బొంతు రాజేశ్వరరావు

బొంతు రాజేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ప్రస్తుతం రూరల్‌ వాటర్‌ సప్లై సలహాదారుగా పని చేస్తున్నాడు.[1]

బొంతు రాజేశ్వరరావు
నియోజకవర్గం రాజోలు నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 28 జూన్ 1953
రాజోలు, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు ప్రభాకరరావు, విక్టోరియమ్మ
జీవిత భాగస్వామి అరుణకుమారి
సంతానం భార్గవి, ఈశ్వరి ప్రియాంక, సాయి వెంకట్‌

జననం, విద్యాభాస్యం మార్చు

బొంతు రాజేశ్వరరావు 28 జూన్ 1953లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తూర్పు గోదావరి జిల్లా, రాజోలులో ప్రభాకరరావు, విక్టోరియమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన ఎం.టెక్ పూర్తి చేసి రాష్ట్ర గ్రామీణ నీటి సరఫరా విభాగంలో ఇంజనీరింగ్ ఇన్ చీఫ్‌గా పని చేసి పదవీ విరమణ చేశాడు.[2][3]

రాజకీయ జీవితం మార్చు

బొంతు రాజేశ్వరరావు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2014, 2019లో అసెంబ్లీ ఎన్నికల్లో రాజోలు నియోజకవర్గం నుండి వైసీపీ తరఫున రాజోలు నుంచి పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన 17 జులై 2021న రాష్ట్ర పీఆర్‌ అండ్‌ ఆర్‌డీ, రూరల్‌ వాటర్‌ సప్లై సలహాదారుగా నియమితుడయ్యాడు.[4]

మూలాలు మార్చు

  1. 10TV (17 July 2021). "ఏపీలో నామినేటెడ్ పోస్టుల భర్తీ పూర్తి.. పదవులు దక్కిన వారు వీరే" (in telugu). Archived from the original on 7 January 2022. Retrieved 7 January 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  2. Sakshi (18 March 2019). "తూర్పు గోదావరి వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ప్రొఫైల్స్‌". Archived from the original on 27 November 2021. Retrieved 27 November 2021.
  3. Sakshi (18 April 2014). "బరిలో విద్యాధికులు". Archived from the original on 7 January 2022. Retrieved 7 January 2022.
  4. Andhrajyothy (18 July 2021). "'నామినేటెడ్‌' మాయ!". Archived from the original on 7 జనవరి 2022. Retrieved 7 January 2022.