మత్స్యరాస మణికుమారి

మత్స్యరాస మణికుమారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 1999లో పాడేరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పని చేసి ప్రస్తుతం మహిళా కమిషన్‌ ఉత్తరాంధ్ర రూరల్‌ ఇన్‌చార్జిగా భాద్యతలు నిర్వహిస్తుంది.[2][3]

మత్స్యరాస మణికుమారి

గిరిజన శాఖ మంత్రి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
1999 - 2004

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
1999 - 2004
ముందు కొట్టగుళ్లి చిట్టినాయుడు
తరువాత లాకే రాజారావు
నియోజకవర్గం పాడేరు నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1960
విశాఖపట్నం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
జాతీయత  భారతీయురాలు
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ
జీవిత భాగస్వామి మత్స్యరాస వెంకటరాజు[1]
వృత్తి రాజకీయ నాయకుడు

రాజకీయ జీవితం మార్చు

మత్స్యరాస మణికుమారి తన భర్త మత్స్యరాస వెంకటరాజు మరణాంతరం తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1999లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో పాడేరు నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థి లాకే రాజారావు పై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పని చేసింది.

మూలాలు మార్చు

  1. Andhra Jyothy (19 March 2022). "టీడీపీ బలోపేతానికి వెంకటరాజు కృషి మరువలేనిది" (in ఇంగ్లీష్). Archived from the original on 15 June 2022. Retrieved 15 June 2022.
  2. Andhra Jyothy (20 March 2021). "మహిళా కమిషన్‌ ఉత్తరాంధ్ర రూరల్‌ ఇన్‌చార్జిగా మణికుమారి" (in ఇంగ్లీష్). Archived from the original on 15 June 2022. Retrieved 15 June 2022.
  3. Eenadu (27 April 2022). "వ్యక్తిగత ప్రతిష్ఠకు పోవడం ఎంతవరకు సమంజసం?". Retrieved 15 June 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)