కె. లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్రంకు చెందిన రాజకీయ నాయకుడు. ముషీరాబాద్ శాసనసభ నియోజకవర్గం నుంచి 2014 ఎన్నికల్లో ప్రాతినిధ్యం వహించాడు. రాజ్య‌స‌భ సభ్యుడు.

డా. కె. లక్ష్మణ్
కె. లక్ష్మణ్


పార్లమెంటు సభ్యుడు, రాజ్యసభ
పదవీ కాలం
2022 జూలై 5
నియోజకవర్గం ఉత్తర ప్రదేశ్

మాజీ ఎమ్మెల్యే
పదవీ కాలం
1994 - 1999, 2014 - 2018
నియోజకవర్గం ముషీరాబాద్ శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1956 జూలై 3
హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం
జీవిత భాగస్వామి ఉమా
సంతానం ఇద్దరు కుమార్తెలు (శ్వేతా, శృతి), ఒక కుమారుడు (రాహుల్)
నివాసం అశోక్ నగర్, హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం
మతం హిందూ

జననం - విద్యాభ్యాసం మార్చు

కోవా లక్ష్మణ్ 1956 జూలై 3న హైదరాబాదులో జన్మించాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయం లోని పి.సి. సెంటర్ నుండి ఎం.ఎస్సీ, జియోలజీ శాఖలో పిహెచ్.డి. పూర్తిచేశాడు.

వివాహం మార్చు

లక్ష్మణ్ కు ఉమాతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు (శ్వేతా, శృతి), ఒక కుమారుడు (రాహుల్).[1]

రాజకీయ జీవితం మార్చు

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుతున్న సమయంలోనే భారతీయ జనతా పార్టీ అనుబంధమైన అఖిల భారత విద్యార్థి పరిషత్ లో చేరాడు. 1980లో బిజెపిలో చేరి, హైదరాబాద్ నగరంలో వివిధ పదవులను నిర్వర్తించి, 1995 నుండి 1999 వరకు హైదరాబాద్ బిజెపి శాఖకు అధ్యక్షులుగా పనిచేశాడు. లక్ష్మణ్ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, జాతీయ కార్యదర్శిగా కూడా పనిచేశాడు. 2016 నుండి 2020 మార్చి 10వరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించాడు.

1994లో ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి కోదండరెడ్డి చేతిలో ఓడిపోయాడు. 1994లో అదే నియోజకవర్గం నుండి ఎన్నికయ్యాడు. 2004, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి, 2014 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెండవసారి ఎమ్మెల్యేగా గెలిచాడు.[2] 2018లో అసెంబ్లీకి జరిగిన ముందస్తు ఎన్నికల్లో లక్ష్మణ్‌ ఓటమిపాలయ్యాడు.[3]


కె. లక్ష్మణ్ భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గంలో, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా 27 సెప్టెంబర్ 2020న నియమితుడయ్యాడు.[4] ఆయన 2022 మే 30న రాజ్యసభ అభ్యర్ధిగా ఖరారయ్యడు.[5] ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుండి పార్లమెంటు సభ్యునిగా రాజ్యసభకు కె.ల‌క్ష్మ‌ణ్ ఏకగ్రీవంగా ఎన్నిక‌య్యారు. ఈ మేర‌కు 2022 జూన్ 3న కేంద్ర ఎన్నికల సంఘం ప్ర‌క‌టించగా రిట‌ర్నింగ్ అధికారి నుంచి ఆయన డిక్ల‌రేష‌న్ అందుకున్నారు.

లక్ష్మణ్‌ ను 2024 జనవరి 08న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో సికింద్రాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గ ఇన్‌చార్జి బీజేపీ పార్టీ నియమించింది.[6]

మూలాలు మార్చు

  1. Hard work pays for K. Laxman
  2. Sakshi (16 May 2014). "తెలంగాణలో విజేతలు". Archived from the original on 14 April 2022. Retrieved 14 April 2022.
  3. Musheerabad (Telangana) Assembly Constituency
  4. Sakshi (19 October 2020). "లక్ష్మణ్‌కు అమిత్‌షా శుభాకాంక్షలు". Archived from the original on 1 August 2021. Retrieved 1 August 2021.
  5. Sakshi (30 May 2022). "డాక్టర్‌ కె లక్ష్మణ్‌ను రాజ్యసభ అభ్యర్ధిగా ప్రకటించిన బీజేపీ". Archived from the original on 30 May 2022. Retrieved 30 May 2022.
  6. Andhrajyothy (9 January 2024). "17 లోక్‌సభ స్థానాలకు బీజేపీ ఇన్‌చార్జిలు". Archived from the original on 9 January 2024. Retrieved 9 January 2024.