పక్షవాతం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
సుల్తాన్ ఖాదర్ (చర్చ | రచనలు) |
సుల్తాన్ ఖాదర్ (చర్చ | రచనలు) |
||
పంక్తి 27:
== వైద్యం ==
దీనికి పనిచేసే మందులు:క్షీరబల తైలం, హెపారిన్.న్యూరాలజి చికిత్సతోపాటు ఫిజియోథెరపీ చికిత్స . న్యూరోమస్కులార్ ఎలక్ట్రికల్ స్టిములేషన్తో పనిచేయని కండరాల్లోని శక్తిని పెంచడానికి ఉపయోగిస్తారు. కండరాలను ఉత్తేజపరచడానికి థెరప్యూటిక్ మసాజ్, మాన్యువల్ థెరపీ ముఖ కండరాలకు వ్యాయామం చేయిస్తారు. దీని వల్ల ముఖ కండరాల్లో శక్తి పెరుగుతుంది.
*రోగి శ్వాస తీసుకోవడం, రక్తపోటు ఎలా ఉంది పరీక్షించాలి.
*[[రక్తపోటు]] ఎక్కువగా ఉన్నట్లయితే తగ్గించాలి.
*ఆక్సిజన్ అవసరమైతే ఇవ్వాలి. ఈసీజీ, షుగర్ టెస్ట్ చేయించాలి. తరువాత సీటీ స్కాన్ చేయించాలి.
*సీటీ స్కాన్లో రక్తనాళం చిట్లినట్లయితే తెలిసిపోతుంది. బ్లీడింగ్ లేనట్లయితే రక్తం సరఫరా తగ్గడం వల్ల స్ట్రోక్ వచ్చిందని నిర్ధారణ చేసుకోవచ్చు. హైబీపీ ఉంటే నెమ్మదిగా తగ్గించాలి. అదే సమయంలో మెదడులో ఒత్తిడిని తగ్గించడానికి మందులు ఇవ్వాలి. షుగర్ ఉంటే నియంత్రణలో ఉండేలా చూసుకోవాలి.
== మెదడులో మైక్రోచిప్ ==
నిశ్చలనంగా పడిఉన్న పక్షవాతం రోగుల మదిలోభావాలను గ్రహించి తదనుగుణంగా నాడీవ్యవస్థను చైతన్యపరచే 'మైక్రోచిప్'ను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దాదాపు సెంటీమీటరు వెడల్పులో ఉండే ఈ పలుచని చిప్ను మెదడులో అమరుస్తారు. రోగి ఆలోచనను పసిగట్టే ఈ మైక్రోచిప్... ఆ సంకేతాలను అచేతన అవయవాల కదలికలుగా మార్చేస్తుంది.
|