ప్రపంచ ఐటీ కాంగ్రెస్ సదస్సు - 2018

ప్రపంచ ఐటీ కాంగ్రెస్ సదస్సు - 2018 ఈ సదస్సును అంతర్జాతీయ సమావేశానికి వేదికను వరల్డ్ ఇన్ఫరేషన్ టెక్నాలజీ అండ్ సర్వీసు అలయెన్స్ (డబ్ల్యూఐటీఎస్‌ఏ) ఎంపిక చేస్తుంటుంది. ఇందులో ప్రపంచవ్యాప్తంగా 80 దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయి. ఒక దేశానికి ఒక ఐటీ సంబంధిత సంస్థను మాత్రమే సభ్యురాలిగా అనుమతిస్తారు. భారతదేశం నుంచి నాస్కామ్ ప్రాతినిధ్యం వహిస్తున్నది. నాలుగు రోజులపాటు జరిగే ఈ సమావేశానికి 50దేశాల నుంచి 3వేల మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. ప్రస్తుత డబ్ల్యూఐటీఎస్‌ఏ సెక్రటరీ జనరల్ జేమ్స్ పొసాంట్. [1]

ప్రపంచ ఐటీ కాంగ్రెస్ సదస్సు - 2018
నిర్వహించు దేశంభారతదేశం
తేదిsఫిబ్రవరి 19 - 22, 2018
వేదిక(లు)హైటెక్స్
నగరాలుహైదరాబాద్
Heads of Governmentతెలంగాణ
వెబ్సైట్https://www.nasscom.in/wcit-nilf2018/

పాల్గొనే దేశాలు మార్చు

50 దేశాలనుంచి 3వేల ప్రతినిధుల పాల్గొన్నారు. ఇందులో ప్రపంచవ్యాప్తంగా 80 దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయి.

మరిన్ని విశేషాలు మార్చు

గత 40 సంవత్సరాలుగా ఈ సదస్సులను వివిధ దేశాల్లో నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో వస్తున్న మార్పులు, ఎదురవుతున్న సవాళ్లు తదితర అంశాలపై ఇందులో చర్చిస్తారు. నాలుగు రోజుల పాటు ఈ సదస్సు హైదరాబాద్లో జరుగుతుంది.

మూలాలు మార్చు

  1. ప్రపంచ ఐటీ కాంగ్రెస్ సదస్సు. "హైదరాబాద్‌లో ప్రపంచ ఐటీ సదస్సు". నమస్తే తెలంగాణ. www.ntnews.com. Retrieved 14 February 2018.[permanent dead link]