచి బాలసరస్వతి అసలు పేరు "ఎలకూచి వెంకటకృష్ణయ్య". బాల్యంలోనే అసమాన్యమైన ప్రతిభా పాండిత్యం చూపడం వలన వీరికి బాల సరస్వతి అను బిరుదు వచ్చింది. ఆ బిరుదునామమే వీరి వ్యవహార నామంగా స్థిరపడిపోయింది. వీరి తండ్రి గారు కృష్ణయ్య. తెలుగు సాహిత్యంలో మహామహోపాధ్యాయగా గణతికెక్కిన తొలి సాహితీవేత్తగా బాలసరస్వతికి పేరుంది.<ref>పాలమూరు సాహితీ వైభవం, రచన: ఆచార్య ఎస్వీ రామారావు, ముద్రణ 2010, పేజీ 20</ref> ఆరు భాషలలో పండితుడు. "షడ్భాషా వివరణము" అనే వీరి గ్రంధం ఆ విషయాన్ని ఋజువుచేసేదేనని పండితుల అభిప్రాయం. రంగకౌముది అను నాటకాన్ని, కార్తికేయాభ్యుదయం, వామన పురాణం, బాహటం అనే ప్రబంధాలు రచించాడు. భ్రమరగీతాలు రాశాడు. వీరు విజయనగరంలో ఉండిన కాలంలోనే [[నన్నయ్య]] రాసిన ఆంధ్రశబ్ధచింతామణికి వ్యాఖ్యానం రాశాడు. అయితే ఈ గ్రంథం నన్నయ రాయలేదని, బాలసరస్వతే రాసి, దానికి గౌరవం కలిగించడం కొరకు నన్నయ పేరు పెట్టి ఉండవచ్చునని కొందరి వాదన. తరువాత త్ర్యర్థి కావ్యంగా ' రాఘవ యాదవ పాండవీయం ' అను కావ్యాన్ని రాశాడు. ఇది నాలుగు ఆశ్వాసాల కావ్యం. [[శ్రీ వేంకటేశ్వరుడు|తిరుపతి వెంకటేశ్వరుని]]కి అంకితం ఇచ్చాడు. పర్తియాల సంస్థానాధిపతి జూపల్లి వెంకటాద్రి కోరిక మేరకు భీముడు, కాశీరాజు కూతురు నాయకా, నాయికలుగా "చంద్రికా పరిణయం" అను ప్రబంధ కావ్యాన్ని రాశాడు. ఈ గ్రంథంలో పర్తియాల సంస్థానానికి చెందిన జూపల్లి వారి వంశ చరిత్ర వివరించబడింది. అటుపిమ్మట జటప్రోలు సంస్థానానికి వచ్చి [[సురభి మాధవరాయలు|సురభి మాధవరాయ]]ల కోరిక మేరకు భరృహరి సుభాషిత త్రిశతిని తెలుగు చేయడానికి పూనుకున్నాడు. భరృహరి సుభాషితాలను అనువాదం చేసిన తొలి తెలుగువాడు కూడా ఎలకూచి బాలసరస్వతే. మాధవరాయల తండ్రి మల్లానాయుడి పేరు మీదగా 'మల్ల భూపాలీయం' గా అనువాదం చేసి ముమ్మడి మల్లానాయుడుకు అంకితమిచ్చాడు.<ref>తెలంగాణ సాహిత్య వైశిష్ట్యం, రచన: ఆచార్య ఎస్వీ రామారావు, ముద్రణ 2012, పేజీ 76</ref> ఇందులో నీతి, శృంగార, వైరాగ్య శతకాలన్నిటిలోనూ మల్లనాయిని మకుటంతోనే చెప్పటం విశేషం. ' సురభి మల్లా! నీతి వాచస్పతీ!' మకుటంతో నీతి శతకాన్ని, ' సురభి మల్లా! మానినీమన్మథా!' మకుటంతో శృంగార శతకాన్ని, 'సురభి మల్లా! వైదుషీ భూషణా!" మకుటంతో వైరాగ్య శతకాన్ని రాశాడు. ఎలకూచి బాలసరస్వతి రాసిన చివరి గ్రంథం కూడా ఇదేనని పండితుల అభిప్రాయం. ఈ అనువాదానికి ఆనందించిన సురభి మాధవరాయలు ఎలకూచి బాలసరస్వతికి రెండువేల దీనారాలు ఇచ్చి సత్కరించాడు ఈ విధంగా జటప్రోలు సంస్థానానికి బాలసరస్వతి గౌరవాన్ని చేకూర్చితే, బాలసరస్వతికీ జటప్రోలు సంస్థానం గౌరవాన్ని చేకూర్చింది.
 
ఏలకూచి బాల సరస్వతి కృష్ణా మండల నివాసి. జటప్రోలు సంస్థానాశ్రయుడు. ఇతడు క్రీ.శ పదునారవ శతాబ్దము చివరను పదునేడు పుర్వార్థమున ఉండినట్లు చారిత్రక ఆధారములున్నవి. ఇతనికి మహోపాధ్యాయ బిరుదము గూడ కలదు. అందువల్ల యితడుఇతడు కవిగా కాక యెక్కువఎక్కువ పండుతుడని ప్రసిద్ధికెక్కినాదుప్రసిద్ధికెక్కినాడు. యితడు శతాగ్ర ప్రబంధ కర్త యగుటచే నితడు సంస్కృతాంధ్ర ములందు రెండిట ఉద్దండుడని తెలియుచున్నది. ఈయన తాను రచించిన యాదవ రాఘవ పాండవీయ మనుపాండవీయమను త్ర్యర్థికావ్యమున స్వ విషయముస్వవిషయము నిట్లు వర్ణించి కొని యున్నాడు.
==స్వీయ చరిత్ర పద్యములు==
{{వ్యాఖ్య|<big>కవిమాహి తరంగ కౌముదీనామ నాటక విధాన ప్రతిష్ఠాఘనుండ</big><br /><big>సారసారస్య సచ్చంద్రికా పరిణయ ప్రముఖ శతాగ్రప్రబంధ కర్త</big><br /><big>నంధ్ర చింతామణీ వ్యాఖ్యాత భాషా వివరణాది బహుతంత్రకరణ చణుఁడ</big><br /><big>వేద శాస్త్ర పురాణ వివిధ సంగీత సాహిత్యాది విద్యోపబృంహణుఁడ</big><br /><big>ననఘ కౌండిన్య గోత్రుండ హరిపదాబ్జ, భక్తి శీలుండ నెలకూచి భైరవార్య</big><br /><big>కృష్ణదేవతనూజుండ నే విచిత్ర, కావ్యమొక్కటి నిర్మింపఁగాఁ దొడగి.</big>"}}
Line 17 ⟶ 20:
 
{{వ్యాఖ్య| <big>ఉల్లం బక్కల హంసపైఁ గుపితమై యున్న న్విరోదింపఁ గా</big><br /><big>నిల్లౌ దాని సరోజనీ వనమె మాయింప న్సమరుండు; తా</big><br /><big>నీళ్లు న్బాలును నేర్పరింపఁ గల పాండిత్యంబు మాంపంగ లేఁ</big><br />డల్లోకేశ్వరుఁ డేమెయి, న్సురభిమల్లా నీతి వాచస్పతీ.|}}
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
{{పాలమూరు జిల్లా కవులు}}
[[వర్గం:తెలుగు కవులు]]
[[ వర్గం: మహబూబ్ నగర్ జిల్లా కవులు]]
"https://te.wikipedia.org/wiki/ఎలకూచి_బాలసరస్వతి" నుండి వెలికితీశారు