భారతదేశ అస్సాం రాష్ట్రంలో బ్రహ్మపుత్రనదిలో ఉన్న ఒక పెద్ద నదీ ద్వీపం మజులి. ఇది ప్రపంచంలో అతి పెద్ద నదీ ద్వీపం. ఈ ద్వీపం 1,250 చదరపు కిలోమీటర్ల (483 చదరపు మైళ్లు) ప్రాంతాన్ని కలిగి ఉండేది, కానీ గణనీయమైన కోతలకు గురై దీని విస్తీర్ణం 2001 లో 421.65 చదరపు కిలోమీటర్ల (163 చదరపు మైళ్ళు) విస్తీర్ణాన్ని మాత్రమే కలిగి ఉన్నది[1]. కోతల కారణంగా మజులి కుంచించుకుపోయి చుట్టూ నది పెరిగింది. మజులి ద్వీపం చేరుకోవడానికి జోర్హాట్ సిటీ నుండి ఫెర్రీల సదుపాయం ఉంది. ఈ నదీద్వీపం రాష్ట్రంలోని అతిపెద్ద నగరమైన గౌహతి నుండి 200 కిలోమీటర్ల తూర్పున ఉంది.

మజులి
భూగోళశాస్త్రం
ప్రదేశంబ్రహ్మపుత్ర నది
అక్షాంశ,రేఖాంశాలు26°57′0″N 94°10′0″E / 26.95000°N 94.16667°E / 26.95000; 94.16667
విస్తీర్ణం1,250 km2 (480 sq mi)
అత్యధిక ఎత్తు84.5 m (277.2 ft)
నిర్వహణ
India
జనాభా వివరాలు
జనాభా153,362
జన సాంద్రత300 /km2 (800 /sq mi)

చిత్రమాలిక మార్చు

మూలాలు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=మజులి&oldid=3077828" నుండి వెలికితీశారు