మన లిపి పుట్టు పూర్వోత్తరాలు

మన లిపి పుట్టు పూర్వోత్తరాలు పుస్తకాన్ని ప్రముఖ పాత్రికేయుడు, సంపాదకుడు, రచయిత, పరిశోధకుడు తిరుమల రామచంద్ర రచించారు. ఆయన హంపి కమలాపురం నుండి పంజాబ్ హరప్ప వరకు అనేక సాహిత్య సాంస్కృతిక పాండిత్య ప్రకర్ష గల పండితుల మధ్య ఉన్న మేధావి

రచన నేపథ్యం మార్చు

తిరుమల రామచంద్ర రచించిన మన లిపి పుట్టు పూర్వోత్తరాలు గ్రంథాన్ని మొదట 1957లో విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ ప్రచురించింది. అనంతరం 1990, 1993, 1999, 2012ల్లో పునర్ముద్రణ పొందింది. ఈ గ్రంథాన్ని తిరుమల రామచంద్ర ఆంధ్ర రాజవంశాల చరిత్ర గురించి విశేష కృషి సాగించిన ప్రముఖ చరిత్ర పరిశోధకులు మల్లంపల్లి సోమశేఖర శర్మకు, తెలుగుపత్రికలు/ప్రచురణ సంస్థలు విశాలాంధ్ర, ప్రజాశక్తిలకు అంకితమిచ్చారు.

ప్రధానాంశాలు మార్చు

ప్రపంచంలో తొలుత లిపి పుట్టడం, వివిధ భాషలలో లిపులు అభివృద్ధి జరగడం మొదలుకొని భారతీయ భాషల్లో లిపి అభివృద్ధి, తెలుగులో లిపి పుట్టుక, అభివృద్ధి వంటి అనేకాంశాలతో ఈ గ్రంథం రాశారు. తిరుమల రామచంద్ర వివిధ గ్రంథాలను మథించి అక్షరాస్యులైన తెలుగు వారంతా చదువుకునే వీలుండేలా తేలికైన భాషలో ఈ గ్రంథాన్ని రచించారు.

అధ్యాయాలు మార్చు

ఈ గ్రంథాన్ని మూడు భాగాలుగా, ఆయా భాగాలను వివిధ ప్రకరణాలుగా విభజించారు.