బాణావతి నవల జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత, కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ రచించారు.

బాణావతి
కృతికర్త: విశ్వనాథ సత్యనారాయణ
విభాగం (కళా ప్రక్రియ): నవల
ప్రచురణ: విశ్వనాథ పావనిశాస్త్రి
విడుదల: 1965, 1982, 2006, 2013
దస్త్రం:Banavathinovelvishvanathasathyanarayana.jpg
బాణావతి నవల కవర్ పేజీ

రచనా నేపథ్యం మార్చు

బాణావతి నవల రచనా కాలం 1965గా గ్రంథకర్త కుమారుడు, విశ్వనాథ సాహిత్య సంపాదకుడు, ప్రచురణకర్త విశ్వనాథ పావనిశాస్త్రి నిర్థారించారు. విశ్వనాథ సత్యనారాయణ ఆశువుగా చేప్తూండగా ఆయన సహోద్యోగులు, మిత్రులు అక్కిపెద్ది సత్యనారాయణరావు లిపిబద్ధం చేశారు. ఈ నవల 1965లో ఆనాటి దినపత్రిక కృష్ణాపత్రికలో ధారావాహికగా వెలువడింది. ద్వితీయ ముద్రణ 1982లో, తృతీయముద్రణ 2006లో, చతుర్థ ముద్రణ 2013లో జరిగింది.
ఈ నవలలో విశ్వనాథ సత్యనారాయణ స్నేహితులనే పాత్రలుగా స్వీకరించారు. నవలలో వచ్చే ఉపకథలకు ఆనాడు ప్రచారంలో ఉన్న కథలే ఆధారం.[1]

ఇతివృత్తం మార్చు

పాత్రలు మార్చు

నవలలోని నేను అన్న పాత్ర రచయిత విశ్వనాథ సత్యనారాయణ. మూర్తి పాత్ర ధూళిపాళ శ్రీరామమూర్తి, వేదం వారు పాత్ర చతుర్వేదుల ఆంజనేయశాస్త్రి, రావు పాత్ర కుర్తివెంటి వెంకట సుబ్బారావు, గుప్త మెడతాడి నరసింహగుప్త లది. వారందరూ ఆనాటి విశ్వనాథ సత్యనారాయణ సహోద్యోగులు.

శైలి, శిల్పం మార్చు

ప్రాచుర్యం మార్చు

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. బాణావతి నవల (2013 ముద్రణ)లో "ఒక్కమాట" శీర్షికన విశ్వనాథ పావనిశాస్త్రి నోట్.
"https://te.wikipedia.org/w/index.php?title=బాణావతి&oldid=3270970" నుండి వెలికితీశారు