మంచుపల్లకీ తెలుగు సినీ దర్శకుడు వంశీ రచించిన నవల. ఇది వంశీ రాసిన మొట్టమొదటి నవల. ఈ పుస్తకంలో అతను రాసిన మొదటి వాక్యం “ఊహ కమ్మగా ఉంటుంది, వాస్తవం కటువుగా ఉంటుంది… నిజం” [1]

మంచుపల్లకి
మంచుపల్లకి నవల ముఖచిత్రము
కృతికర్త: వంశీ
దేశం: భారత దేశము
భాష: తెలుగు
విభాగం (కళా ప్రక్రియ): నవల
ప్రచురణ: నవభారత్ బుక్ హౌస్, కార్ల్ మార్క్స్ రోడ్, విజయవాడ
విడుదల: నవంబర్ 1975

ఈ పుస్తకం మొత్తం వసుబాబు అనే పాత్ర ఆలోచనా విధానం గూర్చి నిండి ఉంటుంది. అతని జీవితపు మానసిక సంఘర్షణల ప్రయాణమంతా ఉంటుంది. ఈ ప్రయాణంలో అతనికి అర్థంకాని మనుషులూ, తనకు ఎదురైన భిన్నమైన మనస్తత్వాలు కల మనుషులతో తనకు ఇష్టం లేకపోయినా రాజీపడిన సందర్భాలు, బలహీనతల్ని పరిచయం చేసే వ్యక్తిత్వాలు ఎన్నో ఎదురవుతాయి. అతను జీవితంలో ఎవరి ప్రేమాభిమానాలనూ పొందలేక, ఏ నేరం చేయకపోయినా ప్రపంచంలో ప్రతీ జీవరాశికీ శత్రువవుతాడు. అతను ప్రతీ అడుగులోనూ ఓటమిని ఎదుర్కొంతూ ఉంటాడు. అతను ఎవరికీ అర్థంకాక అందరిచే అసహ్యించబడతాడు.

ఇతర విశేషాలు మార్చు

  • ఈ నవల నవభారత్ వారి "నవలా ప్రియదర్శని" నవలా పోటీలో ద్వితీయ బహుమతి గెలుచుకొన్నది.

మూలాలు మార్చు

  1. "సరికొత్త ప్రక్రియ - పొలమారిన జ్ఞాపకాలు -" (in అమెరికన్ ఇంగ్లీష్). 2019-09-23. Retrieved 2021-04-14.